Chinta Mohan: కాపులు అందరూ కాంగ్రెస్లోకి రావాలి.. చిరంజీవిని అసెంబ్లీలో చూడాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinta Mohan: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు అప్పుడే హీట్ పుట్టిస్తున్నాయి.. అన్ని పార్టీలు విజయమే లక్ష్యంగా తమ వ్యూహాలు సిద్ధం చేస్తున్నా్యి.. ఇక, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ.. మళ్లీ పూర్వవైభవం కోసం ప్రయత్నాలు చేస్తు్ంది.. అందులో భాగంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కట్టబెట్టింది.. ఇక, ఇతర పార్టీల నేతలతో పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడిపోయారు కాంగ్రెస్ నేతలు.. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్.. ఈ రోజు రాజమండ్రిలో మాట్లాడుతూ.. కాపులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. కాపులు అందరూ కాంగ్రెస్ లోకి రావాలని నిలుపునిచ్చారు. అంతేకాదు.. చిరంజీవి కూడా కాంగ్రెస్ లోకి రావాలని, ఆయన్ని అసెంబ్లీలో చూడాలని ఉందన్నారు.. చిరంజీవిని తిరుపతి నుంచి పోటీ చేయమని కోరుతున్నామని అన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఆశాభవం వ్యక్తం చేశారు. వైఎస్ షర్మిలను పీసీసీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుందని, ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్.
Read Also: Hanu Man Collections: రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను రాబట్టిన ‘హనుమాన్’.. 10 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
Also Read
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nara Lokesh: అక్షర ఆంధ్రకు నారా లోకేష్ కొత్త టార్గెట్.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత
- Nepal Floods: నేపాల్లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
- Bigg Boss Agnipariksha 2: బిగ్బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
కాగా, ఈ మధ్యే చిరంజీవి కాంగ్రెస్లో చేరాలని.. తిరుపతి నుంచి పోటీ చేయాలని చింతా మోహన్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.. తిరుపతి నుండి ఎమ్మెల్యేగా చిరంజీవి పోటీ చేయాలని కోరనున్నట్టు తెలిపిన ఆయన.. అంతేకాదు మా ముఖ్యమంత్రి అభ్యర్థి చిరంజీవియే ఉంటారని స్పష్టం చేశారు. కాపులకు ఇదే సరైనా సమయమని పిలుపునిచ్చారు. ఇక, చిరంజీవిని నేనే స్వయంగా పార్టీలో ఆహ్వానిస్తానని పేర్కొన్నారు.. చిరంజీవి 50 వేలకు పైగా మెజారిటీతో గెలుస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నామినేషన్ వేసి వెళ్లిపోతే చాలు.. ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు.. ప్రజలు చిరంజీవికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అంతేకాదు.. గతంలో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా చిరంజీవి.. సీఎం అయిఉంటే బాగుండేదని ఆ మధ్య చింతా మోహన్ అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
-
Nara Lokesh: అక్షర ఆంధ్రకు నారా లోకేష్ కొత్త టార్గెట్.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత
-
Nepal Floods: నేపాల్లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
-
Bigg Boss Agnipariksha 2: బిగ్బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
-
Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!