Sudiksha Missing: సుదీక్ష తల్లిదండ్రుల నిర్ణయంతో అనుమానితుడికి విముక్తి
- సుదీక్ష తల్లిదండ్రుల నిర్ణయంతో అనుమానితుడికి విముక్తి
- జాషువా రీబేను విడిచి పెట్టిన డొమినికన్ రిపబ్లిక్ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత సంతతి విద్యార్థిని సుదీక్ష (20) మిస్సింగ్పై ఆమె తల్లిదండ్రులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ కుమార్తె చనిపోయినట్లుగా ప్రకటించాలని అధికారులను కోరారు. మీడియా సమావేశంలో లేఖను చూపించారు. ఈ సందర్భంగా సుదీక్ష తల్లి ఎక్కి ఎక్కి ఏడ్చేసింది. ఇక సుదీక్ష తల్లిదండ్రుల ప్రకటన తర్వాత.. అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్న జాషువా రీబేను అధికారులు విడిచిపెట్టేశారు. గత రెండు వారాలుగా రీబే పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అతడి పాస్పోర్టు కూడా జప్తు చేశారు. సుదీక్ష.. రీబేతోనే కలిసి తిరిగింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. కానీ అతడి మాటలను బట్టి చూస్తే.. అతడి ప్రమేయం ఏ మాత్రం కనిపించలేదు. దీంతో ఎట్టకేలకు విముక్తి కల్పించారు.

Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- 22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
సుదీక్ష అమెరికా పౌరురాలు. వర్జీనియాలో నివాసం ఉంటుంది. పిట్స్బర్గ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. అయితే సెలవులు రావడంతో ఐదుగురు స్నేహితులతో కలిసి మార్చి 5న కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లింది. అయితే మార్చి 6న రిసార్ట్లో మందు పార్టీ చేసుకున్నారు. అనంతరం జాషువా రీబేతో కలిసి బీచ్లోకి వెళ్లింది. అయితే ఒంటరిగా ఉంటానని స్నేహితులకు చెప్పడంతో ఫ్రెండ్స్ తిరిగి వచ్చేశారు. రీబేతో కలిసి సుదీక్ష బీచ్లో విహరించారు. అయితే అప్పటికే సుదీక్ష స్పృహలో లేదు. ఇద్దరూ కలిసి బీచ్లోకి వెళ్లారు. అయితే ఒక అల రావడంతో ఇద్దరు కొట్టుకుపోయారు. తిరిగి బయటకు వచ్చేశారు. నీళ్లు మింగేయడంతో సుదీక్ష వాంతు చేసుకున్నట్లు రీబే తెలిపాడు. అనంతరం బీచ్ ఒడ్డున నిద్రపోయినట్లుగా చెప్పాడు. ఆ తర్వాత సుదీక్ష ఏమైందో తనకు తెలియదని పేర్కొన్నాడు.
సుదీక్ష జాడ తెలియకపోవడంతో స్నేహితులు అధికారులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన అధికారులు హెలికాప్టర్లు, పడవలు, డ్రోన్లతో వెతికారు. కానీ ఆచూకీ లభించలేదు. దీంతో బీచ్లో కొట్టుకుపోయిందని తెలిపారు. అయితే తల్లిదండ్రులు ఈ వాదనను తోసిపుచ్చారు. బీచ్లో కొట్టుకుపోతే శవం తిరిగి రావాలని వాదించారు. కానీ చివరికి తమ కుమార్తె చనిపోయినట్లుగా ప్రకటించాలని డొమినికన్ రిపబ్లిక్ అధికారులకు లేఖ రాయడంతో కథ సుఖాంతం అయింది.
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!