Chandrababu: మా పొత్తుతో జగన్కు నిద్రపట్టడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: నాలుగు లక్షల కోట్ల ప్రజాధనాన్ని విధ్వంసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. బాపట్ల ప్రజాగలం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తన బాధంతా ప్రజల ఆస్తి లూటీ అవుతుందని.. సంపదను నాశనం చేసి మీ నెత్తిన 13 లక్షల కోట్ల అప్పులు పెట్టాడని ఆరోపించారు. ఈ అప్పులన్నీ ఎవరు కడతారని ప్రశ్నించారు. పన్నుల రూపంలో ప్రజలే కట్టాలి అడిగితే సమాధానం చెప్పే వాళ్ళు లేరు అదే తన బాధ అని పేర్కొన్నారు. పోలవరం ఈ రాష్ట్రానికి రెండో కన్ను పోలవరం పూర్తి అయితే గోదావరి కృష్ణ నదుల అనుసంధానం జరిగేదన్నారు. నాగార్జునసాగర్ ద్వారా రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లి నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరానికి నీళ్లు అందించే వాళ్ళమన్నారు. టెండర్లు మార్చి రివర్స్ టెండరింగ్ అన్నాడు.. రివర్స్ టెండర్రింగ్తో గోదావరిలో పోలవరాన్ని ముంచేశాడన్నారు.
Read Also: Janasena: జనసేన రాష్ట్ర ఎన్నికల పర్యవేక్షణ కమిటీ నియామకం
Also Read
- Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
- Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
- Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
ఈ ముఖ్యమంత్రి విచిత్రమైన వ్యక్తి అని.. ఎంతో మంది ముఖ్యమంత్రులని చూశాను కానీ ఇలాంటి విచిత్రమైన ముఖ్యమంత్రి అని తాను చూడలేదన్నారు. నా బీసీలు అంటూనే 30 రకాల పథకాలు రద్దు చేశాడన్నారు. నా ఎస్సీలని 27 పథకాలు రద్దు చేశారన్నారు. నా ఎస్సీలు అని చెప్పే ముఖ్యమంత్రి, ఓ ఎస్సీని చంపి డోర్ డెలివరీ చేస్తే ఏం చేశాడన్నారు. అంబేడ్కర్ పేరుతో విదేశీ విద్యా పథకాన్ని పెడితే , ఆ పేరు మార్చేసి జగన్ అన్న విద్యా పథకం అని పెట్టుకున్నాడన్నారు. బీసీలు, ఎస్సీలు ఈ విధానాన్ని సపోర్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. విద్యుత్ చార్జీలు పెరిగిపోయాయి, దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక దందా ఎవరిది జగన్మోహన్ రెడ్డి కాదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయన్నారు. బాపట్ల లాంటి ప్రాంతంలో కూడా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారన్నారు. ఆ గంజాయి అమ్మకాల్లో ఎమ్మెల్యేలకు వాటాలు ఉన్నాయని ఆరోపించారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. “బాపట్ల నాకు బ్రహ్మరధం పట్టింది. మూడు పార్టీల కలయిక విజయానికి అన్ స్టాపబుల్.ప్రజలు విజ్ఞతతో ఎన్నికలలో ఓటు వేయాలి. జగన్ అహంకారం విధ్వంసంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. ఈ ప్రాంతా దాహార్తిని తీర్చడానికే పట్టిసీమ నిర్మించాను. పవన్ మొదటి నుంచి ప్రభుత్వం ఓటు చీలనివ్వనని చెప్పారు. మా పొత్తుతో జగన్కు నిద్రపట్టడం లేదు. కేంద్రంలో ముస్లీంలకు వ్యతిరేక బిల్లులకు జగన్ మద్దతు తెలిపాడు. ఉర్దూ రెండవ భాషగా 13 జిల్లాలో ప్రకటించింది నేనే. కులాలకు అతీతంగా తెలుగు వారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఏకంకావాలి. గడితప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతాను. నేను విమర్శకులకే పరిమితం కాను. రాష్ట్రాభివృద్దికి కోసం సంపద సృష్టిస్తాను. పేదలు అన్ని కులాలలో ఉన్నారు. పిల్లలే రాష్ట్రానికి ఆస్తి.” అని చంద్రబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
-
Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..