KTR: జలాశయాల్లో నీరు నింపకపోతే మేమే పంపులు ఆన్ చేస్తాం..
- కన్నెపల్లి పంప్హౌస్ను పరిశీలించి మాట్లాడిన కేటీఆర్
- జలాశయాల్లో నీరు నింపకపోతే మేమే పంపులు ఆన్ చేస్తామని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: ఆగస్టు 2 లోపు కాళేశ్వరం నుంచి పంపింగ్ స్టార్ట్ చేయకపోతే రైతులతో కలిసి మేమే పంపులు ఆన్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆయన పార్టీ నేతలతో కన్నెపల్లి పంప్హౌస్ను పరిశీలించి మాట్లాడారు. తెలంగాణలో కరువు అనే మాట వినపడకూడదనే ఉద్దేశతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆయన వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు లాంటిదని, కానీ ప్రస్తుతం పంటల సాగు కోసం నీరు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. గతంలో నీటి సమస్య ఉందని రాష్ట్ర సర్కారు అసత్య ప్రచారం చేస్తోందన్నారు.
Read Also: Deputy CM Bhatti Vikramarka: ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎల్ఆర్ఎస్.. డిప్యూటీ సీఎం ఆదేశాలు
Also Read
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
బీజేపీ ఆఫీస్లో తయారైన రిపోర్టుని ఎన్డీఎస్ఏ ఇచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. పోలవరం కొట్టుకుపోతే ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పది లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నా మేడిగడ్డ చెక్కుచెదరకుండా ఉందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి అబద్దాలు ప్రచారం చేసి కేసీఆర్ని గద్దె దింపారని అన్నారు. ఇక రాజకీయాలు మానండి… ప్రజల కోసం పని చేయండని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మేడిగడ్డ కుంగడంపై మాకు ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులు ఏదైనా చేసే ఘనులు, సిద్ధహస్తులు అంటూ ఆరోపించారు. ఇప్పుడు మేము వచ్చి మేడిగడ్డ బానే ఉంది అంటున్నామని భవిష్యత్లో ఏదైనా చేయొచ్చని ఆరోపణు చేశారు. ఇప్పటి బ్యారేజ్ పరిస్థితిని చూడండి… భవిష్యత్లో ఏదైనా జరిగితే మేము చెప్పింది ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్ సూచించారు.
తాజావార్తలు
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!