Chinta Mohan: కాపులు అందరూ కాంగ్రెస్లోకి రావాలి.. చిరంజీవిని అసెంబ్లీలో చూడాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinta Mohan: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు అప్పుడే హీట్ పుట్టిస్తున్నాయి.. అన్ని పార్టీలు విజయమే లక్ష్యంగా తమ వ్యూహాలు సిద్ధం చేస్తున్నా్యి.. ఇక, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ.. మళ్లీ పూర్వవైభవం కోసం ప్రయత్నాలు చేస్తు్ంది.. అందులో భాగంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కట్టబెట్టింది.. ఇక, ఇతర పార్టీల నేతలతో పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడిపోయారు కాంగ్రెస్ నేతలు.. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్.. ఈ రోజు రాజమండ్రిలో మాట్లాడుతూ.. కాపులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. కాపులు అందరూ కాంగ్రెస్ లోకి రావాలని నిలుపునిచ్చారు. అంతేకాదు.. చిరంజీవి కూడా కాంగ్రెస్ లోకి రావాలని, ఆయన్ని అసెంబ్లీలో చూడాలని ఉందన్నారు.. చిరంజీవిని తిరుపతి నుంచి పోటీ చేయమని కోరుతున్నామని అన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఆశాభవం వ్యక్తం చేశారు. వైఎస్ షర్మిలను పీసీసీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుందని, ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్.
Read Also: Hanu Man Collections: రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను రాబట్టిన ‘హనుమాన్’.. 10 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
Also Read
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
- Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్గా ఉంటాయి
- IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
కాగా, ఈ మధ్యే చిరంజీవి కాంగ్రెస్లో చేరాలని.. తిరుపతి నుంచి పోటీ చేయాలని చింతా మోహన్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.. తిరుపతి నుండి ఎమ్మెల్యేగా చిరంజీవి పోటీ చేయాలని కోరనున్నట్టు తెలిపిన ఆయన.. అంతేకాదు మా ముఖ్యమంత్రి అభ్యర్థి చిరంజీవియే ఉంటారని స్పష్టం చేశారు. కాపులకు ఇదే సరైనా సమయమని పిలుపునిచ్చారు. ఇక, చిరంజీవిని నేనే స్వయంగా పార్టీలో ఆహ్వానిస్తానని పేర్కొన్నారు.. చిరంజీవి 50 వేలకు పైగా మెజారిటీతో గెలుస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నామినేషన్ వేసి వెళ్లిపోతే చాలు.. ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు.. ప్రజలు చిరంజీవికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అంతేకాదు.. గతంలో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా చిరంజీవి.. సీఎం అయిఉంటే బాగుండేదని ఆ మధ్య చింతా మోహన్ అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
-
Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
-
Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
-
Hardik Pandya-CSK: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈఓ!
-
Best Crime Thriller Movies: కేతన్ అగర్వాల్ కేసును గుర్తు చేసే థ్రిల్లర్లు.. ఈ సినిమాల ట్విస్టులు చూస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?