CM Chandrababu: ఐఏఎస్, ఐపీఎస్లతో చంద్రబాబు భేటీ.. అధికారుల తీరుపై కీలక వ్యాఖ్యలు
- సచివాలయంలో తనను కలిసేందుకు వచ్చిన ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులతో కొద్దిసేపు సీఎం చంద్రబాబు సమావేశం
- గడచిన ఐదేళ్లలో కొందరు అఖిల భారత సర్వీసు అధికారుల వైఖరి తనను బాధించిందన్న సీఎం
- అధికారులు ఇలా వ్యవహరిస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదన్న చంద్రబాబు
- గడచిన ఐదేళ్లలో వ్యవహరించిన తీరుపై ఐఏఎస్ ఐపీఎస్ లు ఆత్మ సమీక్ష చేసుకోవాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు… ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టిసారిస్తూ.. మొదటి రోజే ఐదు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు.. ఆ తర్వాత.. సచివాలయంలో తనను కలిసేందుకు వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కొద్దిసేపు సమావేశం అయ్యారు.. ఈ భేటీలో సీఎం చంద్రబాబు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు.. గడచిన ఐదేళ్లలో కొందరు అఖిల భారత సర్వీసు అధికారుల వైఖరి తనను బాధించిందన్నారు ఏపీ సీఎం… ఐఏఎస్, ఐపీఎస్లు ఇలా వ్యవహరిస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదన్న ఆయన.. 95 నుంచి వివిధ దఫాలు సీఎంగా ఉన్నా.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు.. అయితే, గడచిన ఐదేళ్లలో వ్యవహరించిన తీరుపై ఐఏఎస్, ఐపీఎస్ లు ఆత్మ సమీక్ష చేసుకోవాలని సూచించారు.. మరోసారి శాఖల వారీగా ఐఏఎస్ , ఐపీఎస్ లతో సమావేశం అవుతానని ఈ సందర్భంగా వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
Read Also: Vijayawada Trains: రైలు ప్రయాణికులకు తీపి కబురు.. గతంలో రద్దైన విజయవాడ రైళ్ల పునరుద్ధరణ
Also Read
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు సాయంత్రం సచివాలయంలో అడుగుపెట్టారు.. తన చాంబర్లో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.. ఇక, ఆ తర్వాత వరుసగా ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు.. అయితే, తొలిసారిగా సీఎం సచివాలయానికి రావడంతో.. ఆయన్ను కలిసేందుకు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్లు క్యూ కట్టారు.. వివాదస్పద అధికారులంతా సీఎం చంద్రబాబు కోసం ఫస్ట్ బ్లాక్ వైపు పరుగులు తీశారు.. అజేయ్ జైన్, శ్రీలక్ష్మీ, పీఎస్సార్ ఆంజనేయలు, సునీల్ కుమార్, కేవీవీ సత్యనారాయణ ఇలా అంతా సీఎం చాంబర్ దగ్గరకు చేరుకున్నారు. కాగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా సీఐడీకి స్టేట్మెంట్ ఇచ్చారు అజేయ్ జైన్.. చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన నాటి ప్రభుత్వానికి పీఎస్సార్ ఆంజనేయులు పూర్తి స్థాయులో సహకరించారని అభియోగాలు ఉన్నాయి.. మాజీ సీఎం వైఎస్ జగన్తో.. నాటి సీఎంవో అధికారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని శ్రీలక్ష్మీపై ఆరోపణలు వచ్చాయి.. ఆర్థికశాఖలో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని కేవీవీ సత్యనారాయణపై ఆరోపణలు ఉన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
-
Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
-
Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
-
Earphones: రోజూ ఇయర్ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!