Sharad Pawar: ఇండియా కూటమిపై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
- ఇండియా కూటమిపై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
- కూటమి లోక్సభ ఎన్నికల కోసమేనని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా కూటమిపై సీనియర్ రాజకీయ వేత్త, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి కేవలం జాతీయ ఎన్నికల కోసమే ఉందని.. రాష్ట్ర, స్థానిక ఎన్నికల కోసం కాదని.. దీనిపై ఎప్పుడూ చర్చ జరగలేదన్నారు. ఇటీవల శివసేన (యూబీటీ) కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో జరిగే స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది. తాజాగా శరద్ పవార్ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. స్థానిక ఎన్నికలపై ఎప్పుడూ చర్చ జరగలేదని.. మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలా? వద్దా? అనేది 8-10 రోజుల్లో సమావేశమై నిర్ణయం తీసుకుంటామన్నారు. తాజాగా శరద్ పవార్ వ్యాఖ్యలతో ఇండియా కూటమి పనైపోయిందని అర్థమవుతోంది. ప్రస్తుతం దాని ఉనికి ప్రశ్నాతార్థకమేనని స్పష్టం అవుతోంది.
ఇది కూడా చదవండి: ICC: రెండోసారి ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు గెలిచిన స్టార్ బౌలర్..
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆప్, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ఈ రెండు కూడా ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాయి. కానీ హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి రెండు పార్టీల మధ్య చీలికలు ఏర్పడ్డాయి. విడివిడిగా పోటీ చేసి పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎవరికి వారే సింగిల్గా బరిలోకి దిగాయి. అంతేకాకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. దీంతో ఇండియా కూటమి ప్రస్తుతం మనుగడలో లేదని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Stock Market: సంక్రాంతి జోష్.. లాభాలతో ముగిసిన సూచీలు.. అదానీ షేర్లు పరుగులు
ఇటీవల ఇండియా కూటమిలోని పార్టీల నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి కేవలం లోక్సభ ఎన్నికల కోసమేనని స్పష్టం చేశారు. అలాగే జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా అదే రీతిగా వ్యాఖ్యలు చేశారు. అలాగే శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి కేవలం లోక్సభ ఎన్నికల కోసమే ఉందని.. ఓడిపోగానే ఒక్క రివ్యూ కూడా జరగలేదని తెలిపారు.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. విమర్శలు-ప్రతివిమర్శలతో మాటల యుద్ధం నడుస్తోంది. హస్తిన ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఇక్కడ ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
ఇది కూడా చదవండి: Trimukha: సన్నీ లియోన్ తో కొత్త హీరో ‘త్రిముఖ’!
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?