Media persons Protection Bill: జర్నలిస్టుల రక్షణకు బిల్లు తీసుకువచ్చిన ఛత్తీస్గఢ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Media persons Protection Bill: జర్నలిస్టుల రక్షణ కోసం చత్తీస్ గఢ్ ప్రభుత్వం ‘ ఛత్తీస్గఢ్ మీడియా పర్సన్స్ ప్రొటెక్షన్ బిల్లు 2023 ’ను తీసుకువచ్చింది. బుధవారం ఆ రాష్ట్ర శాసనసభలో దీన్ని ఆమోదించారు. ఇది చారిత్రాత్మక రోజు అని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అభివర్ణించారు. ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయగా.. స్పీకర్ చరదాస్ మహంత్ తిరస్కరించారు. ఛత్తీస్గఢ్లో 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో రాష్ట్రంలోని జర్నలిస్టులకు రక్షణ కల్పించే చట్టాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చింది.
మీడియా ప్రతినిధులపై హింసను నిరోధించడం, విధులు నిర్వర్తించడంలో ఈ బిల్లు రక్షణ ఇస్తుందని సీఎం అన్నారు. ఈ చట్టాన్ని అమలు చేయాలని చాలాసార్లు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి 2019లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అఫ్తాబ్ ఆలం నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేశారని ఈ చట్టం అందరిని సంప్రదించి చేశామని సీఎం బఘేల్ అన్నారు. ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్రంలోని ప్రెస్ క్లబ్లతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందా అని ప్రతిపక్ష నేత నారాయణ్ చందేల్, అజయ్ చంద్రాకర్ సహా బీజేపీ శాసనసభ్యులు ప్రశ్నించారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు.
Also Read
Read Also: Hospital Bill : ఆస్పత్రి బిల్లు చూశాడు.. ఎలా చావాలో గూగుల్లో సెర్చ్ చేశాడు
జర్నలిస్టుల ప్రయోజనాలకు బీజేపీ వ్యతిరేకమని, బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ బిల్లు ప్రకారం ఓ వ్యక్తి జర్నలిజంలో కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలి. ప్రస్తుత సంఘటనపై మీడియా సంస్థలో కనీసం 6 కథనాలను ప్రచురించాలి లేదా కనీసం మూడు నెలల జీతాన్ని సదరు మీడియా సంస్థ నుంచి పొందాలి. మీడియా పర్సన్ అంటే ఎడిటర్, రైటర్, న్యూస్ ఎడిటర్, డిప్యూటీ ఎడిటర్, ఫీచర్ రైటర్, కరస్పాండెంట్, కాపీ ఎడిటర్, కమ్యూనికేటర్, కార్టూనిస్ట్, న్యూస్ ఫోటోగ్రాఫర్, వీడియో జర్నలిస్ట్, ట్రాన్స్లేటర్, ట్రైన్ జర్నలిస్టులుగా బిల్లులో పేర్కొన్నారు.
చట్టం అమలులోకి వచ్చిన 90 రోజుల్లోపు ‘ఛత్తీస్గఢ్ మీడియా ఫ్రీడమ్, ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ కమిటీ’ని ఏర్పాటు చేయనున్నారు. ఇది మీడియా పర్సన్స్ వ్యక్తిగత నమోదుకు పనిచేస్తుంది. మీడియా వ్యక్తులపై వేధింపులు, బెదిరింపులు, హింస లేదా తప్పుడు ఆరోపణలు మరియు అరెస్టు వంటి మీడియా వ్యక్తుల రక్షణకు సంబంధించిన ఫిర్యాదులను కమిటీ పరిష్కరిస్తుంది. ఈ కమిటీలో ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి రిటైర్డ్ అడ్మినిస్ట్రేటర్/ పోలీస్ అధికారి ఉంటారు. హోం డిపార్ట్మెంట్ నామినేట్ చేసిన ప్రాసిక్యూషన్ బ్రాంచ్ అధికారితో పాటు ముగ్గురు మీడియా వ్యక్తులు ఇందులో ఓ మహిళా కూడా ఉంటారు.
ఒక ప్రైవేట్ వ్యక్తి హింసకు, వేధింపులకు లేదా మీడియా ప్రతినిధిని భయపెట్టడానికి కారణమైతే, కమిటీ, కేసును పరిశీలించి, ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత, నేరస్థుడిపై రూ. 25,000 జరిమానా విధించవచ్చు. ఏదైనా కంపెనీ మీడియా ప్రతినిధిని బెదిరింపులకు, హింసకు లేదా హింసకు కారణమైతే, కమిటీ కేసును పరిశీలించి, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత రూ.10,000 జరిమానా విధించబడుతుంది. అర్హులైన మీడియా ప్రతినిధుల నమోదులో ఎవరైనా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తే, కమిటీ ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సంబంధిత వ్యక్తికి రూ.25,000 జరిమానా విధించబడుతుంది.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!