Andhra Pradesh: ఏపీలో మంత్రులకు ఇచ్చిన ప్రోగ్రెస్ కార్డులో ఏముంది?
- మంత్రుల పెర్ఫార్మెన్సుపై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు
- మంత్రులకు పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇచ్చినట్టు సమాచారం
- కొన్ని అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులకు మార్కులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: కూటమి ప్రభుత్వం ఆరు నెలలు పూర్తి చేసుకున్న తర్వాత మంత్రుల పెర్ఫార్మెన్సుపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే మంత్రులకు మార్కులు ఇచ్చారు. ఎవరి పనితీరు ఏ రకంగా ఉంది అనే ఒక అంచనా కూడా వేశారు సీఎం చంద్రబాబు. ప్రధానంగా కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు మంత్రులకు పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇచ్చినట్టు సమాచారం. శాఖపై ఎంతవరకు పట్టుంది.. జిల్లాలో ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉంటున్నారా.. వైసీపీ విమర్శలకు ఎలా కౌంటర్ ఇస్తున్నారు.. సోషల్ మీడియాలో ఏ రకంగా ఉంటున్నారు.. ఇలా కొన్ని అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులకు మార్కులు వేశారు.
Read Also: Purandeswari: అట్టడుగు ప్రజలకు న్యాయం చేయడమే బీజేపీ అంతిమ లక్ష్యం
Also Read
- Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
- FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
- FIFA World Cup 2026 Final: పొట్టుపొట్టుగా కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. వీడియో వైరల్.!
ప్రస్తుతం సీఎం గుడ్ లుక్స్లో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్ ఉన్నట్టు తెలిసింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పనితీరుపై కూడా సీఎం చంద్రబాబు సంతృప్తిగా ఉన్నారు. కొంతమంది మంత్రులు మాత్రం జిల్లాల్లో ఎమ్మెల్యేలతో సరిగ్గా లేరనే అభిప్రాయంతో సీఎం ఉన్నారు. ఎమ్మెల్యేలు ఏమి చెప్పినా పెద్దగా పట్టించుకోకపోవడం, ప్రధానంగా వైసీపీ కి సరైన కౌంటర్లు ఇవ్వడం లేదని చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది….కొందరు మంత్రులు ఇప్పటికైనా పని తీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని అనే ఇండికేషన్ కూడా బాబు ఇచ్చారు.
శాఖలపై పట్టు పెంచుకోవడంతో పాటు సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉండాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. వచ్చే నెల రోజుల్లో పద్ధతి మార్చుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో ఇంచార్జి మంత్రుల పర్యటనలపైన కూడా సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎవరి జిల్లాకు ఆయా మంత్రి బాధ్యత తీసుకుని ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారని కూడా చెబుతున్నారు. అప్పుడే మంత్రుల పెర్ఫార్మెన్స్ ఏంటని కూడా కొంతమంది మంత్రుల మధ్య చర్చ జరుగుతోంది. కేవలం ఆరు నెలలకే పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని అనుకుంటున్నారు కొందరు మంత్రులు. మంత్రులకు గ్రేడ్లు, మార్కులు అనే చర్చ బాగా జరిగితే మంత్రులపై సదభిప్రాయం ఉంటుందా అనే చర్చ కూడా జరుగుతోంది.
తాజావార్తలు
-
Jantar Mantar Protest: జంతర్మంతర్లో విద్యార్థుల ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు.. షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్ హాజరు
-
Vande Mataram Bill 2026: ‘వందేమాతరం’పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
-
NBK 111 : బాలయ్య మాస్ ర్యాంపేజ్.. ఫ్యాన్సీ రేటుకి NBK 111 ఓటీటీ డీల్ క్లోజ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్