CM Chandrababu: ఐఏఎస్, ఐపీఎస్లతో చంద్రబాబు భేటీ.. అధికారుల తీరుపై కీలక వ్యాఖ్యలు
- సచివాలయంలో తనను కలిసేందుకు వచ్చిన ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులతో కొద్దిసేపు సీఎం చంద్రబాబు సమావేశం
- గడచిన ఐదేళ్లలో కొందరు అఖిల భారత సర్వీసు అధికారుల వైఖరి తనను బాధించిందన్న సీఎం
- అధికారులు ఇలా వ్యవహరిస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదన్న చంద్రబాబు
- గడచిన ఐదేళ్లలో వ్యవహరించిన తీరుపై ఐఏఎస్ ఐపీఎస్ లు ఆత్మ సమీక్ష చేసుకోవాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు… ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టిసారిస్తూ.. మొదటి రోజే ఐదు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు.. ఆ తర్వాత.. సచివాలయంలో తనను కలిసేందుకు వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కొద్దిసేపు సమావేశం అయ్యారు.. ఈ భేటీలో సీఎం చంద్రబాబు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు.. గడచిన ఐదేళ్లలో కొందరు అఖిల భారత సర్వీసు అధికారుల వైఖరి తనను బాధించిందన్నారు ఏపీ సీఎం… ఐఏఎస్, ఐపీఎస్లు ఇలా వ్యవహరిస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదన్న ఆయన.. 95 నుంచి వివిధ దఫాలు సీఎంగా ఉన్నా.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు.. అయితే, గడచిన ఐదేళ్లలో వ్యవహరించిన తీరుపై ఐఏఎస్, ఐపీఎస్ లు ఆత్మ సమీక్ష చేసుకోవాలని సూచించారు.. మరోసారి శాఖల వారీగా ఐఏఎస్ , ఐపీఎస్ లతో సమావేశం అవుతానని ఈ సందర్భంగా వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
Read Also: Vijayawada Trains: రైలు ప్రయాణికులకు తీపి కబురు.. గతంలో రద్దైన విజయవాడ రైళ్ల పునరుద్ధరణ
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు సాయంత్రం సచివాలయంలో అడుగుపెట్టారు.. తన చాంబర్లో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.. ఇక, ఆ తర్వాత వరుసగా ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు.. అయితే, తొలిసారిగా సీఎం సచివాలయానికి రావడంతో.. ఆయన్ను కలిసేందుకు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్లు క్యూ కట్టారు.. వివాదస్పద అధికారులంతా సీఎం చంద్రబాబు కోసం ఫస్ట్ బ్లాక్ వైపు పరుగులు తీశారు.. అజేయ్ జైన్, శ్రీలక్ష్మీ, పీఎస్సార్ ఆంజనేయలు, సునీల్ కుమార్, కేవీవీ సత్యనారాయణ ఇలా అంతా సీఎం చాంబర్ దగ్గరకు చేరుకున్నారు. కాగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా సీఐడీకి స్టేట్మెంట్ ఇచ్చారు అజేయ్ జైన్.. చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన నాటి ప్రభుత్వానికి పీఎస్సార్ ఆంజనేయులు పూర్తి స్థాయులో సహకరించారని అభియోగాలు ఉన్నాయి.. మాజీ సీఎం వైఎస్ జగన్తో.. నాటి సీఎంవో అధికారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని శ్రీలక్ష్మీపై ఆరోపణలు వచ్చాయి.. ఆర్థికశాఖలో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని కేవీవీ సత్యనారాయణపై ఆరోపణలు ఉన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..