Faiz-e-Ilahi Mosque: అర్ధరాత్రి బుల్డోజర్ చర్య.. ఫైజ్-ఎ-ఇలాహి మసీదు సమీపంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..
- అర్ధరాత్రి బుల్డోజర్ చర్య
- ఫైజ్-ఎ-ఇలాహి మసీదు సమీపంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
- పోలీసులపై రాళ్లదాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో అర్ధరాత్రి బుల్డోజర్ చర్యలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఫైజ్-ఎ-ఇలాహి మసీదు సమీపంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో స్థానికులు తిరగబడ్డారు. పోలీసులపై రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. తుర్క్మాన్ గేట్ వద్ద ఉన్న ఫైజ్-ఎ-ఇలాహి మసీదు చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడానికి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) బుధవారం ఉదయం బుల్డోజర్ ఆపరేషన్ నిర్వహించింది. ఆక్రమణను తొలగించడానికి ఆ స్థలంలో పదిహేడు బుల్డోజర్లను మోహరించారు. దీనికి వ్యతిరేకంగా స్థానికులు నిరసనకు దిగారు. పరిస్థితిని అదుపు చేయడానికి అదనపు పోలీసు బలగాలు సంఘటనా స్థలంలో మోహరించాయి. సంఘటనా స్థలంలో మోహరించిన పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి జనసమూహాన్ని చెదరగొట్టారు. చుట్టుపక్కల ప్రాంతానికి వెళ్లే రహదారులను పోలీసులు మూసివేశారు.
Also Read:గిన్నెలు కడిగేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.? అయితే మీకు జబ్బులు రావడం ఖాయం.!
Also Read
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు, జనవరి 7వ తేదీ తెల్లవారుజామున ఢిల్లీలోని రాంలీలా మైదాన్ సమీపంలోని తుర్క్మాన్ గేట్ వద్ద ఉన్న ఫైజ్-ఎ-ఇలాహి మసీదు చుట్టూ ఉన్న ఆక్రమణ ప్రాంతంలో ఢిల్లీ ఎంసీడీ కూల్చివేత పనులు చేపట్టిందని సెంట్రల్ రేంజ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మధుర్ వర్మ తెలిపారు. కూల్చివేత సమయంలో, కొంతమంది దుండగులు రాళ్లు రువ్వారని తెలిపారు. మసీదుకు ఆనుకుని ఉన్న డిస్పెన్సరీ, వివాహ మందిరాన్ని అక్రమ నిర్మాణాలుగా ప్రకటించినట్లు MCD అధికారులు తెలిపారు. రాంలీలా మైదాన్ ప్రాంతంలో సర్వే నిర్వహించిన తర్వాత ఈ నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆక్రమణలను తొలగించడానికి నివాసితులకు అధికార యంత్రాంగం ఇప్పటికే సమయం ఇచ్చిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్నాయని పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: మోహన్లాల్ను తాతగా మార్చిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
-
NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
-
NP50 : నివిన్ పౌలి 50 ‘విజయం’.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
-
ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
-
Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..