CM Chandrababu: 59 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగింది.. బ్రిటీష్ పాలనలో కూడా వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదు!
- 59 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగింది
- ఎన్డీడీబీ రిపోర్టు రాగానే నేను ప్రకటన చేశాను
- సిట్ వేసేందుకు సిద్ధపడగా సుప్రీంకోర్టుకు వెళ్లారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu About Tirumala Laddu Adulteration In AP Assembly: బ్రిటీష్ పాలనలో కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరూ రాలేదని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. ఇందులో కుట్ర కోణం ఉందని, సిండికేట్గా తయారయ్యారన్నారు. 59 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగిందని, ఎన్డీడీబీ రిపోర్టు రాగానే తాను ప్రకటన చేశానన్నారు. సిట్ వేసేందుకు సిద్ధపడగా సుప్రీంకోర్టుకు వెళ్లారని, సుప్రీంకోర్టు సిట్ వేసిందని గుర్తు చేశారు. సిట్ ఛార్జిషీట్ వేసి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేసిందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
‘2019-24 మధ్య దేవాలయాల్లో అరాచకాలు జరిగాయి. నేను సీఎం కాగానే రెండో సంతకం టీటీడీ ఈవోను నామినేట్ చేశాను. మా కులదైవం వెంకటేశ్వర స్వామి, నన్ను కాపాడింది ఆ దేవదేవుడే. నేను సిద్ధాంతపరంగా పోరాడాను. మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి రమ్మంటే నాపై దాడి చేశారు. ఇప్పుడు మావోయిస్టు టాప్ లీడర్లు లొంగిపోతున్నారు. బ్రిటీష్ పాలనలో కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదు. ఇందులో కుట్ర కోణం ఉంది, సిండికేట్గా తయారయ్యారు. 59 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగింది. ఎన్డీడీబీ రిపోర్టు రాగానే నేను ప్రకటన చేశాను. సిట్ వేసేందుకు సిద్ధపడగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు సిట్ వేసింది. సిట్ ఛార్జిషీట్ వేసి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేసింది’ అని సీఎం అన్నారు.
Also Read
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
- FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
‘2020 ఫిబ్రవరిలో టెండర్ నిబంధనలు మార్చారు. 2022 మేలో భోలేబాబా సంస్థపై ఫిర్యాదు, విచారణకు ఆదేశించారు. 2022 ఆగస్టులో నివేదిక వచ్చింది. 2024 జులైలో ఎన్డీడీబీ నివేదిక వచ్చింది. పాలు ఏమాత్రం తయారు చేయలేని కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చారు. 10 లక్షల కేజీల ఆవు నెయ్యి కోసం టెండర్లు ఇచ్చారు. కల్తీ నెయ్యి కోసం వచ్చిన రిపోర్టును తొక్కి పెట్టారు. ఎన్డీడీబీ రిపోర్ట్ 2024 జులై 23న వచ్చింది. S వాల్యూ-5 ప్రకారం జంతు కొవ్వు ఉందన్న రిపోర్టు ఆధారంగానే నేను మాట్లాడాను. రోజుకు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలన్న నిబంధన తొలగించారు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read: Pawan Kalyan: వైఎస్ జగన్ తప్పు చేశారని నేను ఎక్కడా చెప్పలేదు.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
‘ప్రమాదకర రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేశారు. దేవుడి కోసం తక్కువ ధరకే ఇస్తున్నారంటే ఆలోచించుకోవాలి. అవినీతి గానీ, కుట్ర పూరిత ఆలోచన దీనివెనుక ఉంటుంది. కెమికల్స్తో నెయ్యి తయారీ చేసి ఇంకా బుకాయిస్తున్నారు. ఇద్దరు టీటీడీ చైర్మన్లు కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి ఏం జరగలేదని అన్నారు. తిరిగి మనల్నే క్షమాపణ చెప్పమంటున్నారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బ తీసేందుకు మొదటి నుంచి ప్రయత్నం చేశారు. తిరుమల తిరుపతి వెళ్లే ఆర్టీసీ బస్సుల టికెట్లో అన్యమత ప్రచారం చేశారు’ అని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?