Tamilnadu: కడలూరులో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనం
- తమిళనాడులోని కడలూరు జిల్లాలో దారుణం
- ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనం
- హత్య చేసి తగులబెట్టి ఉంటారని పోలీసుల అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu: తమిళనాడులోని కడలూరు జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనమయ్యారు. సుగంద్ కుమార్తో పాటు తల్లి, కుమారుడు మృతి చెందారు. కడలూరు జిల్లా కరమణి కుప్పంలోని ఓ ఇంట్లో 10 ఏళ్ల బాలుడితో సహా ముగ్గురి మృతదేహాలను సోమవారం ఉదయం వెలికితీశామని పోలీసులు వెల్లడించారు. మృతులు ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారి నుంచి సమాచారం అందుకున్న నెల్లికుప్పం పోలీస్స్టేషన్కు చెందిన పోలీసుల బృందం సంఘటనా స్థలానికి వెళ్లగా, మూడు వేర్వేరు గదుల్లో కాలిపోయిన మూడు మృతదేహాలు కనిపించాయని చెప్పారు.
Read Also: ఎక్స్లో 100 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన ప్రపంచ సెలబ్రిటీలు వీరే!
Also Read
- Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
- Virat Kohli's Replacement: విరాట్ కోహ్లీ స్థానంలో కాటేరమ్మ కొడుకుకే ఛాన్స్.. ఇక పూనకాలే..
- Revanth Reddy on Pawan Kalyan: పవన్ కల్యాణ్ రావచ్చు.. పోవచ్చు.. పోటీ చేసుకోవచ్చు.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
- Sunrisers: ‘దక్షిణాఫ్రికా క్రికెట్ను బతికించింది కాటేరమ్మ కొడుకులే’.. డేల్ స్టెయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
సీనియర్ పోలీసు అధికారి ప్రకారం.. “పోలీసులు ఇంట్లోకి ప్రవేశించడానికి తలుపులు పగలగొట్టవలసి వచ్చింది. మృతుల ముగ్గురి మృతదేహాలు మూడు వేర్వేరు గదుల్లో కాలిపోయాయి. చుట్టూ కొన్ని రక్తపు మరకలు ఉన్నాయని.. మృతులు ముగ్గురు హత్యకు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారి తెలిపారు. మృతులను 60 ఏళ్ల కమలేశ్వరి, ఆమె కుమారుడు సుగంద్ కుమార్, పదేళ్ల మనవడిగా గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న సుగంద్, తల్లిని కలిసేందుకు కొడుకుతో కలిసి కరమణి కుప్పం చేరుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఇంటి నుంచి పొగలు, దుర్వాసన వస్తుండడంతో ఇరుగుపొరుగు వారు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య చేసి తగులబెట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli’s Replacement: విరాట్ కోహ్లీ స్థానంలో కాటేరమ్మ కొడుకుకే ఛాన్స్.. ఇక పూనకాలే..
-
Revanth Reddy on Pawan Kalyan: పవన్ కల్యాణ్ రావచ్చు.. పోవచ్చు.. పోటీ చేసుకోవచ్చు.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Gopichand34: గోపీచంద్ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్న యాక్షన్ కొరియోగ్రాఫర్! మూవీ టైటిల్ ఇదే..
-
Sky Burial: విచిత్రమైన అంత్యక్రియలు.. ఆ దేశంలో ఇప్పటికీ కొనసాగుతున్న భయంకరమైన సంప్రదాయం!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!