CP Sudheer Babu : పసిపిల్లలను అమ్ముతున్న ముఠా అరెస్ట్
- చిన్నపిల్లల విక్రయాల అంతరాష్ట్ర ముఠా అరెస్ట్ – 18 మంది చిన్నారుల రక్షణ
- ముఠా కార్యాచరణ – అమూల్య కీలక నిందితురాలు
- పిల్లల అమ్మకాలు – ధన లావాదేవీలు
- చిన్నారుల రక్షణ – పోలీసులు చేపట్టిన చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CP Sudheer Babu : రాచకొండ పోలీసులు చిన్నపిల్లల విక్రయాలకు సంబంధించి భారీ అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్లో మొత్తం 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. అంతేకాకుండా, దత్తత తీసుకున్న 18 మంది పిల్లలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా పిల్లల అక్రమ విక్రయాల్లో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల అనుసంధానంలో ముఠాలో ప్రధానంగా అమూల్య అనే మహిళ కీలకంగా వ్యవహరించినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ ముఠా 10 మంది చిన్నారులను అక్రమంగా విక్రయించింది. ఇంకా, అమూల్యతో పాటు దీప్తి అనే మహిళ కలిసి మరో 8 మందిని అమ్మినట్లు పోలీసులు గుర్తించారు.
మగ శిశువులను ₹4,00,000 – ₹6,00,000 మధ్య అమ్మకాలు జరిపారు. ఆడ శిశువులను ₹2,00,000 – ₹4,00,000 మధ్య విక్రయించారు. మగ శిశువులను ₹4,00,000 – ₹5,00,000 మధ్య కొనుగోలు చేసి ₹5,00,000 – ₹6,00,000 మధ్య అమ్మినట్లు తేలింది. ఇప్పటివరకు 25 మంది శిశువుల అమ్మకాలు జరిగాయి. ఇందులో 16 మందిని ఇప్పటికే రెస్క్యూ చేయగా, ఇంకా 9 మంది చిన్నారులను కాపాడాల్సి ఉంది.
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
ముఠాలో కీలక నిందితురాలిగా అమూల్య పేరు నిలిచింది. ఆమె అసలు ఆశా వర్కర్గా పనిచేస్తూ, ప్రస్తుతం ఆజంపురా యూపిహెచ్సీలో విధులు నిర్వహిస్తోంది. ఈ చిన్నారుల దత్తత లీగల్ ప్రాసెస్ ద్వారా జరగలేదు. చట్ట విరుద్ధంగా అక్రమ లావాదేవీల ద్వారా పిల్లలను విక్రయించారని పోలీసులు తెలిపారు.
జువెనైల్ జస్టిస్ యాక్ట్ (JJ Act) ప్రకారం, దత్తత ప్రక్రియ ఆన్లైన్లో నమోదు చేసి, ప్రభుత్వ అనుమతితో మాత్రమే జరగాలి. కానీ, ఈ ముఠా ఆ విధంగా కాకుండా అక్రమ మార్గాల్లో చిన్నారుల విక్రయాలను కొనసాగించింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ల నుంచి చిన్నారులను సేకరించారు. తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విక్రయించారు. ఈ కేసుపై పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చిన్నారుల అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Sudiksha Missing: సుదీక్ష తల్లిదండ్రుల నిర్ణయంతో అనుమానితుడికి విముక్తి
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!