Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Cm Chandrababu Direction To The Officials At Collectors Conference In Ap Secretariat

Collectors Conference: 11 గంటల పాటు సాగిన కలెక్టర్ల సదస్సు.. అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం

Published Date :August 5, 2024 , 9:43 pm
By Mahesh Jakki
  • ముగిసిన కలెక్టర్ల కాన్ఫరెన్స్
  • 11 గంటల పాటు సాగిన సమావేశం
  • కలెక్టర్లకు..ఎస్పీలకు చంద్రబాబు దిశా నిర్దేశం.
Collectors Conference: 11 గంటల పాటు సాగిన కలెక్టర్ల సదస్సు.. అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Collectors Conference: వెలగపూడిలోని సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సుదీర్ఘంగా కొనసాగింది. 11 గంటల పాటు సమావేశం సాగింది. కలెక్టర్లు, ఎస్పీలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి తాను సిద్ధంగా లేనన్నారు. క్రైమ్ కంట్రోల్ చేయడానికి సీసీ కెమెరాలను.. డ్రోన్లను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. టెక్నాలజీని వినియోగించుకుని నేరస్తులను పట్టుకునే వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం ఈ టెక్నాలజీని వినియోగించుకోలేదన్నారు. కేసులు పెట్టడానికి.. వేధించడానికి గత ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను వాడుకుందని ఆయన విమర్శించారు. నిన్న ఒక్క రోజే 5 వేల అర్జీలు వచ్చాయి.. వచ్చిన వాటిల్లో 50 శాతం భూ సమస్యల పైనే వచ్చాయన్నారు. భూ సమస్యల విషయంలో ప్రజల్లో చాలా అన్‌రెస్ట్‌ ఉందన్నారు.

Read Also: Amaravathi: రెవెన్యూ శాఖపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

మదనపల్లె ఫైల్స్‌ ఘటన ఓ కేస్‌ స్టడీ అని.. మదనపల్లె ఘటన జరిగితే హెలికాప్టర్ ఇచ్చి డీజీని.. సీఐడీ చీఫ్‌ను పంపానని సీఎం చెప్పారు. 22-A పేరుతో భూ సమస్యలు సృష్టించారని ఆయన మండిపడ్డారు. కంప్యూటర్‌లో చిన్నపాటి మార్పు చేసి.. భూములను కాజేశారని అన్నారు. భూమి ఉంటే సామాన్యునికి ఓ భరోసా అని .. దాన్ని కబ్జా చేయడంతో ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. భూములను ఫ్రీ హోల్డ్‌ చేసి.. రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని సీఎం తెలిపారు. భూ బాగోతాలను ఎస్టాబ్లిష్ చేయాలి.. పేదలకు న్యాయం చేయాలన్నారు. నేరాలను చేయడం.. వాటిని కప్పి పుచ్చుకోవడం కొందరికి అలవాటుగా మారిందని ఆగ్రహించారు. తప్పుడు ఆరోపణలను సీరియస్‌గా తీసుకుంటున్నానని చంద్రబాబు హెచ్చరించారు. ఐదేళ్లల్లో చేసిన తప్పును వెలికి తీసి శిక్షిస్తాం.. ఇప్పుడు ఎవరు తప్పులు చేసినా ఊరుకోనని సీఎం ఖరాకండిగా చెప్పారు. గంజాయి సేవించి ఆడవాళ్ల మీద దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.. దీన్ని కంట్రోల్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు గత ఐదేళ్ల కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు.. వాళ్లకు ప్రశాంత జీవితం ఇవ్వాలన్నారు.

Read Also: AP CM Chandrababu: పుట్టపర్తి సత్య సాయి ట్రస్ట్ విషయంలో సీఎం కీలక కామెంట్లు

శాంతి భద్రతల నిర్వహణపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. రౌడీయిజం చూశా.. నక్సలిజం చూశా.. ఫ్యాక్షనిజం చూశా.. నాకేం భయం లేదన్నారు. గంజాయి మత్తులో క్షణికావేశంలో నేరాలకు పాల్పడుతున్నారు.. దీన్ని కంట్రోల్ చేయాలని సూచించారు. చిన్న సంఘటననూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు. లిక్కర్ పాలసీపై అధ్యయనం చేస్తున్నామని.. అన్ని రకాల లిక్కర్ బ్రాండ్లను ఏపీలోకి అనుమతిస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వస్తే.. మద్యం అక్రమ రవాణా తగ్గుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యాప్‌ తెస్తున్నామని తెలిపారు. ప్రభుత్వంపై దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని మంత్రులు, అధికారులకు సూచించారు.

2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నామని.. జిల్లాలకు విజన్ డాక్యుమెంట్ తేవాలన్నారు. రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయన్న సీఎం చంద్రబాబు.. రూ. 1.17 లక్షల కోట్ల మేర బిల్లులు చెల్లింపులు జరపాలన్నారు. కొంత మేర ఆర్థిక సాయం చేయడానికి కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. సంపద సృష్టించాల్సిన అవసరం ఉందని.. సంపద సృష్టి జరగాలంటే శాంతి భద్రతల నిర్వహణ సరిగా ఉండాలన్నారు. వివిధ అంశాలపై త్వరలో పాలసీలు తెస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. విజిబుల్ పోలీసింగ్.. ఇన్‌ విజుబుల్‌ పోలీస్‌ అనే విధానం ఉండాలన్నారు. అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap news
  • cm chandrababu
  • Collectors Conference
  • telugu news

తాజావార్తలు

  • HDFC Bank: 9% పతనం.. HDFC బ్యాంక్ మార్కెట్ క్యాప్ ఒక్కసారిగా రూ.1 లక్ష కోట్లు డ్రాప్

  • Rishab Shetty : రిషబ్ శెట్టి..హోంబలే మధ్య విభేదాలు?

  • Chiranjeevi : మెగాస్టార్ సంచలన నిర్ణయం.. త్వరలో అధికారిక ప్రకటన

  • Kavitha : మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తా.. డాడీ, మోడీ, చిన్న మోడీపై నా పోరాటం..

  • Dhurandhar 2 : ప్రీమియర్స్’తో షేక్ చేయనున్న దురంధర్ 2

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions