పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అఖీరా నందన్ గోప్యత హక్కుల ఉల్లంఘనపై, ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏఐ, డీప్ ఫేక్ టెక్నాలజీతో తన ఇమేజ్ డ్యామేజ్ అయిందని హైకోర్టును ఆశ్రయించాడు పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా నందన్. ఏఐలో తన లవ్ స్టోరీ పేరుతో రూపొందించిన చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో, ఆ లవ్ స్టోరీ సినిమాపై తాత్కాలిక నిషేధం విధించింది కోర్టు. Also Read:TharunBhascker – EeshaRebba: త్వరలోనే…
ఢిల్లీలో అర్ధరాత్రి బుల్డోజర్ చర్యలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఫైజ్-ఎ-ఇలాహి మసీదు సమీపంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో స్థానికులు తిరగబడ్డారు. పోలీసులపై రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. తుర్క్మాన్ గేట్ వద్ద ఉన్న ఫైజ్-ఎ-ఇలాహి మసీదు చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడానికి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) బుధవారం ఉదయం బుల్డోజర్ ఆపరేషన్ నిర్వహించింది. ఆక్రమణను తొలగించడానికి ఆ స్థలంలో పదిహేడు బుల్డోజర్లను మోహరించారు. దీనికి వ్యతిరేకంగా స్థానికులు…
2017 ఉన్నావ్ అత్యాచారం కేసులో నిందితుడు కుల్దీప్ సెంగర్కు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. కుల్దీప్ సెంగర్ జీవిత ఖైదును నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల వెకేషన్ బెంచ్ సోమవారం విచారించింది.