CM Chandrababu: నా పాలనలో హడావుడి ఉండదు.. ప్రజలతో మమేకమే ప్రభుత్వ లక్ష్యం..
- నా పాలనలో హడావుడి ఉండదు.. ప్రజలతో మమేకమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు సీఎం..
- మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీనిని ప్రారంభించిన చంద్రబాబు..
- రాత్రికి రాత్రే మిరాకిల్స్ జరగవు..
- అప్పులు చాలా ఉన్నాయి.. గత పాలన చూసి పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారు..
- రాష్ట్రం బ్రాండ్ పడిపోయింది.. ఎలా చేయాలో నిరూపించాల్సిన భాధ్యత నాపై ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: నా పాలనలో హడావుడి ఉండదు.. ప్రజలతో మమేకమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. గత పాలన పోలీసు భయంతో గడిచింది.. స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి ఉండేది.. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదన్నారు.. ప్రజలు టీడీపీ కూటమిని గెలిపించారు.. అయితే, రాత్రికి రాత్రే మిరాకిల్స్ జరగవు.. అప్పులు చాలా ఉన్నాయి.. గత పాలన చూసి పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారు.. రాష్ట్రం బ్రాండ్ పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.. ముఖ్య మంత్రిగా పనికి రాని వ్యక్తి పాలన చేశాడు.. ఇప్పుడు పాలన ఎలా చేయాలో నిరూపించాల్సిన భాధ్యత నాపై ఉందన్నారు..
Read Also: Road Accident: ఎక్స్ప్రెస్ వే మీద వేగంగా దూసుకొచ్చి పల్టీలు కొట్టిన కారు.. యువకుడు మృతి
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఇక, వాలంటీర్లు లేకపోతే పెన్షన్ లు రావని బెదిరించారు… సచివాలయానికి వచ్చి పెన్షన్ లు తీసుకోవాలని ఎండల్లో తిప్పారు.. పెన్షన్ ల కోసం తిరిగి తిరిగి 33 మంది వృద్దులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.. గ్రామ సచివాలయం సిబ్బందితో ఒకే రోజులో రాష్ట్రం అంతా పెన్షన్ ల పంపిణీ చేస్తాం అన్నారు. ఇక, నా పాలనలో హడావుడి ఉండదు.. ప్రజలతో మమేకం అవ్వడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు.. ఈ రోజు పంపిణీ చేస్తున్న పెన్షన్ లు చారిత్రాత్మ కం .. 1.20 కోట్లు ఒక్క పెనుమాక గ్రామంలోనే ఇస్తున్నాం.. గుంటూరుజిల్లా లో పెన్షన్ లు రూ.81 కోట్లు .. గుంటూరు జిల్లాలో ఈ రోజు 111 కోట్ల రూపాయలు పెన్షన్ ల రూపంలో పంపిణీ చేస్తున్నాం.. 28 రకాల పెన్షన్ లకు 4,408 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఇస్తున్నాం అన్నారు. ఉదయం లేవగానే పెనుమాకలో లబ్ధి దారులకు పెన్షన్ ఇచ్చాను.. పూరి గుడిసెలో జీవనం సాగిస్తున్న బాణావత్ పాములు కుటుంబానికి ఇల్లు కూడా కట్టించే భాధ్యత నాది అని హామీ ఇచ్చారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని చెప్పిన ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ టీడీపీ.. ఆ దిశగా పనిచేస్తా అని తెలిపారు సీఎం చంద్రబాబు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!