Uttarpradesh: కారులో ఎయిర్బ్యాగ్లు లేవని.. ఆనంద మహీంద్రాతో పాటు మరో 12 మందిపై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో కారు భద్రతపై తప్పుడు హామీల కోసం ఆనంద్ మహీంద్రాతో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్కు చెందిన 12 మంది ఉద్యోగులపై చీటింగ్ కేసు నమోదైంది. ఎయిర్బ్యాగ్లు లేని స్కార్పియో కారును కంపెనీ తనకు విక్రయించిందని, తన కొడుకు కారు ప్రమాదంలో మరణించాడని ఫిర్యాదుదారు రాజేష్ మిశ్రా ఆరోపించారు. రాజేష్ మిశ్రా తన కుమారుడు అపూర్వ్కు బహుమతిగా 2020లో బ్లాక్ స్కార్పియోను రూ. 17.39 లక్షలకు కొనుగోలు చేశారు.
Also Read: Central Team in AP: స్థానిక సంస్థల నిధులు పక్కదారి పట్టించారని ఆరోపణలు.. విచారణకు కేంద్ర బృందం
Also Read
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
జనవరి 14, 2022న, స్నేహితులతో కలిసి లక్నో నుండి కాన్పూర్కు తిరిగి వస్తుండగా, పొగమంచు కారణంగా అపూర్వ్ కారు డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. ఫలితంగా అతను అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదం జరిగిన తర్వాత, జనవరి 29న రాజేష్ తాను కారు కొన్న ఆటో స్టోర్ వద్దకు చేరుకుని, కారులోని లోపాలను ఎత్తిచూపారు. ఎఫ్ఐఆర్లో ప్రమాదం సమయంలో సీటుబెల్ట్ బిగించినప్పటికీ, ఎయిర్బ్యాగ్ అమర్చడంలో విఫలమైందని ఫిర్యాదుదారు తెలిపారు. కంపెనీ తప్పుడు హామీలిచ్చి మోసం చేసిందని రాజేష్ మిశ్రా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: Asian Games 2023: టెన్నిస్లో భారత్కు నిరాశ.. తొలి రౌండ్లోనే ఔట్
వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఉంటే తన కొడుకు చనిపోయేవాడు కాదని రాజేష్ సంస్థ మోసపూరిత చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. కంపెనీ ఉద్యోగులు రాజేష్తో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. డైరెక్టర్ల సూచనల మేరకు నిర్వాహకులు తనను, తన కుటుంబాన్ని దుర్భాషలాడారని, చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. ప్రమాదం తర్వాత, స్కార్పియోను రుమాలోని మహీంద్రా కంపెనీ షోరూమ్కు తరలించారు. కంపెనీ వాహనంలో ఎయిర్బ్యాగ్లను ఏర్పాటు చేయలేదని రాజేష్ అభిప్రాయపడ్డారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 420 (మోసం), 287 (యంత్రాలకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం), 304-A (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం), మరిన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!