AP Elections 2024: సీఎస్ వివరణపై స్పందించిన సీఈసీ.. అలా అయితే మాకు అభ్యంతరం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేళ.. పలు పాత స్కీమ్లకు సంబంధించిన లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా నగదు జమ చేయాల్సిన వ్యవహారం ఇప్పుడు కాకరేపుతోంది.. అయితే, డీబీటీ పథకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి ఇచ్చిన వివరణపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది.. జనవరి-మార్చి మధ్య కాలంలో ఏపీ ఆర్ధిక పరిస్థితి బాగానే ఉందని సీఎస్ చెప్పారు.. లబ్ధిదారులకు ఆ నిధులు అందుబాటులో ఉంచలేదు. బ్యాంకు ఖాతాలకు జమ చేయాల్సినప్పుడు కాకుండా దాన్ని దీర్ఘకాలం పెండింగులో ఉంచారని పేర్కొంది.. అయితే, గత ట్రాక్ రికార్డ్ చూసినా మే నెలలో ఎప్పుడూ డీబీటీ పథకాలకు నిధులు జమ చేయలేదన్న ఎన్నికల కమిషన్.. పోలింగ్ తేదీ కంటే ముందుగా లబ్దిదారుల ఖాతాలకు నిధులను జమ చేయాల్సినంత అత్యవసర పరిస్థితులు ఏమీ లేవు అని స్పష్టం చేసింది.. అయితే, పోలింగ్ తేదీ తర్వాత ఎప్పుడైనా ఆరు పథకాలకు సంబంధించిన నిధులు లబ్దిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా జమ చేసేందుకు అభ్యంతరం లేదని పేర్కొంది కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ).
Read Also: PM Modi: సిక్కుల దుస్థితిని చూసి అవమానంగా ఫీలయ్యా
Also Read
- Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
- Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
కాగా, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఎన్నికల కమిషన్ లేఖ రాసిన విషయం విదితమే.. సంక్షేమ పథకాలకు నిధులు విడుదలపై వివిధ ప్రశ్నలు లేవనేత్తుతూ ఈసీఐ లేఖ రాసింది. జనవరి 2024 నుంచి మార్చి 2024 వరకు డీబీటీలకు నిధులెందుకు ఇవ్వలేదు?.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏంటో చెప్పండి?.. ఇప్పటి వరకు జమ చేయలేని ప్రభుత్వానికి ఇప్పుడు ఒక్కసారిగా నిధులెలా సర్దుబాటు అయ్యాయి?.. ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నం ఎన్నికల పోలింగ్ తేదీకి దగ్గరగా డబ్బులు పంపిణీ కాదని ఎలా చెపుతారు? అంటూ ప్రశ్నించింది. ఇలా సొమ్ములు పంపిణీ చేయడం వల్ల ఇతర అభ్యర్థులకు అన్యాయం జరగదా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతినదా? అని లేఖలో అడిగింది. గత ఐదేళ్లగా సంక్షేమ పథకాలకు నిధులు బటన్ నొక్కిన నాటి నుంచి ఎన్ని రోజుల్లో పడ్డాయి ఆ వివరాలు ఇవ్వండి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏపీ సీఎస్ ను అడిగింది. ఇప్పుడు మాత్రమే నిధుల జమ ఎందుకు ఆలస్యమైంది?.. పోలింగ్ తేదీకి దగ్గరగా ఈ సొమ్ములు ఎందుకు వేయాలనుకుంటున్నారు?.. ఈరోజే లబ్ధిదారులకు సొమ్ము చెల్లించకపోతే జరిగే ప్రమాదం ఏంటీ?.. సంక్షేమ పథకాలు నిధులు ఇస్తామని చెప్పి వారాలు, నెలలు గడిచిపోయాయి.. ఏప్రిల్, మే నెలలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని ముందుగా తెలియదా? అని లేఖలో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక, వీటిపై ఈసీకి సీఎస్ వివరణ ఇవ్వడంతో మరోసారి స్పందిస్తూ.. పోలింగ్ తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తే తమకు అభ్యంతరం లేదని పేర్కొంది కేంద్ర ఎన్నికల సంఘం.
తాజావార్తలు
-
Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
-
IND vs SL 2nd Test: 33 ఏళ్ల సారాంశ్ జైన్ అరంగేట్రం.. కుల్దీప్ యాదవ్ ఆడకపోవడానికి కారణం ఫామ్ కాదు!
-
David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
-
Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
-
Anil RaviPudi : ‘జనవరి 12 విడుదల’లో స్పెషల్ సాంగ్.. మాస్ ఫ్యాన్స్కు పూనకాలే
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!