Media persons Protection Bill: జర్నలిస్టుల రక్షణకు బిల్లు తీసుకువచ్చిన ఛత్తీస్గఢ్
Media persons Protection Bill: జర్నలిస్టుల రక్షణ కోసం చత్తీస్ గఢ్ ప్రభుత్వం ‘ ఛత్తీస్గఢ్ మీడియా పర్సన్స్ ప్రొటెక్షన్ బిల్లు 2023 ’ను తీసుకువచ్చింది. బుధవారం ఆ రాష్ట్ర శాసనసభలో దీన్ని ఆమోదించారు. ఇది చారిత్రాత్మక రోజు అని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అభివర్ణించారు. ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయగా.. స్పీకర్ చరదాస్ మహంత్ తిరస్కరించారు. ఛత్తీస్గఢ్లో 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో రాష్ట్రంలోని జర్నలిస్టులకు రక్షణ కల్పించే చట్టాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చింది.
మీడియా ప్రతినిధులపై హింసను నిరోధించడం, విధులు నిర్వర్తించడంలో ఈ బిల్లు రక్షణ ఇస్తుందని సీఎం అన్నారు. ఈ చట్టాన్ని అమలు చేయాలని చాలాసార్లు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి 2019లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అఫ్తాబ్ ఆలం నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేశారని ఈ చట్టం అందరిని సంప్రదించి చేశామని సీఎం బఘేల్ అన్నారు. ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్రంలోని ప్రెస్ క్లబ్లతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందా అని ప్రతిపక్ష నేత నారాయణ్ చందేల్, అజయ్ చంద్రాకర్ సహా బీజేపీ శాసనసభ్యులు ప్రశ్నించారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు.
Also Read
- Faria Abdullah: అతని కోసమె నేను ఇండస్ట్రీలోకి వచ్చాను.. అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
- MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
- Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్లా కూల్గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
Read Also: Hospital Bill : ఆస్పత్రి బిల్లు చూశాడు.. ఎలా చావాలో గూగుల్లో సెర్చ్ చేశాడు
జర్నలిస్టుల ప్రయోజనాలకు బీజేపీ వ్యతిరేకమని, బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ బిల్లు ప్రకారం ఓ వ్యక్తి జర్నలిజంలో కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలి. ప్రస్తుత సంఘటనపై మీడియా సంస్థలో కనీసం 6 కథనాలను ప్రచురించాలి లేదా కనీసం మూడు నెలల జీతాన్ని సదరు మీడియా సంస్థ నుంచి పొందాలి. మీడియా పర్సన్ అంటే ఎడిటర్, రైటర్, న్యూస్ ఎడిటర్, డిప్యూటీ ఎడిటర్, ఫీచర్ రైటర్, కరస్పాండెంట్, కాపీ ఎడిటర్, కమ్యూనికేటర్, కార్టూనిస్ట్, న్యూస్ ఫోటోగ్రాఫర్, వీడియో జర్నలిస్ట్, ట్రాన్స్లేటర్, ట్రైన్ జర్నలిస్టులుగా బిల్లులో పేర్కొన్నారు.
చట్టం అమలులోకి వచ్చిన 90 రోజుల్లోపు ‘ఛత్తీస్గఢ్ మీడియా ఫ్రీడమ్, ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ కమిటీ’ని ఏర్పాటు చేయనున్నారు. ఇది మీడియా పర్సన్స్ వ్యక్తిగత నమోదుకు పనిచేస్తుంది. మీడియా వ్యక్తులపై వేధింపులు, బెదిరింపులు, హింస లేదా తప్పుడు ఆరోపణలు మరియు అరెస్టు వంటి మీడియా వ్యక్తుల రక్షణకు సంబంధించిన ఫిర్యాదులను కమిటీ పరిష్కరిస్తుంది. ఈ కమిటీలో ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి రిటైర్డ్ అడ్మినిస్ట్రేటర్/ పోలీస్ అధికారి ఉంటారు. హోం డిపార్ట్మెంట్ నామినేట్ చేసిన ప్రాసిక్యూషన్ బ్రాంచ్ అధికారితో పాటు ముగ్గురు మీడియా వ్యక్తులు ఇందులో ఓ మహిళా కూడా ఉంటారు.
ఒక ప్రైవేట్ వ్యక్తి హింసకు, వేధింపులకు లేదా మీడియా ప్రతినిధిని భయపెట్టడానికి కారణమైతే, కమిటీ, కేసును పరిశీలించి, ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత, నేరస్థుడిపై రూ. 25,000 జరిమానా విధించవచ్చు. ఏదైనా కంపెనీ మీడియా ప్రతినిధిని బెదిరింపులకు, హింసకు లేదా హింసకు కారణమైతే, కమిటీ కేసును పరిశీలించి, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత రూ.10,000 జరిమానా విధించబడుతుంది. అర్హులైన మీడియా ప్రతినిధుల నమోదులో ఎవరైనా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తే, కమిటీ ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సంబంధిత వ్యక్తికి రూ.25,000 జరిమానా విధించబడుతుంది.
తాజావార్తలు
-
Faria Abdullah: అతని కోసమె నేను ఇండస్ట్రీలోకి వచ్చాను.. అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
-
Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్లా కూల్గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
-
PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
-
Petrol, Diesel: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత భయాల వేళ.. సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!