Amaravathi: రెవెన్యూ శాఖపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
- రెవెన్యూ శాఖపై రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా పవర్ పాయింట్ ప్రజెంటేషన్
- రెవెన్యూ రికార్డుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన సిసోడియా
- అనుమానస్పద రిజిస్ట్రేషన్లపై కలెక్టర్లు విచారణ జరిపించాలన్న సిసోడియా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెవెన్యూ శాఖపై రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెవెన్యూ రికార్డుల భద్రతపై సిసోడియా ఆందోళన వ్యక్తం చేశారు. అనుమానస్పద రిజిస్ట్రేషన్లపై కలెక్టర్లు విచారణ జరిపించాలని సిసోడియా తెలిపారు. భూ రికార్డులను భద్రపరిచాలి.. రెవెన్యూ కార్యాలయాల్లో, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో డాక్యుమెంట్లను జాగ్రత్త చేయాలని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా పేర్కొన్నారు. చాలా కార్యాలయాల్లో సీసీ కెమెరాలు కూడా లేవు.. పాలన ఇలా చేస్తారా..? అని ప్రశ్నించారు. 56 ఏళ్లున్న వీఆర్ఏను కాపలాగా పెట్టుకుని ప్రభుత్వ కార్యాలయాలు నడుపుతామా..?అని అన్నారు. క్షేత్ర స్థాయిలోని పిటిషన్లు సీఎం వద్దకు వస్తే.. కలెక్టర్లు విఫలమైనట్టేనని తెలిపారు. రికార్డులను భద్రపర్చే విషయంలో పోలీసుల సహకారం తీసుకోవాలని సిసోడియా కలెక్టర్లకు తెలిపారు.
Paris Olympics: చేతికి గాయం.. క్వార్టర్ ఫైనల్లో భారత రెజ్లర్ ఓటమి
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో చాలా వరకు రెవెన్యూ శాఖవే ఉంటున్నాయని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా తెలిపారు. గతంలో సరిహద్దు తగాదాలు గురించి.. సాంకేతిక సమస్యల గురించి ఫిర్యాదులు వచ్చేవన్నారు. కానీ ఇప్పుడు మా భూములను లాగేసుకున్నారనే ఫిర్యాదులే ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. గత ఐదేళ్లల్లో భూ సంబంధిత సమస్యలు చాలా పెరిగాయి.. ఎక్కడో ఏదో తప్పు జరిగిందన్నారు. భూములు డాక్యుమెంట్లు తమ వద్దే ఉన్నా.. భూములు వివాదంలో ఉన్నాయని ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారని సిసోడియా తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీలు భూ సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ ప్రతినిధులుగా ఉండే కలెక్టర్ల మీద విశ్వాసం సన్నగిల్లకుండా చూసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
Vinod Kambli: మద్యం మత్తులో నడవలేని స్థితిలో టీమిండియా మాజీ ఆటగాడు..
కలెక్టర్లు అందుబాటులో ఉండడం లేదు.. కలవడం లేదనే ఫిర్యాదులూ చాలా ఉన్నాయని సిసోడియా పేర్కొన్నార. తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో పెద్ద ఎత్తున భూములను ఫ్రీ హోల్డ్ చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13.59 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశారు.. వీటిల్లో 25,235 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయాయన్నారు. సేల్, గిఫ్ట్, తనఖా పేర్లతో అనుమానస్పదన రిజిస్ట్రేషన్లు చేసేశారని అన్నారు. అనుమానస్పదంగా ఉన్న రిజిస్ట్రేషన్లపై కలెక్టర్లు విచారణ జరిపించాలని తెలిపారు. అనర్హులకు అసైన్డ్ భూములు కట్టబెట్టారని.. తక్కువ ధరకు కొందరికి భూములు కట్టబెట్టారని సిసోడియా రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ తెలిపారు.
తాజావార్తలు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!