CM Chandrababu : కొందరు అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఫైర్.
- ఏపీలో భారీగా కురుస్తున్న వర్షాలు
- విజయవాడలో పలు ప్రాంతాలు నీట మునగడంతో సహాయక చర్యలు
- మానవత్వంతో వ్యవహరించడం లేదంటూ చంద్రబాబు మండిపాటు
- ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా కొందరు అధికారులు కావాలనే వ్యవహరిస్తున్నారన్న సీఎం
- ఇకపై చర్యలు ఉంటాయని హెచ్చరిక
ఏపీలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. అయితే.. విజయవాడలో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఈ నేపథ్యంలో రెండు రోజులు విజయవాడలోనే సీఎం చంద్రబాబు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కొందరు అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. మానవత్వంతో వ్యవహరించడం లేదంటూ చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా కొందరు అధికారులు కావాలనే వ్యవహరిస్తున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇకపై చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. బాధితులకు అన్ని రకాలుగా సాయం అందిస్తున్నామని, లోతట్టు ప్రాంతాల్లో ఉండే చివరి వ్యక్తికి సాయం అందాలన్నారు సీఎం చంద్రబాబు. ఏ విధంగానైనా సాయం చేయాలని స్పష్టం చేశానని, ఫుడ్ డెలివరీ కోసం ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేశామన్నారు. వార్డు సచివాలయాల పరిధికే ఫుడ్ సరఫరా చేపడతామని, ఇళ్లల్లోకి పాములు, తేళ్లుూర వస్తున్నాయన్నారు సీఎం చంద్రబాబు.
Minister Ponnam Prabhakar: హిమాయత్ సాగర్ జలాశయాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్…
Also Read
- Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
- Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
- AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
అంతేకాకుండా..’అధికార, పోలీసు యంత్రాంగం సరైన రీతిలో వ్యవహరించాలి. ప్రజలు బాధతో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా అధికారులు వ్యవహరించాలి. తప్పు జరిగితే సహించను.. కఠిన చర్యలు ఉంటాయి. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సమాచారం రప్పించుకుంటున్నాం. ప్రజలూ సంయమనం పాటించాలి.బాధితులకు ప్రతి ఒక్కరు సహకరించాలి. శక్తి మేరకు బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఈ పరిస్థితుల్లో రాజకీయం చేయడం తగదు. ఐదేళ్లు వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారు. జక్కంపూడిలో నిర్సక్ష్యంగా వ్యవహరించిన ఓ అధికారిని సస్పెండ్ చేశాను. మంత్రులైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారి మీద చర్యలు ఉంటాయి. కొందరు అధికారులని వరద సహయక చర్యలకు పంపితే.. సరిగా పని చేయకుండా తేడాగా వ్యవహరించారు. ఇలాంటి అధికారులను ఊపేక్షించను. జీతం తీసుకుని ప్రజల కోసం పని చేయరా..? అధికారులకు బాధ్యత లేదా..? కూటమి అధికారంలోకి వచ్చాక కూడా అధికారులేంటీ ఇలా పని చేస్తున్నారని కొందరు నన్నే అడుగుతున్నారు. మృతదేహం ఉంటే చూసీ చూడనట్టు వెళ్లిపోతారా..? కొందరు అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. వరదతో ప్రజలు ఇబ్బందులు పడుతోంటే.. రాజకీయం చేస్తారా..?’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
IC 814 The Kandahar Hijack: IC 814 హైజాక్ సిరీస్లో రెండు తప్పులు: రియల్ పైలట్ కెప్టెన్ దేవీ శరణ్..
తాజావార్తలు
-
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
-
Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
-
Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!