Chandrababu: వాలంటీర్లను తొలగించబోం.. నాయుడుపేట సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీల నేతలు తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు.సూళ్లూరుపేటలో టీడీపీ గాలి వీస్తోందన్న ఆయన.. జగన్కు ఓటు వేసినందుకు ఆయన ప్రజలను మోసగించారని విమర్శించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం రేయింబవళ్లు పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. జగన్ పాలనలో ఎవరికీ న్యాయం జరగలేదని.. అన్ని అన్ని నిత్యవసర వస్తువుల ధరలు విద్యుత్ చార్జీలను గణనీయంగా పెంచారని ఆరోపించారు. అభ్యర్థుల ఎంపికను కూడా ప్రజల ద్వారానే చేశామని చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ హయాంలో అన్ని వర్గాలూ దెబ్బ తిన్నాయన్నారు.
Read Also: Pithani Balakrishna: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పితాని బాలకృష్ణ
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
స్థానికులకు ఉపాధి కల్పించేందుకు కోసమే తిరుపతిలో ఎలక్ట్రానిక్ హబ్ను ఏర్పాటు చేశామన్నారు. నాయుడుపేట.. సూళ్లూరు పేట ప్రాంతంలో ఎన్నో విదేశీ కంపెనీలను ఇక్కడికి తీసుకువచ్చామని చంద్రబాబు చెప్పారు. శ్రీ సిటీలో కూడా ఎన్నో పరిశ్రమలు వచ్చాయన్నారు. కానీ జగన్ హయాంలో మాత్రం పరిశ్రమలు తరిమేస్తున్నారని విమర్శలు గుప్పించారు. తిరుపతిలో అమర్ రాజా కంపెనీని తరిమేశారన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. తన బ్రాండ్ చూసి కియా, టీసీఎల్ లాంటి కంపెనీలు వచ్చాయని.. తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్లను తీసుకు వచ్చామన్నారు.
Read Also: CM YS Jagan: లబ్ధి చేకూరింది.. తుగ్గలిలో ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి
ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాడికి ఎమ్మెల్యే సీటు.. దోపిడీ చేసే వారికి ఎంపీ సీటు జగన్ ఇచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. తాను ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో చేశానని చంద్రబాబు పేర్కొన్నారు. వైయస్సార్ కంటే తాను ముందుగానే ముఖ్యమంత్రి అయ్యానన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. వాలంటీర్లకు నెలకు 5000 జీతం ఇస్తున్నారని.. బాగా చదువుకున్న వారు జగన్ ట్రాప్లో పడవద్దని కోరుతున్నామన్నారు. వాలంటీర్లను తొలగించబోమని హామీ ఇస్తున్నామని చంద్రబాబు చెప్పారు. బాగా చదువుకున్న వాలంటీర్లు నెలకు రూ. 50 వేలు సంపాదించే మార్గాన్ని చూపిస్తామన్నారు. మెగా డీఎస్సీ నిర్వహణపైనే మొదటి సంతకం పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!