Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Chandrababus Government Has Specially Focused On The Development Of Kuppam

Kuppam: మారనున్న కుప్పం రూపురేఖలు.. సీఎం ఆదేశాలతో అభివృద్ధి వైపు వేగంగా అడుగులు..!

Published Date :July 13, 2024 , 4:30 pm
By Sudhakar Ravula
  • సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం అభివృద్ధిపై ఫోకస్..
  • కుప్పంలో అభివృద్ధి పరుగులు పెట్టించడానికి చకచక అడుగులు..
  • ఎన్నికల అనంతరం సీఎం హోదాలో కుప్పంలో పర్యటించిన చంద్రబాబు..
  • కడా (కుప్పం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ) తిరిగి ప్రారంభం..
  • ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఐఏఎస్‌ వికాస్‌ మర్మట్‌..
Kuppam: మారనున్న కుప్పం రూపురేఖలు.. సీఎం ఆదేశాలతో అభివృద్ధి వైపు వేగంగా అడుగులు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kuppam: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం రూపురేఖలు మారిపోతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టించడానికి చకచక అడుగులు పడుతున్నాయి. ఎన్నికల అనంతరం సీఎం హోదాలో కుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. పలుకీలకమైన హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీల్లో భాగంగా తొలుత.. కడా (కుప్పం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ) ను తిరిగి ప్రారంభించారు. కుప్పం సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 1995లోనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో డీఆర్‌డీఏ పీడీ, సబ్‌ కలెక్టర్‌ స్థాయి అధికారులను ప్రాజెక్టు అధికారులుగా కొనసాగారు. 2004 వరకు కొనసాగిన కడాను కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసింది. చంద్రబాబు మూడో దఫా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తర్వాత  2014లో మళ్లీ పునరుద్ధరించారు. ఐదేళ్ల పాటు ప్రాజెక్టు అధికారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమాన్ని అమలు చేశారు.

Read Also: Anant Ambani: అంబానీ ఇంట కుక్కైనా ‘హ్యాపీ’నే.. పెళ్లిలో రాయల్ ట్రీట్మెంట్ చూశారా?

అయితే, వైసీపీ హయాంలో ఆ ప్రాజెక్టుకు అటకెక్కించారు. ఇక, ప్పం పురపాలికతో పాటు కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం మండలాల్లో ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వేగవంతంలో ‘కడా’ కీలకంగా మారనుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి వారధిగా నిలవనుంది. అభివృద్ధి ప్రణాళిక రూపకల్ప, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఆర్‌ అండ్‌ బీ, నీటి పారుదల, విద్యుత్తు, గ్రామీణాభివృద్ధి, డ్వామా, అటవీ, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యానం, పశుసంవర్ధక, హౌసింగ్, నిత్యావసరాలు, ఐసీడీఎస్‌ తదితర శాఖల తోపాటు అన్ని సంక్షేమ విభాగాల్లో కార్యక్రమాల అమలు, అధికారుల విధులు, బాధ్యతలపై పర్యవేక్షణ, సమీక్షల అధికారాన్ని పీడీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అభీష్టం మేరకు పునర్‌ ప్రారంభం కానున్న కుప్పం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో పరుగులు తీయడం ఖాయమని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Hardik Pandya Viral Video: అనంత్ అంబానీ పెళ్లిలో హార్దిక్ వీడియోపై చర్చ..ఇంతకీ ప్యాండ్యా ఏమి ఆర్డర్ చేశారు..?

ఇక, కడా కోసం నెల్లూరు మున్సిపల్‌ కమిషనర్‌గా ఇది వరకు విధులు నిర్వర్తించిన వికాస్‌ మర్మట్‌ను కడా ప్రాజెక్టు డైరెక్టర్‌గా ప్రభుత్వ నియమించింది. 2019వ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ఆయన.. ఆధ్వర్యంలోనే పనులు సాగనున్నాయని అధికారులు చెబుతున్నారు. వందకోట్ల నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు చంద్రబాబు. ఆయా ఆభివృద్దికి సంబంధించిన ప్రణాళిక అధికారులు రూపొందిస్తున్నారు. ఇక శాంతిపురం మండల పరిధిలోని కొలమడుగు గ్రామపంచాయతీ రామాపురం వద్ద కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూములను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పరిశీలించారు. ఎయిర్‌పోర్టు సంబంధించిన భూ పరిశీలన వేగంగా సాగుతోంది. ఇక కుప్పంలోని చిగురుకుంట – బిస్సానత్తం గనుల నుంచి బంగారు నిక్షేపాలు వెలికి తీసేందుకు అడుగులు పడుతున్నట్లు సమాచారం.. దానిపై అధికారులు ఓ నివేదికను సిద్ధం చేస్తున్నారటా.. ఆ ప్రాజెక్టు వల్ల వేలమందికి కుప్పంలో ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇలా కుప్పం అభివృద్ధి టార్గెట్ గా చంద్రబాబు పూర్తి స్ధాయిలో దృష్టి పెట్టడమే కాకుండా ఆ పనులు వేగంగా సాగుతుండటంపై కుప్పం ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Government
  • cm chandrababu
  • IAS Vikas Marmat
  • KADAm

తాజావార్తలు

  • Harish Rao: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. మాజీ మంత్రి హరీష్‌రావు మాస్ రియాక్షన్..

  • Ramayan: ‘రామాయణ్’ రన్‌టైమ్ లీక్ చేసిన రణ్‌బీర్..

  • Raakaasaa:సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్? ‘రాకాస’ మొదటి రోజు వసూళ్లు ఇవే!

  • Rahul Gandhi: మోడీ ఇప్పుడు ట్రంప్ నియంత్రణలో ఉన్నారు.. కేరళ ప్రచారంలో రాహుల్ గాంధీ విసుర్లు

  • Healthy Breakfast for Diabetics: మందులు లేకుండానే షుగర్ కంట్రోల్.. పూర్వీకులు తిన్న ఈ ‘ఆహారం’ సింపుల్‌గా ఇలా చేసేయండి!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions