Faiz-e-Ilahi Mosque: అర్ధరాత్రి బుల్డోజర్ చర్య.. ఫైజ్-ఎ-ఇలాహి మసీదు సమీపంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..
- అర్ధరాత్రి బుల్డోజర్ చర్య
- ఫైజ్-ఎ-ఇలాహి మసీదు సమీపంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
- పోలీసులపై రాళ్లదాడి
ఢిల్లీలో అర్ధరాత్రి బుల్డోజర్ చర్యలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఫైజ్-ఎ-ఇలాహి మసీదు సమీపంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో స్థానికులు తిరగబడ్డారు. పోలీసులపై రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. తుర్క్మాన్ గేట్ వద్ద ఉన్న ఫైజ్-ఎ-ఇలాహి మసీదు చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడానికి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) బుధవారం ఉదయం బుల్డోజర్ ఆపరేషన్ నిర్వహించింది. ఆక్రమణను తొలగించడానికి ఆ స్థలంలో పదిహేడు బుల్డోజర్లను మోహరించారు. దీనికి వ్యతిరేకంగా స్థానికులు నిరసనకు దిగారు. పరిస్థితిని అదుపు చేయడానికి అదనపు పోలీసు బలగాలు సంఘటనా స్థలంలో మోహరించాయి. సంఘటనా స్థలంలో మోహరించిన పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి జనసమూహాన్ని చెదరగొట్టారు. చుట్టుపక్కల ప్రాంతానికి వెళ్లే రహదారులను పోలీసులు మూసివేశారు.
Also Read:గిన్నెలు కడిగేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.? అయితే మీకు జబ్బులు రావడం ఖాయం.!
Also Read
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు, జనవరి 7వ తేదీ తెల్లవారుజామున ఢిల్లీలోని రాంలీలా మైదాన్ సమీపంలోని తుర్క్మాన్ గేట్ వద్ద ఉన్న ఫైజ్-ఎ-ఇలాహి మసీదు చుట్టూ ఉన్న ఆక్రమణ ప్రాంతంలో ఢిల్లీ ఎంసీడీ కూల్చివేత పనులు చేపట్టిందని సెంట్రల్ రేంజ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మధుర్ వర్మ తెలిపారు. కూల్చివేత సమయంలో, కొంతమంది దుండగులు రాళ్లు రువ్వారని తెలిపారు. మసీదుకు ఆనుకుని ఉన్న డిస్పెన్సరీ, వివాహ మందిరాన్ని అక్రమ నిర్మాణాలుగా ప్రకటించినట్లు MCD అధికారులు తెలిపారు. రాంలీలా మైదాన్ ప్రాంతంలో సర్వే నిర్వహించిన తర్వాత ఈ నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆక్రమణలను తొలగించడానికి నివాసితులకు అధికార యంత్రాంగం ఇప్పటికే సమయం ఇచ్చిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్నాయని పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!