AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారి, చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ అహ్మద్ బాబుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార దుర్వినియోగం, ఉద్యోగులను వేధించడం, కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడం వంటి ఆరోపణలపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఘాటుగా స్పందించింది. విచారణలో భాగంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “మాకే అధికారం ఉంటే ఈ క్షణాన్నే అహ్మద్ బాబును సస్పెండ్ చేసేవాళ్లం” అంటూ ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాగద్వేషాలు కలిగిన వ్యక్తి ఐఏఎస్ అధికారిగా కొనసాగేందుకు అర్హుడు కాదని స్పష్టం చేసింది.
Read Also: Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
Also Read
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
బీపీసీ నిర్వహించి అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండా ఫైళ్లను తొక్కిపెడతారా అని కోర్టు ప్రశ్నించింది. ఇది ఉద్యోగులను వేధించడం కాదా, వారి జీవితాలతో ఆడుకోవడమే కాదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. చట్టం అన్నా, కోర్టు ఉత్తర్వులు అన్నా అహ్మద్ బాబుకు గౌరవం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. అహ్మద్ బాబుపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించాలని కోర్టు సూచించింది. సరైన ఆధారాలు లభిస్తే ఆయనను డిస్మిస్ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వగలమని తెలిపింది.
అలాగే అహ్మద్ బాబు ఇష్టారీతిన వ్యవహరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్య కార్యదర్శి ఏమి చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అదే పదవిలో ఎందుకు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అధికారులను లూప్ లైన్లో పెట్టాలని కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్ వినతిపై రాష్ట్ర ముఖ్య కార్యదర్శి తీసుకున్న చర్యల వివరాలను కోర్టు ముందు ఉంచాలని అడ్వకేట్ జనరల్ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా, పన్ను వసూళ్లలో అక్రమాలకు పాల్పడటంతో పాటు ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం. రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!