Pithani Balakrishna: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పితాని బాలకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pithani Balakrishna: ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర జోరుగా సాగుతోంది. ఓ వైపు ఎన్నికల ప్రచారం, మరో వైపు చేరికలతో ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు సీఎం జగన్. బస్సు యాత్ర సందర్భంగా పలు పార్టీలకు చెందిన అసంతృప్త నేతలు వైసీపీలో చేరుతున్నారు. తాజాగా.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన కో-ఆర్డినేటర్గా ఉన్న పితాని బాలకృష్ణ.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పితాని బాలకృష్ణతో పాటు పలువురు జనసేన నేతలు వైసీపీలో చేరారు.
Read Also: YSRCP: వైసీపీలోకి కళ్యాణ దుర్గం టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
కాగా, 2014 నుంచి 2019 వరకు ముమ్మిడివరం వైసీపీ కోఆర్డినేటర్ గా ఉన్నారు పితాని బాలకృష్ణ.. అయితే, 2019లో పితానికి వైసీపీ టికెట్ నిరాకరించడంతో.. ఆ పార్టీకి గుడ్బై చెప్పిన బాలకృష్ణ.. ఆ వెంటనే జనసేన పార్టీలో చేరారు.. ఇక, గత ఎన్నికల్లో జనసేన తరపున ముమ్మిడివరం అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగినా విజయం సాధించలేకపోయారు.. అయితే, ఇప్పుడు జనసేన సీటు నిరాకరించడంతో.. తిరిగి సొంత గూటికి చేరారు పితాని బాలకృష్ణ. ఇటీవల జనసేనపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు పితాని బాలకృష్ణ. శెట్టిబలిజలకు ఒకరికి కూడా సీటు ఇవ్వలేదని పార్టీని ప్రశ్నించారు. వన్ కళ్యాణ్ కనీసం కలవడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆరోపణలు గుప్పించారు. ముమ్మిడివరం పొత్తులో టీడీపీకి వెళ్తే రామచంద్రపురం సీటుపై ఆశలు పెట్టుకున్నారు పితాని బాలకృష్ణ. అక్కడ తనకు టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.. అందులో భాగంగా ఈ రోజు జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు పితాని బాలకృష్ణ.
Read Also: CM YS Jagan: లబ్ధి చేకూరింది.. తుగ్గలిలో ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి
ఇదిలా ఉండగా.. కళ్యాణ దుర్గం టీడీపీ ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు.. అలాగే కంబదూరు, శెట్టూరుకు చెందిన టీడీపీ నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ ఇంఛార్జ్గా ఉన్న ఉమామహేశ్వర నాయుడు ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. టికెట్ రాకపోవడంతో మనస్తాపానికి గురై వైసీపీలో చేరారు. గతంలో ఆయన మంత్రి ఉషశ్రీ చరణ్పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు పోటీకి సిద్ధం కాగా.. టికెట్ దక్కకపోవడంతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈ బస్సు యాత్రలో భాగంగా టీడీపీ, జనసేన అసంతృప్త నేతలను వైసీపీలో చేర్చుకునేందుకు పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?