KTR: జలాశయాల్లో నీరు నింపకపోతే మేమే పంపులు ఆన్ చేస్తాం..
- కన్నెపల్లి పంప్హౌస్ను పరిశీలించి మాట్లాడిన కేటీఆర్
- జలాశయాల్లో నీరు నింపకపోతే మేమే పంపులు ఆన్ చేస్తామని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: ఆగస్టు 2 లోపు కాళేశ్వరం నుంచి పంపింగ్ స్టార్ట్ చేయకపోతే రైతులతో కలిసి మేమే పంపులు ఆన్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆయన పార్టీ నేతలతో కన్నెపల్లి పంప్హౌస్ను పరిశీలించి మాట్లాడారు. తెలంగాణలో కరువు అనే మాట వినపడకూడదనే ఉద్దేశతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆయన వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు లాంటిదని, కానీ ప్రస్తుతం పంటల సాగు కోసం నీరు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. గతంలో నీటి సమస్య ఉందని రాష్ట్ర సర్కారు అసత్య ప్రచారం చేస్తోందన్నారు.
Read Also: Deputy CM Bhatti Vikramarka: ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎల్ఆర్ఎస్.. డిప్యూటీ సీఎం ఆదేశాలు
Also Read
బీజేపీ ఆఫీస్లో తయారైన రిపోర్టుని ఎన్డీఎస్ఏ ఇచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. పోలవరం కొట్టుకుపోతే ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పది లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నా మేడిగడ్డ చెక్కుచెదరకుండా ఉందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి అబద్దాలు ప్రచారం చేసి కేసీఆర్ని గద్దె దింపారని అన్నారు. ఇక రాజకీయాలు మానండి… ప్రజల కోసం పని చేయండని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మేడిగడ్డ కుంగడంపై మాకు ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులు ఏదైనా చేసే ఘనులు, సిద్ధహస్తులు అంటూ ఆరోపించారు. ఇప్పుడు మేము వచ్చి మేడిగడ్డ బానే ఉంది అంటున్నామని భవిష్యత్లో ఏదైనా చేయొచ్చని ఆరోపణు చేశారు. ఇప్పటి బ్యారేజ్ పరిస్థితిని చూడండి… భవిష్యత్లో ఏదైనా జరిగితే మేము చెప్పింది ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్ సూచించారు.
తాజావార్తలు
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
-
Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
-
Konda Surkha : సీఎం రేవంత్కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!