Buggana Rajendranath : ఎప్పుడూ కనిపించని గంటా కూడా అప్పులపై స్టేట్ మెంట్లు ఇస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంత మంది రాజకీయ నాయకులు, సొంతంగా ప్రకటించుకున్న ఆర్ధిక నిపుణులు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పై ప్రకటనలు చేస్తున్నారని, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి చాలా స్పష్టంగా రాష్ట్ర అప్పుల గురించి వివరించారన్నారు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్. దీంతో టీడీపీ, వాళ్ళ మీడియా బాధ మామూలుగా లేదని, ఎప్పుడూ కనిపించని గంటా కూడా అప్పుల పై స్టేట్ మెంట్లు ఇస్తున్నారన్నారు. గతంలో ఎప్పుడూ అప్పులపై రాష్ట్రానికి కేంద్రం సహకరించ కూడదని వీళ్ళంతా కుట్రలు చేశారన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి దేశాన్ని ఉద్దేశించి మాట్లాడితే దాన్ని నమ్మరని, కొత్తగా వచ్చిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు మాట్లాడితే ఫుల్ గా కవరేజ్ ఇస్తారంటూ ఆయన మండిపడ్డారు. ఆర్బీఐ చెప్పినా నమ్మం అంటారని, స్వయం ప్రకటిత మేధావులు చెబితే అదే కరెక్ట్ అంటారన్నారు. దేశంలో నిబంధనలు ఉండవా?? మన రాష్ట్రానికి ప్రత్యేకంగా రూల్స్ ఉంటాయా? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Devineni Avinash : చంద్రబాబుకు సురక్ష లాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన రాలేదు
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
అంతేకాకుండా.. ‘నిబంధనలకు లోబడే రుణాలు చేస్తున్నాం. ఇలా మాట్లాడుతున్న అందరి కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్. వీళ్ళెవరూ రాష్ట్రంలో నివాసం ఉండరు. ప్రతిపక్ష నాయకుడు నేను సింహాన్ని, కొదమ సింహాన్ని అంటున్నారు. అతని పుత్ర రత్నం కూడా మేం సింహాలం అంటున్నాడు. వీళ్ళు తమను తాము జంతువులతో ఎందుకు పోల్చుకుంటున్నారో అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. 2019లో చంద్రబాబు అధికారం దిగే నాటికి ఉన్న రాష్ట్ర అప్పు 2 లక్షల 64 వేల కోట్లు. 2023 లో అప్పు 4 లక్షల 42 వేల కోట్లు. అంటే మా ప్రభుత్వం నాలుగేళ్లల్లో చేసిన అప్పు లక్షా 77 వేల కోట్లు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం 20 వేల కోట్లు అప్పు చేసింది.
Also Read : Free Fire Love Story: పబ్జీ ప్రేమ తరహాలోనే ఫ్రీ ఫైర్ గేమ్ లవ్ స్టోరీ.. ఇంటి నుంచి జంప్
2019 ఏప్రిల్ నెలలోనే 5 వేల కోట్లు అప్పు చేసి పసుపు, కుంకుమకు వాడిన విషయం వాస్తవమా? కాదా?. కార్పొరేషన్ ద్వారా మా ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 10 వేల 200 కోట్లు. గత ప్రభుత్వ హయాంలో అప్పుల సగటు వృద్ధి రేటు 14.4 శాతం. మా నాలుగేళ్ళల్లో అప్పుల సగటు వృద్ధి రేటు 12.4 శాతం. గత ప్రభుత్వం పరిమితికి మించి 16 వేల కోట్లు అప్పు చేసింది. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ లోటు 2.4 శాతం. అప్పుడు జాతీయ సగటు 2.5 శాతం. మా ప్రభుత్వంలో రెవెన్యూ లోటు 2.7 శాతం. ఇప్పుడు జాతీయ సగటు 4.8 శాతం రెవెన్యూ లోటు ఉంది. జాతీయ సగటులో సగం మాత్రమే రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఉంది.’ అని మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!