దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రథమ పౌరురాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది దేశ ప్రజలందరికి శుభ సందర్భం అన్న ముర్ము ఈ సంబరాన్ని చూస్తుంటే తన ఆనందానికి అవధులు లేకుండాపోతున్నాయన్నారు. నగరాలు, గ్రామాలలో పిల్లలు, యువత, వృద్ధులు.. ఇలా ప్రతి ఒక్కరు స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తోందన్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారని ముర్ము ఆనందం వ్యక్ంచేశారు. ఇక ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు మహిళా సాధికారత కోసం ప్రయత్నించాలని ముర్ము పిలుపునిచ్చారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ ఎర్రకోటపై జెండా ఎగురవేసి జాతిని ఉద్దేశించి మాట్లాడారు. మణిపూర్ లో శాంతి స్థాపన, దేశాభివృద్ధిలో యువత పాత్ర, తమ ప్రభుత్వ ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలు తదితర విషయాల గురించి మోడీ వివరించారు. వచ్చే ఐదేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశాన్ని అగ్రగామిగా నిలుపుతామని మోడీ అన్నారు.

Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీష్ పాలనలో భారతదేశంలో సూదీ కూడా తయారుచేయలేదని నెహ్రూ పెద్ద పెద్ద కంపెనీలను స్థాపించారని, ఆటమిక్ ఎనర్జీ ప్లాంటులను కూడా స్థాపించారన్నారు. ఐఐటీలను, ఐఐఎం ల స్థాపనకు కృషి చేశారని కొనియాడారు. ఎర్రకోటలో నిర్వహించిన వేడుకలకు దూరంగా ఉన్న ఆయన ఎక్స్ ద్వారా తన సందేశాన్ని అందించారు.

స్వాతంత్ర్య దినోత్సం సందర్భంగా దేశ ప్రజలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. భారతమాత ప్రతి భారతీయుడి గొంతుక అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఒక నోట్ ను కూడా ఆయన జత చేశారు. తన భారత్ జోడో యాత్ర వీడియోను పంచుకున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గోల్కొండ వద్ద ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం లక్ష రూపాయల లోపు ఉన్న రైతుల రుణాన్ని మాఫీ చేశారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలక శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తమ ప్రభుత్వ చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.
వీరితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు, వ్యాపార దిగ్గజాలు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజావార్తలు
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!