CM Chandrababu: సాంకేతిక యుగంలో డేటా గొప్ప ఆస్తి.. డ్రోన్ కార్పొరేషన్ సమీక్షలో సీఎం చంద్రబాబు
- డ్రోన్ రంగంలో దిశా నిర్దేశం చేసేలా సదస్సు
- డ్రోన్ యూస్ కేసెస్ ఎన్ని చేపట్టగలమో ప్రణాళిక ఉండాలి
- ఏఏ ప్రభుత్వ విభాగాల్లో ఉపయోగించవ్చో పరిశీలించండి
- డ్రోన్..సీసీ కెమెరాలు..ఐఓటీ అనుసంధానం జరగాలి
- సాంకేతిక యుగంలో డేటా గొప్ప ఆస్తి
- డ్రోన్ కార్పొరేషన్ సమీక్షలో సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: డ్రోన్ రంగంలో దిశా నిర్దేశం చేసేలా సదస్సు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సాంకేతిక యుగంలో డేటా గొప్ప ఆస్తి అని డ్రోన్ కార్పొరేషన్ సమీక్షలో సీఎం చంద్రబాబు అన్నారు. డ్రోన్ సమ్మిట్లో యువత, విద్యార్థులు ఎక్కువ మంది భాగస్వామ్యం వహించేలా ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎగ్జిబిషన్ను కళాశాలలు, పాఠశాల విద్యార్థులు ఎక్కువ మంది తలికించే అవకాశం కల్పిస్తూ ఏర్పాట్లు చేయాలన్నారు. ఏపీని డ్రోన్ రాజధానిగా చేయడానికి ఇవన్నీ ఎలా దోహదపడతాయనే దిశగా కసరత్తు చేయాలన్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, ఐఓటీ, వాట్సాప్లను అనుసంధానం చేసుకోవడం ద్వారా రియల్ టైమ్లో సమస్యలను పర్యవేక్షించడమే కాకుండా రియల్ టైమ్లో పరిష్కారాలు కనుగొనవచ్చన్నారు.
Read Also: Cyclone Alert: ఏపీకి దూసుకొస్తున్న తుఫాను.. ముందస్తుగా చర్యలు
Also Read
- Chittoor: చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన.. తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టని కన్నకొడుకు.. కారణం ఏంటంటే?
- TSLPRB: తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..
- గూర్ఖా రెజిమెంట్కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
- Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
డ్రోన్ల యూస్ కేసెస్లో ఎన్నిటిని మనం ఉపయోగించుకోగలమనే దానిపైన ఒక అంచనా ఉండాలన్నారు. ప్రభుత్వంలో ఏఏ శాఖలు ఈ డ్రోన్లను ఉపయోగించుకునే అవకాశముంది, ఎన్నెన్ని యూస్ కేసెస్ ఉపయోగించుకోవచ్చు అనేదానిపైన ఒక స్పష్టత ఉండాలన్నారు. అవసరమైతే ప్రధానంగా డ్రోన్లను ఉపయోగించుకునే అవకాశాలున్న శాఖల ఉన్నతాధికారులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని సూచించారు. ప్రస్తుతం కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్)తో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చన్నారు. డ్రోన్ల యూస్ కేసెస్లో ఏఐకి ఉన్న అవకాశాలను పరిశీలించి ఆ దిశగా వీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కొన్ని దేశాలు డ్రోన్లను యుద్ధాలు చేయడానికి ఉపయోగించుకుంటున్నాయన్నారు. మనం అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకుందామని ముఖ్యమంత్రి అన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంతో అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. డ్రోన్ల ద్వారా ఇప్పుడు భూసార పరీక్షలు నిర్వహించవచ్చని, పంట ఎంత దిగుబడి వస్తుందో అంచనావేయొచ్చన్నారు. ఎక్కడ పంటకు తెగులు సోకిందో ఇట్టే తెలుసుకుని, పంటంతా మందులు పిచికారి చేయకుండా కేవలం తెగులు సోకిన ప్రాంతంలో మాత్రమే మందులు పిచికారి చేసి వ్యయాన్ని తగ్గించుకోవచ్చన్నారు. దోమల నివారణ, విద్యుత్తు లైన్ల పర్యవేక్షణ, రహదారుల పర్యవేక్షణ ఇలా పలు రంగాలు, పలు విధాలుగా డ్రోన్లను వినియోగించుకోవచ్చని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Jailer 2 OTT Deal: రిలీజ్ కు ముందే రజనీకాంత్ ‘జైలర్ 2’ సంచలనం.. రూ.160 కోట్ల ఓటీటీ డీల్?
-
Chittoor: చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన.. తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టని కన్నకొడుకు.. కారణం ఏంటంటే?
-
Vivo Y31T 5G: 7200mAh బ్యాటరీతో Vivo Y31T 5G.. 120Hz స్క్రీన్, 50MP కెమెరా.. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఇవే
-
ED Summons : రామ్మా చిలకమ్మా.. నిధి అగర్వాల్ కు ఈడీ పిలుపు..
-
Anupama Parameswaran: పీరియడ్స్ విషయంలోనూ అవమానించాడు.. మాజీ ప్రియుడి వేధింపులపై అనుపమ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
గూర్ఖా రెజిమెంట్కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
India All-Time Test XI: భారత్ ఆల్టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!