Mallikarjun Kharge: ఎర్రకోట స్వాతంత్ర్య వేడుకలకు మల్లికార్జున్ ఖర్గే దూరం .. ఎక్స్ లో సందేశం పోస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge: ఎర్రకోటలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన మల్లికార్జన ఖర్గే గౌర్హాజరయ్యారు. ఎర్రకోటలోని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఖర్గే హాజరు కాకపోవడానికి కారణాలను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించపోయినప్పటికీ.. ఆరోగ్యం బాగా లేక తాను హాజరు కాలేదని ఖర్గే తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు ఖర్గే హాజరుకాకపోవడంతో.. ఆయన కోసం వేసిన కుర్చీ ఖాళీగా కనిపించింది. ప్రధాని మోదీ ప్రసంగానికి ఆయన హాజరు కాకపోయినప్పటికీ ఖర్గే తన ట్విట్టర్ అకౌంట్లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశారు.
Read also: Match Fixing: మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం.. దేశం దాటకుండా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్పై నిషేధం!
Also Read
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్గా మారిన స్వీట్!
- Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జెండా ఎగురవేసిన తర్వాత ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అతిథులు అందరూ వచ్చినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే హాజరుకాలేదు. దీంతో ఆయన కోసం కేటాయించిన కుర్చీ ఖాళీగా కనిపించింది. ట్విట్టర్ ఖాతా లో ఓ వీడియో మెసేజ్ చేసిన ఖర్గే.. ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మన దేశానికి ఆత్మ. దేశం ఐక్యత, సమగ్రత కోసం, ప్రేమ, సోదరభావం కోసం, సామరస్యం కోసం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం స్వేచ్ఛను మేము సమర్థిస్తామని మేము ఈ ప్రమాణం చేస్తున్నామని ఖర్గే పేర్కొన్నారు. గత ప్రధానులు దేశాన్ని తీర్చిదిద్దన వైనాన్ని తమ ప్రసంగాల్లో వెల్లడించారని గుర్తు చేశారు. ఆరోగ్యం సరిగా లేని కారణంగా స్వాతంత్య్ర వేడుకలకు హాజరుకాలేదని చెప్పిన ఖర్గే.. తన మెసేజ్లో గాంధీ, నెహ్రూ, సర్థార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మౌలానా ఆజాద్, రాజేంద్ర ప్రసాద్, సరోజిని నాయుడు, అంబేద్కర్ లకు నివాళి అర్పించారు. భారత తొలి ప్రధాని నెహ్రూతో పాటు ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి చేసిన మేలు గురించి వివరించారు. ప్రతి ప్రధాని దేశ ప్రగతి కోసం ఎంతో కొంత సహకరించారని, కానీ ఈ రోజుల్లో కొందరు మాత్రం గత కొన్నేళ్లలోనే దేశం ప్రగతి సాధించినట్లు చెబుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు కొత్త విధానాలను వాడుతున్నారని.. సీబీఐ, ఈడీ, ఐటీతో దాడులు చేయిస్తున్నారని, ఎన్నికల సంఘాన్ని బలహీనపరిచారని, విపక్ష గొంతులను నొక్కుతున్నారని, వాళ్ల మైక్లను లాగేసి సస్పెండ్ చేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు.
आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएँ व बधाई।
लोकतंत्र और संविधान हमारी देश की आत्मा है।
हम यह प्रण लेते हैं कि हम देश की एकता और अखंडता के लिये, प्रेम और भाईचारे के लिए, सौहार्द और सद्भाव के लिए लोकतंत्र और संविधान की स्वतंत्रता क़ायम रखेंगे।
जय हिन्द 🇮🇳 pic.twitter.com/d5EurpcRNM
— Mallikarjun Kharge (@kharge) August 15, 2023
తాజావార్తలు
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్హౌస్లో ట్రంప్తో జిన్పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!