Floods: ఒక్క చెన్నై మాత్రమే కాదు.. శతాబ్దం చివరి నాటికి వరద ప్రమాదంలో 12 నగరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Floods: మైచాంగ్ తుఫాను కారణంగా చెన్నై నగరం అతలాకుతలం అవుతోంది. చెన్నై మొత్తం నదిలా మారిపోయింది. రోడ్లు, కాలనీలు నీటిలో మునిగిపోయాయి. గత కొన్నేళ్లుగా తుఫానులు వస్తున్నాయంటే చాలు చెన్నై వణికిపోతోంది. డిసెంబర్ 4, 2023 నాటికి 48 గంటల్లోనే 40 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాత నమోదు కావడం నగరాన్ని ముంచెత్తింది. గతంలో కూడా పలు తుఫాన్ల సమయంలో చెన్నై ఇలాగే వరద గుప్పిట చిక్కుకుంది.
ఒక్క చెన్నై మాత్రమే కాదు భారతదేశంలోని 12 నగరాలు ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోబోతున్నాయి. 2015లో ఈశాన్య రుతుపవనాల కాలంలో భారీ వర్షాల కారణంగా చెన్నై నగరం మునిగిపోవడం ఇంకా గుర్తుండే ఉంటుంది. భారీ వర్షపాతం, డ్రైనేజీలు సరిగా లేకపోవడం చెరువులు, నదీ మార్గాలు కబ్జాకు గురికావడం సమస్య తీవ్రతను మరింత పెంచుతోంది.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ఇదిలా ఉంటే వాతావరణ పరిణామాల్లో మార్పు, కాలుష్యం పెరగడం వల్ల మంచు ఫలకలు కరిగిపోవడం మొదలైంది. ఇది ఇలాగే కొనసాగితే సముద్ర నీటిమట్టాలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలు, పట్టణాలు తడిచిపెట్టుకుపోవడం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు కోల్కతా, ముంబై నగరాలు ఈ ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయి.
వరల్డ్ బ్యాంక్ గ్రూప్కి సంబంధించిన పోట్స్డ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ అండ్ క్లైమేట్ అనలిటిక్స్ పరిశోధన ప్రకారం.. ఇండియా భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నందున, ఇతర ప్రాంతాల కన్నా ఈ ప్రాంతంలో సముద్ర మట్టం పెరుగుతుందని హెచ్చరించింది. సముద్రం నీరు రావడం మూలంగా వ్యవసాయం, భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఇది వ్యాధుల పెరుగుదలకు దారి తీయొచ్చని హెచ్చరించింది.
Read Also: Renu Desai: నేను ప్రేమలో పడ్డాను.. పవన్ మాజీ భార్య పోస్ట్ వైరల్
శతాబ్ధ చివరి నాటికి ప్రమాదంలో 12 నగరాలు:
2021 ఇంటర్గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) నివేదికలో భారతదేశానిక భయంకరమైన హెచ్చరికలు జారీ చేసింది. ఈ శతాబ్ధం చివరి నాటికి భారతదేశంలోని 12 తీరప్రాంత నగరాలను వరదలు, సముద్రమట్టాలు ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ముంబై, చెన్నై, కొచ్చి మరియు విశాఖపట్నం సహా డజన్ భారతీయ నగరాలు ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.
ఇప్పటికే తీరప్రాంతాల్లో సముద్రకోత పెరుగుతోంది. మత్స్యకార కుటుంబాలు ఆ ప్రభావాన్ని అనుభవిస్తున్నాయి. 2050 నాటికి దాదాపుగా 1500 చదరపు కి.మీ భూభాగం కోల్పోయే అవకాశం ఉందని అంచనా. ఇది తీరప్రాంత ప్రజల ఉనికికే ముప్పుగా మారబోతోంది. మరోవైపు ఢిల్లీ, హిమాలయ రాష్ట్రాల్లో కూడా వరద ముప్పు ప్రమాదం ఉంది. బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో రుతుపవనాల ప్రేరేపిత వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో యమునా నదీ వరదలే ఇందుకు మంచి ఉదాహరణగా ఉంది. జూలై నెలలో యమునా నదిలో 208.48 మీటర్ల ఎత్తుకు నీరు చేరుకుంది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!