Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు రైతులను కూడా మోసం చేశారు.. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇచ్చారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను కూడా మోసం చేశారని ఆరోపించారు. ముఖ్యంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఎంతమందికి లబ్ధి చేకూరిందో ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదని మండిపడ్డారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రైతులు అత్యంత కీలకమని సజ్జల పేర్కొన్నారు. పార్టీ పేరులోనే ‘రైతు’ అనే పదం ఉందని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టిలో వ్యవసాయ రంగానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. రైతు విభాగాన్ని మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలని, రైతాంగ సమస్యలపై ఎప్పుడైనా పోరాటానికి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
- Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని సజ్జల విమర్శించారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుపోయిందని, దళారులు మరియు అధికార పార్టీ నేతలు కలిసి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ పాలనలో రైతాంగ సమస్య ఏది వచ్చినా పరిష్కరించామని సజ్జల తెలిపారు. కరోనా సమయంలో కూడా రైతుభరోసా నిధులు అందించామని చెప్పారు. రైతుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని గుర్తు చేశారు. రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు సింగపూర్లో పర్యటిస్తున్నారని సజ్జల విమర్శించారు. రైతాంగ సమస్యలను పక్కనపెట్టి ఇతర అంశాలపై మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై గట్టిగా పోరాడాలని సజ్జల పిలుపునిచ్చారు. రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
-
Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!