Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Cm Chandrababu Inspected The Somasila Reservoir

CM Chandrababu: సోమశిల జలాశయాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. అధికారులపై ఆగ్రహం

Published Date :August 19, 2024 , 5:34 pm
By Mahesh Jakki
  • సోమశిల జలాశయం వద్ద దెబ్బ తిన్న ఆఫ్రాన్‌ను పరిశీలించిన సీఎం చంద్రబాబు
  • ఆఫ్రాన్ పరిస్థితి..మరమ్మతులు చేయాల్సిన తీరును వివరించిన అధికారులు
CM Chandrababu: సోమశిల జలాశయాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. అధికారులపై ఆగ్రహం
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం వద్ద దెబ్బ తిన్న ఆఫ్రాన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఆఫ్రాన్ పరిస్థితి, మరమ్మతులు చేయాల్సిన తీరును అధికారులు వివరించారు. సోమశిల నుంచి కండలేరు జలాశయానికి నీరు వెళ్లే కాలువను చంద్రబాబు పరిశీలించారు. కాలువ నీటి సామర్థ్యాన్ని పెంచాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి అధికారులకు వివరించారు. అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్ సౌండ్ లేకపోవడంతో అధికారుల తీరులో మార్పు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారులలో నిర్లక్ష్యాన్ని సహించనన్నారు. ఇక నుంచి చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Read Also: YS Jagan: కలుషితాహారం తిని విద్యార్థులు మృతి.. వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

Also Read

  • Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
  • Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
  • Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
  • Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే

రాష్ట్రంలో సోమశిల చాలా కీలకమైనదని.. ఐదేళ్ల నుంచి జలాశయాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. గతంలో నీటి కొరత ఉన్నా రైతుల కోసం 25 టీఎంసీల నీటిని వదిలామని సీఎం చెప్పారు. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి పైన ఉన్న ప్రాజెక్టులు నీటితో నిండాయని.. శ్రీశైలం నుంచి నీటిని తీసుకు వస్తామన్నారు. సోమశిలలో కొన్ని గేట్లు తుప్పు పట్టాయని… ఆఫ్రాన్ దెబ్బతిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. నీటి ప్రాముఖ్యత తనకు బాగా తెలుసని.. గతంలో సంగం, నెల్లూరు బ్యారేజ్‌లు 90 శాతం పూర్తి చేశామన్నారు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడంతో ఆ నీరు అంతా సోమశిలపై పడి.. ఆఫ్రాన్ దెబ్బతిందన్నారు. గతంలో ఏ ఎన్నికల్లో కూడా నెల్లూరు జిల్లాలో ప్రజలు ఇంతటి తీర్పు ఇవ్వలేదన్నారు.

Read Also: Minister Subhash: గుణదల ఈఎస్‌ఐ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి సుభాష్

టీడీపీ ఏర్పడినప్పటి నుంచి ఎన్నికలు చూశానన్న ఆయన.. ఇంతటి తీర్పు ఎప్పుడూ రాలేదన్నారు. గత ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కరువు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటామన్నారు. 692 టీఎంసీల నీటి నిల్వ రాష్ట్రంలో ఉందని.. 20 ఏళ్ల తర్వాత డ్యామ్‌లు ఆగస్ట్ లోనే నిండాయన్నారు. కృష్ణా బేసిన్‌లో కూడా నీరు సమృద్ధిగా ఉందన్నారు. నీరు ఒక సంపద అని.. దీనికి కాపాడేందుకు ప్రభుత్వంతో పాటూ ప్రజలు కూడా సహకరించాలన్నారు. సోమశిల మరమ్మతులకు రూ.95 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పారు. గుండ్లకమ్మ గేట్లు పోతే పట్టించుకోలేదు.. కాంట్రాక్టర్ కు డబ్బులు ఇవ్వలేదు. అందుకే పనులు జరగలేదన్నారు. సోమశిల మరమ్మతు పనులను వర్షాలు వచ్చే లోగా పూర్తి చేశామన్నారు. కాంట్రాక్టర్ పనులు చేయకుండా వెళితే.. పోలీసుల ద్వారా పట్టుకొస్తామన్నారు. అధికారులు కూడా బాధ్యతగా మెలగాలన్నారు.పాత విధానాలు మార్చుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. సర్వే రాళ్లకే రూ.700 కోట్లు… జగన్ ఖర్చు పెట్టారని.. ఋషికొండపై రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టారని.. దానిని ఏమి చేయాలో తెలియడం లేదని సీఎం విమర్శలు గుప్పించారు.

Read Also: CM Chandrababu: కలుషిత ఆహారంతో విద్యార్థులు మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టారని చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పోలవరం వెళ్లారని.. ఇప్పుడు సోమశిలకు వచ్చారన్నారు. “మూడేళ్ళ నుంచి సోమశిలపై మాకు భయంగా ఉందని.. సోమశిల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇక్కడికి వచ్చినపుడు.. హై లెవెల్ కెనాల్ గురించి చెప్పామని.. ఇప్పుడు దానిపై దృష్టి పెట్టారని మంత్రి వెల్లడించారు. పొంగూరు, పడమటి నాయుడు పల్లి రిజర్వాయర్లకు నీళ్లు ఇవ్వమని అధికారులకు ఆదేశించారని తెలిపారు. సోమశిల గేట్లు ఉంటాయా లేదా అనే అనుమానం మాకు ఉందని.. అందుకే ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారని మంత్రి స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cm chandrababu
  • latest news
  • somasila reservoir
  • telugu news

తాజావార్తలు

  • Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..

  • Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!

  • Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?

  • Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే

  • Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions