Kishan Reddy: కాంగ్రెస్ డబుల్ హ్యాట్రిక్ జీరో సాధించింది..
- ఢిల్లీలో బీజేపీ విజయంపై స్పందించిన కిషన్ రెడ్డి
- అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు, ఆప్కు ఢిల్లీ ప్రజలు పట్టం కడుతూ వచ్చారు..
- 27 ఏళ్ల తర్వాత బీజేపీని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు- కిషన్ రెడ్డి
- మోడీ సుపరిపాలనకు ప్రజలు ఆశీస్సులు అందించారు- కిషన్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని అందుకుంది. 70 స్థానాలున్న ఢిల్లీలో.. బీజేపీ 47 స్థానాల్లో విజయాన్ని అందుకుంది. ఆప్ 23 స్థానాలకే పరిమితం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అయితే ఖాతా కూడా తెరవలేదు. ఢిల్లీలో బీజేపీ విజయంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు, ఆప్కు ఢిల్లీ ప్రజలు పట్టం కడుతూ వచ్చారు.. 27 ఏళ్ల తర్వాత బీజేపీని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారని తెలిపారు. మోడీ సుపరిపాలనకు ప్రజలు ఆశీస్సులు అందించారు.. ఢిల్లీకి పట్టిన కేజ్రీవాల్ గ్రహణం.. దేశ రాజధానికి పట్టిన పీడ విరగడైందని ఆరోపించారు.
Read Also: Bengaluru Metro: ప్రయాణికులపై మెట్రో బాదుడు.. భారీగా పెరిగిన ఛార్జీలు
Also Read
- Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
ఢిల్లీలో నీతివంతమైన, అభివృద్ది పాలన బీజేపీ అందించబోతుందని కిషన్ రెడ్డి తెలిపారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్గా కేజ్రీవాల్ మారిపోయారని దుయ్యబట్టారు. అహంకారం నెత్తికిక్కితే ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో, ప్రజలు సహించరు అని మరోసారి తేలిపోయిందన్నారు. ప్రజలు డిసైడ్ అయితే కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, కేసీఆర్ ఎవరు ఆపలేరని అన్నారు. కాంగ్రెస్ డబుల్ హ్యాట్రిక్ జీరో సాధించిందని విమర్శించారు. వరుసగా మూడుసార్లు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి జీరో సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. ఆ పార్టీకి మోడీని ఓడించాలని దివాలాకోరు ఆలోచన తప్పా.. ప్రజల కోసం ఆలోచించదని దుయ్యబట్టారు.
Read Also: Telangana: కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియకు బ్రేక్..
రాజ్యాంగం బుక్ను చేతిలో పట్టుకుంటే ఓట్లు వేయరు.. రాజ్యాంగ విలువలను పాటిస్తే ఓట్లు పడతాయి అని రుజువు అయిందని కిషన్ రెడ్డి అన్నారు. లిక్కర్ కుంభకోణంపై ఢిల్లీ ప్రజలు తీర్పు ఇచ్చారు.. దోపిడి జరిగిందని ఢిల్లీ ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. లిక్కర్ స్కాంలో కోర్ట్ తీర్పు రావాల్సి ఉంది.. న్యాయస్థానం తీర్పు ఇస్తుందని దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఉత్తుత్తి హామీలు, ఉచితాలు అవసరం లేదని ఢిల్లీ ప్రజలు తీర్పు ఇచ్చారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
-
Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!