Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Chandrababu Alleges 5 9 Million Kg Ghee Adulteration In Tirumala Ttd Issue

CM Chandrababu: 59 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగింది.. బ్రిటీష్ పాలనలో కూడా వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదు!

Published Date :February 24, 2026 , 2:25 pm
By Sampath Kumar
  • 59 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగింది
  • ఎన్‌డీడీబీ రిపోర్టు రాగానే నేను ప్రకటన చేశాను
  • సిట్ వేసేందుకు సిద్ధపడగా సుప్రీంకోర్టుకు వెళ్లారు
CM Chandrababu: 59 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగింది.. బ్రిటీష్ పాలనలో కూడా వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu About Tirumala Laddu Adulteration In AP Assembly: బ్రిటీష్ పాలనలో కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరూ రాలేదని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. ఇందులో కుట్ర కోణం ఉందని, సిండికేట్గా తయారయ్యారన్నారు. 59 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగిందని, ఎన్‌డీడీబీ రిపోర్టు రాగానే తాను ప్రకటన చేశానన్నారు. సిట్ వేసేందుకు సిద్ధపడగా సుప్రీంకోర్టుకు వెళ్లారని, సుప్రీంకోర్టు సిట్ వేసిందని గుర్తు చేశారు. సిట్ ఛార్జిషీట్ వేసి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేసిందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

‘2019-24 మధ్య దేవాలయాల్లో అరాచకాలు జరిగాయి. నేను సీఎం కాగానే రెండో సంతకం టీటీడీ ఈవోను నామినేట్ చేశాను. మా కులదైవం వెంకటేశ్వర స్వామి, నన్ను కాపాడింది ఆ దేవదేవుడే. నేను సిద్ధాంతపరంగా పోరాడాను. మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి రమ్మంటే నాపై దాడి చేశారు. ఇప్పుడు మావోయిస్టు టాప్ లీడర్లు లొంగిపోతున్నారు. బ్రిటీష్ పాలనలో కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదు. ఇందులో కుట్ర కోణం ఉంది, సిండికేట్గా తయారయ్యారు. 59 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగింది. ఎన్‌డీడీబీ రిపోర్టు రాగానే నేను ప్రకటన చేశాను. సిట్ వేసేందుకు సిద్ధపడగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు సిట్ వేసింది. సిట్ ఛార్జిషీట్ వేసి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేసింది’ అని సీఎం అన్నారు.

‘2020 ఫిబ్రవరిలో టెండర్ నిబంధనలు మార్చారు. 2022 మేలో భోలేబాబా సంస్థపై ఫిర్యాదు, విచారణకు ఆదేశించారు. 2022 ఆగస్టులో నివేదిక వచ్చింది. 2024 జులైలో ఎన్‌డీడీబీ నివేదిక వచ్చింది. పాలు ఏమాత్రం తయారు చేయలేని కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చారు. 10 లక్షల కేజీల ఆవు నెయ్యి కోసం టెండర్లు ఇచ్చారు. కల్తీ నెయ్యి కోసం వచ్చిన రిపోర్టును తొక్కి పెట్టారు. ఎన్‌డీడీబీ రిపోర్ట్ 2024 జులై 23న వచ్చింది. S వాల్యూ-5 ప్రకారం జంతు కొవ్వు ఉందన్న రిపోర్టు ఆధారంగానే నేను మాట్లాడాను. రోజుకు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలన్న నిబంధన తొలగించారు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Also Read: Pawan Kalyan: వైఎస్ జగన్ తప్పు చేశారని నేను ఎక్కడా చెప్పలేదు.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

‘ప్రమాదకర రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేశారు. దేవుడి కోసం తక్కువ ధరకే ఇస్తున్నారంటే ఆలోచించుకోవాలి. అవినీతి గానీ, కుట్ర పూరిత ఆలోచన దీనివెనుక ఉంటుంది. కెమికల్స్తో నెయ్యి తయారీ చేసి ఇంకా బుకాయిస్తున్నారు. ఇద్దరు టీటీడీ చైర్మన్లు కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి ఏం జరగలేదని అన్నారు. తిరిగి మనల్నే క్షమాపణ చెప్పమంటున్నారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బ తీసేందుకు మొదటి నుంచి ప్రయత్నం చేశారు. తిరుమల తిరుపతి వెళ్లే ఆర్టీసీ బస్సుల టికెట్లో అన్యమత ప్రచారం చేశారు’ అని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm chandrababu
  • CM Chandrababu Tirumala Laddu
  • tirumala laddu
  • Tirumala Laddu Adulteration
  • Tirumala Laddu Controversy

తాజావార్తలు

  • iQOO 15 Apex: iQOO 15 Apex లాంచ్.. 2K AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, 100W ఛార్జింగ్

  • AP Weather Alert: రేపు ఉత్తరాంధ్రలో తీవ్ర వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు.. అధికారుల హెచ్చరిక!

  • CCS meeting: ఇరాన్ యుద్ధంపై ప్రధాని మోడీ అధ్యక్షతన “సెక్యూరిటీ” మీటింగ్..

  • Gold Rates: యుద్ధం ఎఫెక్ట్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు..

  • IAS Officer: గుంజీలు తీసిన ఐఏఎస్ ఆఫీసర్ రాజీనామా.. కారణం ఇదే..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions