CM Chandrababu: దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు.. అభివృద్ధికి సూచికలు..
- దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు.. అభివృద్ధికి సూచికలు..
- 2వ ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో ప్రారంభం..
- మూడు రోజుల పాటు కొనసాగనున్న టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు.. అభివృద్ధికి సూచికలు అని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తిరుపతి వేదికగా 2వ ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పోను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్తో కలిసి ప్రారంభించారు చంద్రబాబు.. మూడు రోజుల పాటుఈ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో కొనసాగనుంది.. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 55 కోట్లు మంది కుంభమేళాలో పవిత్రమైన స్నానాలు ఆచరించారు.. అంటే, దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు.. అభివృద్ధికి సూచికలు అని అభివర్ణించారు.. ఈ ఎక్స్ పో పాల్గొనడం సంతోషంగా ఉందన్న ఆయన.. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుందన్నారు.. టెక్నాలజీ వినియోగంలో మనం మరింత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.. ఇవాళ ప్రతి ఇంట్లో ఒక ఏఐ నిపుణుడు తయారు అవుతున్నాడని తెలిపారు.
Read Also: Prabhas – Mahesh : ఓపక్క మహేష్ మరో పక్క ప్రభాస్
Also Read
- 200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
- Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
ఇక, ఆధ్యాత్మిక వైపు అందరూ అడుగులు వేస్తున్నారు.. కోట్లమంది భక్తులు విరాళాలు ఇస్తున్నారు.. వాటిని విద్య, వైద్యం సహా ఇతర సేవ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నాం అన్నారు సీఎం చంద్రబాబు.. అన్నదానం ఎన్టీఆర్ ప్రారంభిస్తే.. దానికి రెండు వేల కోట్లు విరాళాలు రూపంలో వచ్చాయి.. ప్రాణాదానం ట్రస్ట్ కు 440 కోట్లు విరాళంగా వచ్చాయని వెల్లడించారు.. కుటుంబ వ్యవస్థ మనదేశానికి అతిపెద్ది ఆస్తి, బలంగా అభివర్ణించారు.. దేశ, విదేశాలలో వెంకటేశ్వర స్వామీ ఆలయాలు పెరుగుతున్నాయి.. ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను అన్నారు.. మన సంస్కృతి , వారసత్వ పరిరక్షణకు దేవాలయాలది ప్రధాన పాత్ర అని పేర్కొన్నారు.. రాష్ట్రంలో ఆలయా అభివృద్ధి, దేవాలయం సర్క్యూట్ లను ఏర్పాటు చేస్తున్నాం.. అర్చకులకు వేతాలను పెంచాం.. ఆలయాలలో దూప, దీప, నైవేద్యాలకు ఇచ్చే నగదును పెంచామని వెల్లడించారు..
Read Also: Mahindra BE6: ఈ కారులో అద్భుతమైన ఫీచర్లు.. ఓసారి లుక్కేయండి
మరోసారి ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు సీఎం చంద్రబాబు.. దేశానికి సరైనా సమయంలో సరైనా ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నారని పేర్కొన్నారు.. రాష్ట్రంలో అత్యుత్తమ రాజధానిగా అమరావతి నిర్మాణం జరుగుతుంది.. 7 నెలలో 134 కోట్లు ఆలయాల కోసం ఖర్చు చేశాం… ఆలయాల్లో పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.. తిరుమలలో 75 శాతం పచ్చదనం నెలకొని ఉంది.. ఆలయాల్లో సైతం గ్రీన్ ఎనర్జీ వినియోగంలోకి తీసుకుని వస్తా.. దేవుడి సేవ చేయడం.. అన్నిటికన్నా గొప్పది.. పక్కవాడికి మోసం ఈ జన్మలో కర్మఫలం అనుభవించాలి అంటూ వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..