Collectors Conference: 11 గంటల పాటు సాగిన కలెక్టర్ల సదస్సు.. అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం
- ముగిసిన కలెక్టర్ల కాన్ఫరెన్స్
- 11 గంటల పాటు సాగిన సమావేశం
- కలెక్టర్లకు..ఎస్పీలకు చంద్రబాబు దిశా నిర్దేశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Collectors Conference: వెలగపూడిలోని సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ సుదీర్ఘంగా కొనసాగింది. 11 గంటల పాటు సమావేశం సాగింది. కలెక్టర్లు, ఎస్పీలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి తాను సిద్ధంగా లేనన్నారు. క్రైమ్ కంట్రోల్ చేయడానికి సీసీ కెమెరాలను.. డ్రోన్లను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. టెక్నాలజీని వినియోగించుకుని నేరస్తులను పట్టుకునే వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం ఈ టెక్నాలజీని వినియోగించుకోలేదన్నారు. కేసులు పెట్టడానికి.. వేధించడానికి గత ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను వాడుకుందని ఆయన విమర్శించారు. నిన్న ఒక్క రోజే 5 వేల అర్జీలు వచ్చాయి.. వచ్చిన వాటిల్లో 50 శాతం భూ సమస్యల పైనే వచ్చాయన్నారు. భూ సమస్యల విషయంలో ప్రజల్లో చాలా అన్రెస్ట్ ఉందన్నారు.
Read Also: Amaravathi: రెవెన్యూ శాఖపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
Also Read
- Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
- Hair Fall Causes: జుట్టు రాలడానికి షాంపూనే కారణమా? అసలు సమస్య వేరే ఉండొచ్చు
- Rohit Sharma: హిట్మ్యాన్ సూపర్ షోతో సీన్ రివర్స్..! ‘కథ ఇంకా ముగియలేదు’
- Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
మదనపల్లె ఫైల్స్ ఘటన ఓ కేస్ స్టడీ అని.. మదనపల్లె ఘటన జరిగితే హెలికాప్టర్ ఇచ్చి డీజీని.. సీఐడీ చీఫ్ను పంపానని సీఎం చెప్పారు. 22-A పేరుతో భూ సమస్యలు సృష్టించారని ఆయన మండిపడ్డారు. కంప్యూటర్లో చిన్నపాటి మార్పు చేసి.. భూములను కాజేశారని అన్నారు. భూమి ఉంటే సామాన్యునికి ఓ భరోసా అని .. దాన్ని కబ్జా చేయడంతో ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. భూములను ఫ్రీ హోల్డ్ చేసి.. రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని సీఎం తెలిపారు. భూ బాగోతాలను ఎస్టాబ్లిష్ చేయాలి.. పేదలకు న్యాయం చేయాలన్నారు. నేరాలను చేయడం.. వాటిని కప్పి పుచ్చుకోవడం కొందరికి అలవాటుగా మారిందని ఆగ్రహించారు. తప్పుడు ఆరోపణలను సీరియస్గా తీసుకుంటున్నానని చంద్రబాబు హెచ్చరించారు. ఐదేళ్లల్లో చేసిన తప్పును వెలికి తీసి శిక్షిస్తాం.. ఇప్పుడు ఎవరు తప్పులు చేసినా ఊరుకోనని సీఎం ఖరాకండిగా చెప్పారు. గంజాయి సేవించి ఆడవాళ్ల మీద దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.. దీన్ని కంట్రోల్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు గత ఐదేళ్ల కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు.. వాళ్లకు ప్రశాంత జీవితం ఇవ్వాలన్నారు.
Read Also: AP CM Chandrababu: పుట్టపర్తి సత్య సాయి ట్రస్ట్ విషయంలో సీఎం కీలక కామెంట్లు
శాంతి భద్రతల నిర్వహణపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. రౌడీయిజం చూశా.. నక్సలిజం చూశా.. ఫ్యాక్షనిజం చూశా.. నాకేం భయం లేదన్నారు. గంజాయి మత్తులో క్షణికావేశంలో నేరాలకు పాల్పడుతున్నారు.. దీన్ని కంట్రోల్ చేయాలని సూచించారు. చిన్న సంఘటననూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు. లిక్కర్ పాలసీపై అధ్యయనం చేస్తున్నామని.. అన్ని రకాల లిక్కర్ బ్రాండ్లను ఏపీలోకి అనుమతిస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వస్తే.. మద్యం అక్రమ రవాణా తగ్గుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యాప్ తెస్తున్నామని తెలిపారు. ప్రభుత్వంపై దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని మంత్రులు, అధికారులకు సూచించారు.
2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నామని.. జిల్లాలకు విజన్ డాక్యుమెంట్ తేవాలన్నారు. రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయన్న సీఎం చంద్రబాబు.. రూ. 1.17 లక్షల కోట్ల మేర బిల్లులు చెల్లింపులు జరపాలన్నారు. కొంత మేర ఆర్థిక సాయం చేయడానికి కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. సంపద సృష్టించాల్సిన అవసరం ఉందని.. సంపద సృష్టి జరగాలంటే శాంతి భద్రతల నిర్వహణ సరిగా ఉండాలన్నారు. వివిధ అంశాలపై త్వరలో పాలసీలు తెస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. విజిబుల్ పోలీసింగ్.. ఇన్ విజుబుల్ పోలీస్ అనే విధానం ఉండాలన్నారు. అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
తాజావార్తలు
-
Lectrix NDuro: 120KM రేంజ్తో Lectrix NDuro ఎలక్ట్రిక్ స్కూటర్.. రోజూ ఆఫీస్, కాలేజీకి వెళ్లేవారికి బెస్ట్ ఛాయిస్
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Hair Fall Causes: జుట్టు రాలడానికి షాంపూనే కారణమా? అసలు సమస్య వేరే ఉండొచ్చు
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Paraak Movie: KGFతర్వాత మరో సంచలనం..! ‘పరాక్’ టీజర్తో పాన్ ఇండియా హైప్.. శ్రీమురళి యాక్షన్కు ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!