CM Chandrababu : మద్యం దుకాణదారులకు సీఎం చంద్రబాబు శుభవార్త
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణదారులకు శుభవార్త అందించింది
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ను పెంచే నిర్ణయం తీసుకున్నారు
- ఇప్పటి వరకు మద్యం షాపులకు 10.5 శాతం మార్జిన్ ఇస్తున్నారు
- 14 శాతం మార్జిన్ ఇవ్వాలని నిర్ణయించింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణదారులకు శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ను పెంచే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు మద్యం షాపులకు 10.5 శాతం మార్జిన్ ఇస్తున్నారు, కానీ ఈ మార్జిన్ అప్రతిపాదితంగా ఉన్నది అని, దుకాణ యజమానులు పెంచాలని కోరిన నేపథ్యంలో, ప్రభుత్వం మార్కెట్ పరిస్థితులను పరిశీలించి, తెలంగాణలో ఇచ్చిన విధంగా ఇక్కడ కూడా 14 శాతం మార్జిన్ ఇవ్వాలని నిర్ణయించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్న సందర్భంగా ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. ముఖ్యంగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. మద్యం షాపుల్లో గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయానికి సంబంధించి, వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
Also Read
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం షాపులలో 340 షాపులు గీత కులాలకు కేటాయిస్తారు. గౌడ, శెట్టి బలిజ, ఈడిగ, గామల్ల, కలాలీ, శ్రీసాయన, శెగిడి, గౌండ్ల, యాత, సోదీ వంటి కులాలకు ఈ షాపులు కేటాయిస్తారు. షాపుల కేటాయింపు ఆయా కులాల సంఖ్య ఆధారంగా నిర్ణయించబడుతుంది. ప్రతి వ్యక్తి ఒక్కొక్క షాపు కోసం ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ ఒక వ్యక్తికి ఒక్కటే షాపు కేటాయిస్తారు. ఈ షాపులు 2026 సెప్టెంబర్ 30 వరకు నడుస్తాయని ప్రకటించారు.
మరోవైపు, రూ. 99కి మద్యం అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై కూడా చర్చ జరిగింది. మద్యం అమ్మకాలు ప్రతీ సంవత్సరం పెరుగుతున్నా, తక్కువ రేట్లలో మద్యం విక్రయించడం వల్ల ప్రభుత్వానికి ఆశించిన ఆదాయం లభించడం లేదని అధికారులు తెలిపారు. అయినా, మద్యం అన్ని చోట్లా తక్కువ రేట్లలో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా ఉండాలని, మద్యం తయారీ, సరఫరా, సేల్స్ను టెక్నాలజీ ద్వారా పర్యవేక్షించి, నిబంధనల ఉల్లంఘన నివారించాలన్నారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర , ఆబ్కారీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!