Car Price Hike Alert: కారు కొందామనుకుంటున్నారా? అయితే వెంటనే కొనండి.. ఆలస్యమైతే ఇక బాదుడే
- డిసెంబర్లో కార్లపై భారీగా ఆఫర్లు
- 2025లో కార్ల ధరలు పెరుగుతాయి
- పూర్తి వివరాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Car Price Hike Alert: 2024 ఏడాది ముగియబోతోంది. కొత్త సంవత్సరం 2025 రాబోతుంది. దింతో ప్రస్తుతం వివిధ ఆటో దిగ్గజ కంపెనీలు భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే, సంవత్సరం మారుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని ఆటో దిగ్గజ సంస్థలు వారి వాహనాల ధరలను అమాంతం పెంచేందుకు రెడీ అయిపోయాయి. ప్రస్తుతం డిసెంబర్ నెల కాబట్టి వివిధ కంపెనీలు భారీ ఆఫర్లతో ప్రజలను ఆకర్షిస్తున్నాయి. మరి ఏఏ కంపెనీలు వారి వాహన ధరలను ఏమాత్రం పెంచబోతున్నాయో ఒక లుక్ వేద్దాం..
Also Read: Toyota Camry: స్టైలిష్ లుక్, అబ్బురపరిచే ఫీచర్లతో మార్కెట్లో విడుదలైన టయోటా క్యామ్రీ
Also Read
- Bhojshala Case: "భోజ్శాల హిందువులదే".. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bhojshala case: "భోజ్శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
ఇందులో మొదటగా టాటా మోటార్స్ కార్లను తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం. ఎందుకంటే, టాటా మోటార్స్ తన వాహనాల ధరలను జనవరి 2025 నుండి అప్డేట్ చేయనున్నట్లు ప్రకటించింది. అంటే డిసెంబర్ 31 వరకు మాత్రమే మీరు ప్రస్తుత ధరకే కార్లను కొనుగోలు చేయగలుగుతారు. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వంటి అన్ని రకాల వాహనాలపై ఈ ధరల పెంపు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. నిరంతరం పెరుగుతున్న ఖర్చులు, ఖరీదైన లాజిస్టిక్స్ ఇంకా ద్రవ్యోల్బణం పరిస్థుతుల కారణంగా వాహనాల ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. అన్ని వాహనాల ఎక్స్-షోరూమ్ ధరను దాదాపు 3 శాతం పెంచనున్నట్లు కంపెనీ తన ప్రకటనలో తెలియచేసింది. అయితే, ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుందనేది మాత్రం కంపెనీ పూర్తిగా వెల్లడించలేదు. ఇది వివిధ మోడల్స్, వేరియంట్లపై ఆధారపడి ఉంటుంది.
Also Read: Bombay High Court: బిడ్డని తల్లి నుంచి దూరం చేయడం క్రూరత్వమే..
టాటా మోటార్స్తో పాటు, మారుతీ సుజుకీ, హ్యుందాయ్, కియా, ఎమ్జి మోటార్స్, మహీంద్రా కూడా జనవరి నుండి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. మారుతీ సుజుకీ తన కార్ల ధరలను 4% పెంచుతున్నట్లు ప్రకటించింది. హ్యుందాయ్ కార్ల ధరలను రూ.25,000 మేర పెంచనున్నట్లు సమాచారం. అలాగే, MG మోటార్ తన కార్ల ధరలను 3% మేర పెంచుతుందని తెలుస్తోంది. కియా ఇండియా 2% పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇక మరోవైపు, ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాటా మోటార్స్ అగ్రగామిగా దూసుకెళ్తుంది. కంపెనీ పోర్ట్ఫోలియోలో టియాగో EV, టిగోర్ EV, Nexon EV, పంచ్ EV, కర్వ్ EV వంటి అనేక ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. ఈ అన్ని కార్ల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. గత నెలలో టాటా మోటార్స్ కార్ల అమ్మకాలలో 2 శాతం స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. ఈ నెలలో కంపెనీ 47 వేలకు పైగా యూనిట్లను అమ్మింది.
తాజావార్తలు
-
Durandhar 2 Review: ఓటీటీలోకి ‘ధురంధర్: ద రివెంజ్’.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
-
Peddi : వేట షురూ.. ‘రాంబుజ్జి’గా దివ్యేందు సంచలన ఎంట్రీ!
-
Bhojshala Case: “భోజ్శాల హిందువులదే”.. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
-
Monsoon 2026: గుడ్న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
-
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!