CM Chandrababu: భారత్-పాక్ మధ్య సీజ్ఫైర్ ఒప్పందం జరగడం శుభపరిణామం!
- భారత్-పాక్ మధ్య సీజ్ఫైర్ ఒప్పందం జరగడం శుభపరిణామం
- ఉగ్రవాదంపై మన పోరాటం ఆగదు
- భారత్ను విడకొట్టాలని చాలా శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మత సంఘాలతో కలిసి ఇంటర్ ఫెయిత్ సమావేశం జరుగుతున్న సమయంలోనే భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య సీజ్ఫైర్ ఒప్పందం జరగడం శుభపరిణామం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భారత్ దేశానికి మరో దేశం మీద యుద్ధం చేయాలని ఉండదన్నారు. దేశం మొత్తం మతాలకు, కులాలకు అతీతంగా పాక్ దాడులను ఖండించాలన్నారు. ఉగ్రవాదంపై భారత్ పోరాటం ఆగదు అని సీఎం అన్నారు. భారత్ను విడకొట్టాలని చాలా శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని, అందరం ఐక్యంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. రాజ్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఇంటర్ ఫెయిత్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సహా మంత్రులు, ఉన్నతాధికారులు, మతాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇంటర్ ఫెయిత్ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘మురళీ నాయక్ దేశం కోసం అమరుడు అయ్యాడు. భారత్ దేశానికి మరో దేశం మీద యుద్ధం చేయాలని ఉండదు. దేశం మొత్తం మతాలకు, కులాలకు అతీతంగా పాక్ దాడులను ఖండించాలి. ఉగ్రవాదంతో మనం ఎప్పుడూ పోరాడుతున్నాం. సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి. రెండు దేశాలు కాల్పుల విరమణకు ముందుకు వచ్చాయి. ఉగ్రవాదంపై మన పోరాటం ఆగదు. మన ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడే కాల్పుల విరమణ ప్రకటించడం శుభపరిణామం’ అని అన్నారు.
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
‘భారత్ పరిణితి చెందిన దేశం. ఈ దేశంలో బిన్నత్వంలో ఏకత్వం చూస్తాం. ఏ మతం వారైనా అందరం భారతీయులమే. భారత్ను విడకొట్టాలని చాలా శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి, అందరం ఐక్యం గా ఉండాలి. కొన్నిసార్లు యువత కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. అన్నింటి కంటే దేశం ముఖ్యం అని గుర్తించాలి’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. ‘పహల్గామ్ దాడిలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల దాడికి సంబంధించిన అన్ని ఆధారాలు లభించాయి. పాక్ ఉగ్ర స్థావరాలపై మన సైనికులు దాడి చేశారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో దేశానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా వుంటుంది’ అని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!