BC Reservations: బీసీ రిజర్వేషన్ల పై BRS గరం.. గరం..
- బీసీ రిజర్వేషన్ల అంశంలో రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు
- కాంగ్రెస్ విశ్వాసఘాతం చేస్తోంది
- జీవో లేకుండానే కోర్టు కేసులు కాంగ్రెస్ కుట్ర.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BC Reservations: తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్మీట్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీ రిజర్వేషన్ల విషయంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ విశ్వాస ఘాతుకానికి పాల్పడుతోందని వారు ఆరోపించారు.
విద్యార్థులకు, ప్రొఫెషనల్స్కు బెస్ట్ ఆప్షన్గా కొత్తగా Samsung Galaxy Tab A11.. ధర ఎంతంటే?
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
ఈ సమావేశంలో మధుసూదనాచారి మాట్లాడుతూ.. బీసీలకు ఉన్న 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ, వాటిని ప్రభుత్వం నీరుగారుస్తోందని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కుల గణన జరగలేదని, బీసీ బిల్లు గురించి మాట్లాడడానికి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినా దీనిపై మాట్లాడలేదని ఆయన విమర్శించారు. ఒకవేళ తమ మనసు గాయపడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
AP High Court: వైఎస్ జగన్ పిటిషన్పై విచారణ.. నోటీసులు జారీ చేసిన హైకోర్టు
అలాగే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం జీవో ఇవ్వకముందే కొందరు కోర్టుకు వెళ్ళడంపై ప్రశ్నించారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదని, రాష్ట్రంలో బీసీలకు మంత్రి పదవులు కూడా కేటాయించలేదని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందని, కేవలం కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ బీసీల తరపున పోరాడుతుందని స్పష్టం చేశారు. అలాగే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. 42% జీవో ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతూ, గత 22 నెలల్లో ఆ జీవో ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. జీవో ఇవ్వకుండానే కొందరు కోర్టుకు వెళ్ళడం కాంగ్రెస్ కుట్ర అని ఆరోపించారు. అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం “బీసీ రిజర్వేషన్లు అనే పులిపై స్వారీ చేస్తోందని” తాము ముందే చెప్పామని, మాట తప్పితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!