Sharad Pawar: ఇండియా కూటమిపై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
- ఇండియా కూటమిపై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
- కూటమి లోక్సభ ఎన్నికల కోసమేనని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా కూటమిపై సీనియర్ రాజకీయ వేత్త, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి కేవలం జాతీయ ఎన్నికల కోసమే ఉందని.. రాష్ట్ర, స్థానిక ఎన్నికల కోసం కాదని.. దీనిపై ఎప్పుడూ చర్చ జరగలేదన్నారు. ఇటీవల శివసేన (యూబీటీ) కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో జరిగే స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది. తాజాగా శరద్ పవార్ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. స్థానిక ఎన్నికలపై ఎప్పుడూ చర్చ జరగలేదని.. మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలా? వద్దా? అనేది 8-10 రోజుల్లో సమావేశమై నిర్ణయం తీసుకుంటామన్నారు. తాజాగా శరద్ పవార్ వ్యాఖ్యలతో ఇండియా కూటమి పనైపోయిందని అర్థమవుతోంది. ప్రస్తుతం దాని ఉనికి ప్రశ్నాతార్థకమేనని స్పష్టం అవుతోంది.
ఇది కూడా చదవండి: ICC: రెండోసారి ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు గెలిచిన స్టార్ బౌలర్..
Also Read
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
- Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
- Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
- Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆప్, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ఈ రెండు కూడా ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాయి. కానీ హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి రెండు పార్టీల మధ్య చీలికలు ఏర్పడ్డాయి. విడివిడిగా పోటీ చేసి పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎవరికి వారే సింగిల్గా బరిలోకి దిగాయి. అంతేకాకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. దీంతో ఇండియా కూటమి ప్రస్తుతం మనుగడలో లేదని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Stock Market: సంక్రాంతి జోష్.. లాభాలతో ముగిసిన సూచీలు.. అదానీ షేర్లు పరుగులు
ఇటీవల ఇండియా కూటమిలోని పార్టీల నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి కేవలం లోక్సభ ఎన్నికల కోసమేనని స్పష్టం చేశారు. అలాగే జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా అదే రీతిగా వ్యాఖ్యలు చేశారు. అలాగే శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి కేవలం లోక్సభ ఎన్నికల కోసమే ఉందని.. ఓడిపోగానే ఒక్క రివ్యూ కూడా జరగలేదని తెలిపారు.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. విమర్శలు-ప్రతివిమర్శలతో మాటల యుద్ధం నడుస్తోంది. హస్తిన ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఇక్కడ ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
ఇది కూడా చదవండి: Trimukha: సన్నీ లియోన్ తో కొత్త హీరో ‘త్రిముఖ’!
తాజావార్తలు
-
Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు – అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
-
Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
-
Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
-
Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
-
Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!