NVSS Prabhakar : బీఆర్ఎస్ ఇప్పుడు నీతి గురించి మాట్లాడడం విడ్డూరం
- నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడంపై హర్షం
- బీఆర్ఎస్ అవినీతి బయటపడాలని డిమాండ్
- కవిత ఎవరికి నీతి పాఠాలు చెబుతోంది: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NVSS Prabhakar : నీతి ఆయోగ్ 10వ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనడాన్ని స్వాగతిస్తున్నట్లు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. అయితే 9వ సమావేశానికి హాజరుకాలేదని గుర్తుచేస్తూ, “అప్పుడు ముఖ్యమంత్రి ఎవరినిమిత్తం, ఎందుకోసం గైర్హాజరయ్యారు?” అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు.
నీతి ఆయోగ్ సమావేశాల ఉద్దేశం రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న దానిపై కేంద్రం నమ్మకం పెట్టుకున్నదని ఆయన అన్నారు. “రెవంత్ రెడ్డి ఫెడరల్ స్పూర్తితో సమావేశంలో పాల్గొనడం సానుకూల పరిణామం. కానీ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదు. కనీసం ఇప్పుడు అయినా వాటిని అమలు చేయాలని అధికార యంత్రాంగానికి సీఎం ఆదేశాలు ఇవ్వాలి,” అని సూచించారు.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
Rajya Sabha Polls: జూన్ 19న రాజ్యసభ ఎన్నికలు.. పెరగనున్న ఇండియా కూటమి బలం
ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. “పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచిన బీఆర్ఎస్ ఇప్పుడు నీతి గురించి మాట్లాడడం విడ్డూరం. లిక్కర్ కేసులో జైలు నుంచి వచ్చి కవిత ఎవరికి నీతి పాఠాలు చెబుతోంది?” అంటూ ప్రశ్నించారు.
కుంభకోణాలకు సంబంధించి కేసీఆర్, కేటీఆర్లకు నోటీసులు వచ్చాయని, ఇవి రాజకీయ నోటీసులు కాకుండా అవినీతి ఆరోపణలపై విచారణ నోటీసులేనని స్పష్టం చేశారు. “కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఎమ్మెల్యేగా విఫలమయ్యారు. కేటీఆర్ ఇప్పటికే అనేక విచారణలకు లోనవుతున్నారు. ఇదే సమయంలో హరీష్ రావు, కవిత వంటి నేతలు కూడా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ నేతలు తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలి,” అన్నారు.
ఈటల రాజేందర్కు వచ్చిన నోటీసులపై పార్టీ స్థాయిలో చర్చించి తదుపరి కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. “ఈటలపై విచారణ జరుగుతుంది. ఈ విచారణలో బీఆర్ఎస్ నేతల అవినీతి ఆరోపణలు బట్టబయలవుతాయని మేము ఆశిస్తున్నాం,” అని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. “లేఖ బయటకు వచ్చిందన్నదే కాదు.. డీల్ బయటపడినందుకే వాళ్లకు భయం,” అంటూ బీఆర్ఎస్ నేతలను మరోసారి విమర్శించారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!