Kishan Reddy: కాంగ్రెస్ డబుల్ హ్యాట్రిక్ జీరో సాధించింది..
- ఢిల్లీలో బీజేపీ విజయంపై స్పందించిన కిషన్ రెడ్డి
- అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు, ఆప్కు ఢిల్లీ ప్రజలు పట్టం కడుతూ వచ్చారు..
- 27 ఏళ్ల తర్వాత బీజేపీని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు- కిషన్ రెడ్డి
- మోడీ సుపరిపాలనకు ప్రజలు ఆశీస్సులు అందించారు- కిషన్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని అందుకుంది. 70 స్థానాలున్న ఢిల్లీలో.. బీజేపీ 47 స్థానాల్లో విజయాన్ని అందుకుంది. ఆప్ 23 స్థానాలకే పరిమితం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అయితే ఖాతా కూడా తెరవలేదు. ఢిల్లీలో బీజేపీ విజయంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు, ఆప్కు ఢిల్లీ ప్రజలు పట్టం కడుతూ వచ్చారు.. 27 ఏళ్ల తర్వాత బీజేపీని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారని తెలిపారు. మోడీ సుపరిపాలనకు ప్రజలు ఆశీస్సులు అందించారు.. ఢిల్లీకి పట్టిన కేజ్రీవాల్ గ్రహణం.. దేశ రాజధానికి పట్టిన పీడ విరగడైందని ఆరోపించారు.
Read Also: Bengaluru Metro: ప్రయాణికులపై మెట్రో బాదుడు.. భారీగా పెరిగిన ఛార్జీలు
Also Read
- Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
ఢిల్లీలో నీతివంతమైన, అభివృద్ది పాలన బీజేపీ అందించబోతుందని కిషన్ రెడ్డి తెలిపారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్గా కేజ్రీవాల్ మారిపోయారని దుయ్యబట్టారు. అహంకారం నెత్తికిక్కితే ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో, ప్రజలు సహించరు అని మరోసారి తేలిపోయిందన్నారు. ప్రజలు డిసైడ్ అయితే కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, కేసీఆర్ ఎవరు ఆపలేరని అన్నారు. కాంగ్రెస్ డబుల్ హ్యాట్రిక్ జీరో సాధించిందని విమర్శించారు. వరుసగా మూడుసార్లు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి జీరో సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. ఆ పార్టీకి మోడీని ఓడించాలని దివాలాకోరు ఆలోచన తప్పా.. ప్రజల కోసం ఆలోచించదని దుయ్యబట్టారు.
Read Also: Telangana: కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియకు బ్రేక్..
రాజ్యాంగం బుక్ను చేతిలో పట్టుకుంటే ఓట్లు వేయరు.. రాజ్యాంగ విలువలను పాటిస్తే ఓట్లు పడతాయి అని రుజువు అయిందని కిషన్ రెడ్డి అన్నారు. లిక్కర్ కుంభకోణంపై ఢిల్లీ ప్రజలు తీర్పు ఇచ్చారు.. దోపిడి జరిగిందని ఢిల్లీ ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. లిక్కర్ స్కాంలో కోర్ట్ తీర్పు రావాల్సి ఉంది.. న్యాయస్థానం తీర్పు ఇస్తుందని దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఉత్తుత్తి హామీలు, ఉచితాలు అవసరం లేదని ఢిల్లీ ప్రజలు తీర్పు ఇచ్చారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
-
Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
-
Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..