LTC Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.
- లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టిసి) కింద లగ్జరీ రైళ్లలోను ఉచితంగా ప్రయాణించే అవకాశం.
- ఉద్యోగులు తమ కుటుంబాలతో సమయాన్ని గడిపేందుకు ప్రోత్సహించడమే లక్ష్యంగా స్కీమ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయాణంలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టిసి) కింద కేంద్ర ఉద్యోగులు ఇప్పుడు తేజస్ ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్, హమ్సఫర్ ఎక్స్ప్రెస్ వంటి లగ్జరీ రైళ్లలోను ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ సౌకర్యం ద్వారా ఉద్యోగులు తాము అర్హత ఉన్న రైళ్లలో పూర్తిగా ఉచితంగా ప్రయాణించవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT) విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, ఎల్టిసి కింద ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రాజధాని, శతాబ్ది రైళ్లతోపాటు, తేజస్, వందే భారత్, హమ్సఫర్ వంటి రైళ్లను కూడా జోడించారు. ఈ నిర్ణయం ఉద్యోగుల నుండి వచ్చిన సూచనల అనంతరం తీసుకున్నట్లు డిఒపిటి తెలిపింది.
Also Read: Manchu Family : నేను గొడవలు చేయడానికి రాలేదు : మంచు మనోజ్
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
- AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
- Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
- Team India Players: టీమిండియా ఆటగాళ్లలో మొదలైన భయం.. మా వంతు రాదని గ్యారెంటీ ఏంటి అంటూ..
ఎల్టిసి కింద ప్రయాణించే ఉద్యోగులు వేతనంతో కూడిన సెలవు పొందుతారు. అలాగే ప్రయాణ టిక్కెట్లకు సంబంధించిన ఖర్చును కూడా ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఉద్యోగులు నాలుగేళ్లకు ఒకసారి ఎల్టిసి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇది దేశంలోని ఏ ప్రాంతానికైనా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. ఎల్టిసి కింద రైళ్లతో పాటు, విమాన ప్రయాణానికి కూడా మినహాయింపు ఉంది. ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులకు, జమ్మూ-కశ్మీర్, లడఖ్ ప్రయాణించే ఉద్యోగులకు సెప్టెంబర్ 25, 2026 వరకు విమాన ప్రయాణంపై మినహాయింపు ఇవ్వబడింది. అయితే, విమాన ప్రయాణానికి అర్హత కలిగిన ఉద్యోగులు మాత్రమే ఈ సౌకర్యాన్ని పొందగలరని డిఒపిటి స్పష్టం చేసింది.
Also Read: Viral Video: ఎంత తింటావ్ తిను.. అవినీతి అధికారిపై నోట్లు విసిరిన ప్రజలు
ఈ విధానం ప్రధానంగా ఉద్యోగులు తమ కుటుంబాలతో సమయాన్ని గడిపేందుకు ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. టిక్కెట్లకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించడం వల్ల, ఉద్యోగులపై ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లభిస్తున్న ఈ ప్రయోజనాలు వారికి మరింత ఆధ్యాత్మిక శాంతిని, కుటుంబ సమైక్యతను అందించడానికి సహాయపడతాయని అధికారులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!