AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారి, చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ అహ్మద్ బాబుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార దుర్వినియోగం, ఉద్యోగులను వేధించడం, కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడం వంటి ఆరోపణలపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఘాటుగా స్పందించింది. విచారణలో భాగంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “మాకే అధికారం ఉంటే ఈ క్షణాన్నే అహ్మద్ బాబును సస్పెండ్ చేసేవాళ్లం” అంటూ ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాగద్వేషాలు కలిగిన వ్యక్తి ఐఏఎస్ అధికారిగా కొనసాగేందుకు అర్హుడు కాదని స్పష్టం చేసింది.
Read Also: Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
Also Read
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
బీపీసీ నిర్వహించి అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండా ఫైళ్లను తొక్కిపెడతారా అని కోర్టు ప్రశ్నించింది. ఇది ఉద్యోగులను వేధించడం కాదా, వారి జీవితాలతో ఆడుకోవడమే కాదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. చట్టం అన్నా, కోర్టు ఉత్తర్వులు అన్నా అహ్మద్ బాబుకు గౌరవం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. అహ్మద్ బాబుపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించాలని కోర్టు సూచించింది. సరైన ఆధారాలు లభిస్తే ఆయనను డిస్మిస్ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వగలమని తెలిపింది.
అలాగే అహ్మద్ బాబు ఇష్టారీతిన వ్యవహరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్య కార్యదర్శి ఏమి చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అదే పదవిలో ఎందుకు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అధికారులను లూప్ లైన్లో పెట్టాలని కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్ వినతిపై రాష్ట్ర ముఖ్య కార్యదర్శి తీసుకున్న చర్యల వివరాలను కోర్టు ముందు ఉంచాలని అడ్వకేట్ జనరల్ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా, పన్ను వసూళ్లలో అక్రమాలకు పాల్పడటంతో పాటు ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం. రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
-
Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!