CM Chandrababu: 59 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగింది.. బ్రిటీష్ పాలనలో కూడా వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదు!
- 59 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగింది
- ఎన్డీడీబీ రిపోర్టు రాగానే నేను ప్రకటన చేశాను
- సిట్ వేసేందుకు సిద్ధపడగా సుప్రీంకోర్టుకు వెళ్లారు
CM Chandrababu About Tirumala Laddu Adulteration In AP Assembly: బ్రిటీష్ పాలనలో కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరూ రాలేదని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. ఇందులో కుట్ర కోణం ఉందని, సిండికేట్గా తయారయ్యారన్నారు. 59 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగిందని, ఎన్డీడీబీ రిపోర్టు రాగానే తాను ప్రకటన చేశానన్నారు. సిట్ వేసేందుకు సిద్ధపడగా సుప్రీంకోర్టుకు వెళ్లారని, సుప్రీంకోర్టు సిట్ వేసిందని గుర్తు చేశారు. సిట్ ఛార్జిషీట్ వేసి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేసిందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
‘2019-24 మధ్య దేవాలయాల్లో అరాచకాలు జరిగాయి. నేను సీఎం కాగానే రెండో సంతకం టీటీడీ ఈవోను నామినేట్ చేశాను. మా కులదైవం వెంకటేశ్వర స్వామి, నన్ను కాపాడింది ఆ దేవదేవుడే. నేను సిద్ధాంతపరంగా పోరాడాను. మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి రమ్మంటే నాపై దాడి చేశారు. ఇప్పుడు మావోయిస్టు టాప్ లీడర్లు లొంగిపోతున్నారు. బ్రిటీష్ పాలనలో కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదు. ఇందులో కుట్ర కోణం ఉంది, సిండికేట్గా తయారయ్యారు. 59 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగింది. ఎన్డీడీబీ రిపోర్టు రాగానే నేను ప్రకటన చేశాను. సిట్ వేసేందుకు సిద్ధపడగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు సిట్ వేసింది. సిట్ ఛార్జిషీట్ వేసి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేసింది’ అని సీఎం అన్నారు.
Also Read
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
‘2020 ఫిబ్రవరిలో టెండర్ నిబంధనలు మార్చారు. 2022 మేలో భోలేబాబా సంస్థపై ఫిర్యాదు, విచారణకు ఆదేశించారు. 2022 ఆగస్టులో నివేదిక వచ్చింది. 2024 జులైలో ఎన్డీడీబీ నివేదిక వచ్చింది. పాలు ఏమాత్రం తయారు చేయలేని కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చారు. 10 లక్షల కేజీల ఆవు నెయ్యి కోసం టెండర్లు ఇచ్చారు. కల్తీ నెయ్యి కోసం వచ్చిన రిపోర్టును తొక్కి పెట్టారు. ఎన్డీడీబీ రిపోర్ట్ 2024 జులై 23న వచ్చింది. S వాల్యూ-5 ప్రకారం జంతు కొవ్వు ఉందన్న రిపోర్టు ఆధారంగానే నేను మాట్లాడాను. రోజుకు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలన్న నిబంధన తొలగించారు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read: Pawan Kalyan: వైఎస్ జగన్ తప్పు చేశారని నేను ఎక్కడా చెప్పలేదు.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
‘ప్రమాదకర రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేశారు. దేవుడి కోసం తక్కువ ధరకే ఇస్తున్నారంటే ఆలోచించుకోవాలి. అవినీతి గానీ, కుట్ర పూరిత ఆలోచన దీనివెనుక ఉంటుంది. కెమికల్స్తో నెయ్యి తయారీ చేసి ఇంకా బుకాయిస్తున్నారు. ఇద్దరు టీటీడీ చైర్మన్లు కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి ఏం జరగలేదని అన్నారు. తిరిగి మనల్నే క్షమాపణ చెప్పమంటున్నారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బ తీసేందుకు మొదటి నుంచి ప్రయత్నం చేశారు. తిరుమల తిరుపతి వెళ్లే ఆర్టీసీ బస్సుల టికెట్లో అన్యమత ప్రచారం చేశారు’ అని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!