Mallikarjun Kharge: ఎర్రకోట స్వాతంత్ర్య వేడుకలకు మల్లికార్జున్ ఖర్గే దూరం .. ఎక్స్ లో సందేశం పోస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge: ఎర్రకోటలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన మల్లికార్జన ఖర్గే గౌర్హాజరయ్యారు. ఎర్రకోటలోని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఖర్గే హాజరు కాకపోవడానికి కారణాలను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించపోయినప్పటికీ.. ఆరోగ్యం బాగా లేక తాను హాజరు కాలేదని ఖర్గే తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు ఖర్గే హాజరుకాకపోవడంతో.. ఆయన కోసం వేసిన కుర్చీ ఖాళీగా కనిపించింది. ప్రధాని మోదీ ప్రసంగానికి ఆయన హాజరు కాకపోయినప్పటికీ ఖర్గే తన ట్విట్టర్ అకౌంట్లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశారు.
Read also: Match Fixing: మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం.. దేశం దాటకుండా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్పై నిషేధం!
Also Read
- Bhojshala Case: "భోజ్శాల హిందువులదే".. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
- Monsoon 2026: గుడ్న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bhojshala case: "భోజ్శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జెండా ఎగురవేసిన తర్వాత ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అతిథులు అందరూ వచ్చినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే హాజరుకాలేదు. దీంతో ఆయన కోసం కేటాయించిన కుర్చీ ఖాళీగా కనిపించింది. ట్విట్టర్ ఖాతా లో ఓ వీడియో మెసేజ్ చేసిన ఖర్గే.. ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మన దేశానికి ఆత్మ. దేశం ఐక్యత, సమగ్రత కోసం, ప్రేమ, సోదరభావం కోసం, సామరస్యం కోసం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం స్వేచ్ఛను మేము సమర్థిస్తామని మేము ఈ ప్రమాణం చేస్తున్నామని ఖర్గే పేర్కొన్నారు. గత ప్రధానులు దేశాన్ని తీర్చిదిద్దన వైనాన్ని తమ ప్రసంగాల్లో వెల్లడించారని గుర్తు చేశారు. ఆరోగ్యం సరిగా లేని కారణంగా స్వాతంత్య్ర వేడుకలకు హాజరుకాలేదని చెప్పిన ఖర్గే.. తన మెసేజ్లో గాంధీ, నెహ్రూ, సర్థార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మౌలానా ఆజాద్, రాజేంద్ర ప్రసాద్, సరోజిని నాయుడు, అంబేద్కర్ లకు నివాళి అర్పించారు. భారత తొలి ప్రధాని నెహ్రూతో పాటు ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి చేసిన మేలు గురించి వివరించారు. ప్రతి ప్రధాని దేశ ప్రగతి కోసం ఎంతో కొంత సహకరించారని, కానీ ఈ రోజుల్లో కొందరు మాత్రం గత కొన్నేళ్లలోనే దేశం ప్రగతి సాధించినట్లు చెబుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు కొత్త విధానాలను వాడుతున్నారని.. సీబీఐ, ఈడీ, ఐటీతో దాడులు చేయిస్తున్నారని, ఎన్నికల సంఘాన్ని బలహీనపరిచారని, విపక్ష గొంతులను నొక్కుతున్నారని, వాళ్ల మైక్లను లాగేసి సస్పెండ్ చేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు.
आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएँ व बधाई।
लोकतंत्र और संविधान हमारी देश की आत्मा है।
हम यह प्रण लेते हैं कि हम देश की एकता और अखंडता के लिये, प्रेम और भाईचारे के लिए, सौहार्द और सद्भाव के लिए लोकतंत्र और संविधान की स्वतंत्रता क़ायम रखेंगे।
जय हिन्द 🇮🇳 pic.twitter.com/d5EurpcRNM
— Mallikarjun Kharge (@kharge) August 15, 2023
తాజావార్తలు
-
Husband Suicide: ‘‘నా చేయి పట్టుకున్న భార్యే నన్ను చంపింది’’.. సూసైడ్ వీడియోలో భర్త ఆవేదన
-
Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్ను దాటిన డాలర్ విలువ!
-
Durandhar 2 Review: ఓటీటీలోకి ‘ధురంధర్: ద రివెంజ్’.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
-
Peddi : వేట షురూ.. ‘రాంబుజ్జి’గా దివ్యేందు సంచలన ఎంట్రీ!
-
Bhojshala Case: “భోజ్శాల హిందువులదే”.. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!