AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Heatwave: ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ను దాటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తాజా హెచ్చరికలు జారీ చేస్తూ, రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగనున్నట్లు తెలిపింది. నేడు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తం 382 మండలాల్లో 40 డిగ్రీలకు మించి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎండ, ఉక్కపోత, వడగాలులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రేపటికి వడగాలుల హెచ్చరిక
రేపు అనగా శుక్రవారం రోజు రాష్ట్రంలోని 62 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరో 89 మండలాల్లో సాధారణ వడగాలులు ప్రభావం చూపనున్నాయి. ఎల్లుండి 7 మండలాల్లో తీవ్ర వడగాలులు, 31 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశముందని తెలిపింది.
Also Read
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
ప్రధాన జిల్లాలకు రెడ్ అలర్ట్
శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విజయనగరం జిల్లాలో అత్యధిక మండలాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తృతంగా వడగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసరాలు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కూడా వడగాలుల ప్రభావం ఉండొచ్చని అధికారులు హెచ్చరించారు.
రాష్ట్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు
శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కడపలో 45.1 డిగ్రీలు, సాలూరులో 45.1 డిగ్రీలు నమోదయ్యాయి. ఆళ్లగడ్డలో 44.9 డిగ్రీలు, రాజాంలో 44.5 డిగ్రీలు, కరపలో 44.4 డిగ్రీలు, కంభంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ప్రజలకు సూచనలు
అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో నీడలో ఉండటం, తరచూ నీరు తాగడం, వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు..
తాజావార్తలు
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!