MLA Jagan: కన్నడిగులపై నాకు గౌరవం ఉంది.. ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Jagan: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ ఇటీవల చేసిన “చిత్తూరు వాళ్లు బెంగళూరు, చెన్నైలలో ఏలుతున్నారు” అనే వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందించారు. తన వ్యాఖ్యలతో ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నట్లయితే క్షమాపణ కోరుతున్నట్లు ప్రకటించారు. తాను చేసిన వ్యాఖ్యల ఉద్దేశం తెలుగు ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిభ చాటుతూ విజయవంతంగా రాణిస్తున్నారనే విషయాన్ని చెప్పడమేనని గురజాల జగన్ స్పష్టం చేశారు. ఇతర భాషలను లేదా ఇతర రాష్ట్రాలను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని తెలిపారు.
బెంగళూరు, చిత్తూరులోని తన రాజకీయ ప్రత్యర్థులు తన వ్యాఖ్యలను వక్రీకరించి అనవసర వివాదం సృష్టించారని ఆరోపించారు జగన్… తాను చిత్తూరు నుంచి బెంగళూరుకు వెళ్లి వ్యాపారంలో ఎదిగానని, అందువల్ల బెంగళూరు నగరంపై, కన్నడిగులపై తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని ఎవరైనా బాధపడితే వారికి మరోసారి క్షమాపణలు తెలియజేస్తున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ఆయన వ్యాఖ్యలపై కొనసాగుతున్న రాజకీయ వివాదం కొత్త మలుపు తిరిగింది.
Also Read
- MLA Jagan Controversy: మరో వివాదంలో ఎమ్మెల్యే జగన్.. చిత్తూరులో హైటెన్షన్ రాజకీయాలు
- MLA Jagan: 'బెంగళూరును ఏలుతున్నాం' వ్యాఖ్యలపై దుమారం.. ఎమ్మెల్యే జగన్పై కన్నడ సంఘాల ఆగ్రహం
- Nara Bhuvaneswari Emotional: ద్రౌపది నుంచి నేటి రాజకీయాల వరకు.. కుప్పంలో నారా భువనేశ్వరి ఎమోషనల్ స్పీచ్..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
కాగా, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్ చేసిన “బెంగళూరును ఏలుతున్నాం” అనే వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ కన్నడ సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై బెంగళూరులో ఫిర్యాదు నమోదై, ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్లు సమాచారం వెలువడడంతో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా కన్నడ సంఘాల నాయకులు ఎమ్మెల్యేపై పలు ఆరోపణలు చేశారు. వైట్ఫీల్డ్లో రియల్ ఎస్టేట్ పేరుతో వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, బెంగళూరులో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. చిత్తూరుకు సంబంధించిన రాజకీయాలను అక్కడికే పరిమితం చేసుకోవాలని, బెంగళూరుపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సహించబోమని హెచ్చరించారు. కన్నడ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఎమ్మెల్యే అయినా చట్టం ముందు అందరూ సమానమేనని సంఘాల నేతలు స్పష్టం చేశారు. గురుజాల జగన్ బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. అయితే, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ ఇప్పుడు క్షమాపణలు చెప్పడంతో.. వివాదం సద్దుమణుగుతుందేమో చూడాలి..
తాజావార్తలు
-
Indian Origin Cricketer: ఆ క్రికెటర్కు బిగ్షాక్ ఇచ్చిన ఐసీసీ.. 8 ఏళ్లు నిషేధం..
-
TGSRTC Results : ఆర్టీసీ జాబ్స్ రిజల్ట్స్ విడుదల.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే.!
-
E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
-
Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
-
Sukumar – DSP: దేవిశ్రీ ప్రసాద్ – సుకుమార్ల బంధానికి బ్రేక్ పడిందా? RC17 నుంచి DSP అవుట్!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!