CBI Raids: మద్యం కుంభకోణం కేసు.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు..
- ఓ సీనియర్ పోలీసు అధికారి ఇంట్లో కూడా రైడ్స్
- ఆ మేరకు ట్వీట్ చేసిన మాజీ సీఎం
- గతంలో కూడా ఈడీ రైడ్స్
ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ నివాసానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు చేరుకున్నారు. ఆయన ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ బృందాలు రాయ్పూర్, భిలాయ్లోని బాఘేల్ నివాసంతో పాటు ఓ సీనియర్ పోలీసు అధికారి, మాజీ ముఖ్యమంత్రి సన్నిహితుడి ఇంట్లో కూడా రైడ్స్ జరుపుతున్నారు. సీబీఐ అధికారులు ఆయన సన్నిహితులు వినోద్ వర్మ, దేవేంద్ర యాదవ్ నివాసానికి కూడా చేరుకున్నారని వర్గాలు తెలిపాయి.
READ MORE: Shashank Singh: అందుకే శ్రేయస్కు స్ట్రైక్ ఇవ్వలేదు.. అసలు విషయం చెప్పేసిన శశాంక్ సింగ్!
Also Read
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Cucumber Chutney Recipe: మండుటెండలో చల్లని టేస్టీ రెసిపీ.. దోసకాయ చట్నీ ఇలా తయారు చేయండి..
- Emergency Alert: మీ మొబైల్స్ పెద్ద శబ్దంతో మోగాయా? కంగారు పడకండి.. మేటరేంటంటే..!
- Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..
వాస్తవానికి.. భూపేశ్ ప్రభుత్వ హయాంలో మద్యం, బొగ్గు, మహాదేవ్ సత్తా యాప్ వంటి అనేక కుంభకోణాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణాలలో కొంతమంది అధికారులు దర్యాప్తు సంస్థల రాడార్లో కూడా ఉన్నారని సమాచారం. భూపేశ్ బాఘేల్ ఎక్స్ హ్యాండిల్ నుంచి ఓ ట్వీట్ వచ్చింది. ‘ ఏప్రిల్ 8, 9 తేదీల్లో అహ్మదాబాద్ (గుజరాత్)లో జరగనున్న ఏఐసీసీ (AICC) సమావేశం కోసం ఏర్పాటు చేసిన “ముసాయిదా కమిటీ” భేటీకి మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. అంతకు ముందే, సీబీఐ రాయ్పూర్, భిలాయ్ నివాసాలకు చేరుకుని సోదాలు నిర్వహిస్తోంది.” అని రాసుకొచ్చారు.
READ MORE: Shashank Singh: అందుకే శ్రేయస్కు స్ట్రైక్ ఇవ్వలేదు.. అసలు విషయం చెప్పేసిన శశాంక్ సింగ్!
ఇటీవల, మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బాఘేల్ నివాసంపై దాడి చేసింది. మార్చి 10న, లిక్కర్ స్కామ్ కేసులో భూపేశ్ బాఘేల్ కుమారుడిపై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా దుర్గ్ జిల్లాలోని భిలాయ్ పట్టణంలోని ఆయన నివాసంపై ఈడీ దాడులు నిర్వహించింది. ఈ సోదాల సమయంలో తన ఇంట్లోనే ఉన్న భూపేశ్ బాఘేల్ ఈడీ దాడికి సంబంధించి బీజేపీని విమర్శించారు. వాస్తవానికి.. రాష్ట్రంలో మద్యం కుంభకోణం 2019- 2022 మధ్య జరిగింది. ఆ సమయంలో ఛత్తీస్గఢ్ను బాఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పాలించింది. ఛత్తీస్గఢ్లో జరిగిన మద్యం కుంభకోణం రాష్ట్ర ఖజానాకు భారీ నష్టాన్ని కలిగించిందని, మద్యం సిండికేట్ లబ్ధిదారులు రూ.2,100 కోట్లకు పైగా దోచుకున్నారని కేంద్ర ఏజెన్సీ గతంలో పేర్కొంది.
తాజావార్తలు
-
IPL 2026 Centuries: ‘వంద’ కొడితే ఓటమే.. ఐపీఎల్ 2026లో ఆసక్తికర ట్రెండ్!
-
Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
-
Vivo S50t 5G: 50MP ట్రిపుల్ కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్తో.. వివో S50t 5G విడుదల
-
Cucumber Chutney Recipe: మండుటెండలో చల్లని టేస్టీ రెసిపీ.. దోసకాయ చట్నీ ఇలా తయారు చేయండి..
-
Emergency Alert: మీ మొబైల్స్ పెద్ద శబ్దంతో మోగాయా? కంగారు పడకండి.. మేటరేంటంటే..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!