Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Case Registered On Ci And Advocate Over Software Employee Suicide In Eluru

Techie Suicide Case: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య.. సీఐ, అడ్వకేట్‌లపై కేసు నమోదు

Published Date :September 6, 2023 , 4:30 pm
By Mahesh Jakki
Techie Suicide Case: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య.. సీఐ, అడ్వకేట్‌లపై కేసు నమోదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Techie Suicide Case: ఏలూరు జిల్లా దెందులూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి చుక్కా తేజోమూర్తి కేసులో ఏలూరు వన్‌టౌన్ సీఐ రాజశేఖర్, అడ్వకేట్ సుబ్బారావులపై ఏలూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. చుక్కా తేజోమూర్తిపై అతని భార్య ప్రియాంకా ఏలూరు వన్ టౌన్‌లో పిర్యాదు చేయడంతో కౌన్సిలింగ్ పేరుతో స్టేషన్‌కు పిలిపించి తేజోమూర్తిని సీఐ రాజశేఖర్, లాయర్ సుబ్బారావు వేధింపులకు గురి చేశారని అతని బంధువులు తీవ్రస్థాయిలో ఆరోపించారు. 10 లక్షలు ఇచ్చి ప్రియాంకతో సెటిల్ చేసుకోవాలని సీఐ వేధింపులకు గురిచేయడంతో ఒత్తిడికి లోనైన తేజోమూర్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపించారు. బంధువుల స్టేట్‌మెంట్ ప్రకారం Cr no. 71/23 u/s 306 IPC సెక్షన్ల కింద తేజోమూర్తి భార్య ప్రియాంకతో పాటు ఆమె తల్లిదండ్రులు , సీఐరాజశేఖర్, అడ్వకేట్ సుబ్బారావు పేర్లను రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఈ కేసును దెందులూరు సివిల్ పోలీసులకు బదిలీ చేశారు.

Also Read: Physical Harassment: పాక్లో 45 మంది మహిళా టీచర్లపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు

అసలేం జరిగిందంటే.. దెందులూరు గ్రామానికి చెందిన చుక్కా రాంప్రసాద్‌, రత్నమాల దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు తేజోమూర్తి బీటెక్‌ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లో ఏలూరు నగరానికి చెందిన రవ్వ నాగ ప్రియాంకతో ప్రేమలో పడ్డారు. ఇద్దరు ఒకే కులానికి చెందిన వారు కావడంతో వారి ప్రేమ విషయం పెద్దల దృష్టికి వెళ్లగా ముందు చదువు పూర్తి చేయాలని సూచించారు. తేజోమూర్తి తండ్రి రాంప్రసాద్‌ 2021లో ప్రాణాలు కోల్పోగా.. తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి బీటెక్‌ పూర్తి చేసిన తేజోమూర్తి కొంతకాలం దెందులూరులో హోటల్‌ బిజినెస్ చేశాడు. అప్పులు తీరిన తర్వాత కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న నాగప్రియాంకను వివాహం చేసుకోవడానికి సాప్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించాడు. ఆమె కూడా సాప్ట్‌వేర్‌ ఉద్యోగి కావడంతో ఇద్దరూ ఈ సంవత్సరం మే నెలలో హైదరాబాద్‌లో పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రాగా సర్దుకుపోతున్నారు. ఇటీవల ఓ వివాహ కార్యక్రమానికి హాజరు కావడానికి దెందులూరు వచ్చారు. వరలక్ష్మి వ్రతానికి నాగప్రియాంక ఆమె అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. అక్కడా వివాదం జరిగింది. ఈ విషయమై ఆమె ఏలూరు ఒకటో పట్టణ పోలీసులకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. దీనిపై తేజోమూర్తి బంధువులతో కలిసి పోలీసుస్టేషన్‌కు వెళ్లి విచారించారు.

Also Read: Viral Video: బస్సులో కునుకు తీస్తూ ఎలా పడిపోయాడో చూడండి..

ఆమె అతనితో ఉండటానికి ఇష్టపడటం లేదని, సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని సీఐ చెప్పడంతో నెల రోజుల సమయం ఇవ్వాలని వారు కోరారు. అందుకు సీఐ అంగీకరించలేదు. కేసు నమోదు చేయడం కూడా జరగదని, సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని సూచించారు. తన భార్యతో మాట్లాడే అవకాశం కల్పించాలని తేజోమూర్తి కోరినా అంగీకరించలేదు. ఈ క్రమంలో నాలుగైదుసార్లు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ఆదివారం రాత్రి స్టేషన్‌కు వెళ్లగా.. అమ్మాయి తరఫు వారు రూ.10 లక్షలు డిమాండు చేస్తున్నారని, మీరు రూ.8 లక్షల వరకు అయినా చూసుకోవాలని సీఐ సూచించారు. నెల రోజులు సమయం ఇవ్వాలని కోరగా అంగీకరించలేదు. అంత డబ్బు ఇవ్వలేక.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇలా చేయడంతో తేజోమూర్తి మనస్తాపానికి గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఇంటి నుంచి స్కూటీపై దెందులూరు రైల్వేస్టేషన్‌ సమీపం వరకు వెళ్లి అక్కడ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు సూసైడ్‌ నోట్ కూడా రాశాడు. అందులో ఎక్కడా సీఐ వేధించినట్లు లేదని పోలీసులు వెల్లడించారు. ఏలూరు రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • Crime News
  • Eluru
  • Software Employee Suicide
  • Techie Suicide Case

తాజావార్తలు

  • Holidays: మార్చి 20న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..

  • Pawan Kalyan – Balineni Meet: పవన్‌ కల్యాణ్‌తో బాలినేని కీలక భేటీ.. గంటకు పైగా చర్చలు..

  • CM Revanth Reddy: విధులకు గైర్హాజరైన ఉద్యోగులకు జీతం కట్ చేస్తాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

  • Bengaluru: టెక్ సిటీలో అమానుషం.. తండ్రిని సంచిలో పెట్టి కొరియర్‌కు యత్నం.. ఆ తర్వాత ఏమైందంటే..!

  • Story Board: డబ్బిస్తే.. ఏదైనా చేసుకోవచ్చా..? ఫామ్ హౌస్‌లో ఏం జరుగుతోంది..?

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions