Chandrababu: నరసాపురం ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: మనందరి బతుకులు మార్చుకునేందుకు కీలకమైన సమయానికి వచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల జలగ పాలనలో మనకేమైన మిగిలిందా.? మన జీవితాలు బుగ్గి అయిపోయాయన్నారు. అన్ని వర్గాలు సంక్షోభంలో పడ్డాయి.. ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిందన్నారు. నరేంద్ర మోడీ పాలనలో దేశం ముందుకు పోతుంటే.. జగన్ పాలనలో రాష్ట్రం రివర్స్ లో వెళ్తోందని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా లేరు.. ఏ రంగం నష్టపోయిన పర్లేదు.. రైతు నష్టపోతే ఏ దేశం బాగు పడదన్నారు. గోదావరి అనగానే గుర్తుకు వచ్చే అన్నదాత ఇపుడు ఇబ్బందుల్లో ఉన్నాడని.. సాగును చంపేశారని, రైతును ముంచేశారని ఆరోపించారు. డెల్టా ప్రాంతంలో ఎప్పుడు రాని సమస్యలు వచ్చాయి.. రోజుకి ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. 2014లో రైతు రుణమాఫీ చేసిన ఘనత టీడీపీదని పేర్కొన్నారు. ఎన్నికల ముందు 12న్నర వెలు ఇస్తాం అన్న జగన్.. 7,500 ఇచ్చి ఊదరగొడుతున్నారన్నారు.
Read Also: YSRCP: వైసీపీకి షాక్.. పార్టీకి, పదవికి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ
Also Read
- NEET Abolition: నీట్పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?
- Bhatti Vikramarka: రాహుల్ గాంధీ అరెస్టు.. రాజ్యాంగాన్ని అవమానించడమే..!
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- Turmeric Stains Remove Tips: బట్టలపై పసుపు మరకలతో ఇబ్బందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో శుభ్రం చేసుకోండి
ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఆక్వా రైతులకు రూపాయన్నరకు కరెంట్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మూడు పార్టీలు కలిసి వచ్చాం అంటే ఎవరి కోసం వచ్చామో మీరే ఆలోచించుకోవాలన్నారు. 2047 నాటికి భారత దేశం ప్రపంచంలో నెంబర్ వన్ అవుతుందన్నారు. కేంద్రంలో మళ్ళీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో 160కి పైగా సీట్లు ఎన్డీఏకు రావాలన్నారు. రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిపోయిందని.. వృద్ధులకు పెన్షన్లు ఇవ్వలేక శవ రాజకీయాలు చేసిన ఘనత జగన్కు దక్కుతుందని విమర్శించారు. తన జోలికి 40ఏళ్లలో ఎవ్వరూ రాలేదు.. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. జాబు రావాలంటే ఎన్డీఏ రావాలని.. ఉద్యోగాలు తీసుకువచ్చే దమ్ము జగన్కు లేదన్నారు. మెగా డీఎస్సీ పెడతాను.. ఉద్యోగాలు ఇస్తాం గ్యారెంటీ ఇస్తాం.. ఉద్యోగాలు వచ్చేవరకు ఉద్యోగ భృతి ఇస్తామని హామీ ఇస్తున్నామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే మండల స్థాయిలో వర్క్ ఫ్రం హోం చేసే అవకాశాలు కల్పిస్తామని, ఇది అసాధ్యం కాదన్నారు. ఆటోమొబైల్ రగం పూర్తిగా నాశనం అయ్యిందన్న ఆయన.. అన్ని రంగాలు నష్టపోయాయన్నారు. మూడు పార్టీల జెండాలు వేరైనా ఎజెండా ఒకటేనన్నారు. మీ పిల్లలకు భవిష్యత్తు ఉండాలంటే ఎన్డీఏ తప్ప మరొక ఆప్షన్ లేదన్నారు. నరసాపురం సమస్యల పరిష్కారంతో పాటు పేదలకు రెండు సెంట్లు భూమి ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
NEET Abolition: నీట్పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?
-
Bhatti Vikramarka: రాహుల్ గాంధీ అరెస్టు.. రాజ్యాంగాన్ని అవమానించడమే..!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
VW 24 inch QLED TV: VW 24 ఇంచెస్ HD Ready QLED TV.. రూ.5 వేలలోనే బెస్ట్ బడ్జెట్ టీవీ!
-
Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!