Free Women Travel Bus In Andra pradesh: ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలకు గుడ్ న్యూస్ తెలిపింది. ఎన్నికల ముందు ప్రకటించిన మహిళల ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తీసుకురాబోతోంది. తాజాగా ఎన్నికల ముందు ప్రకటించిన మహిళల ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తీసుక వచ్చేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఆగస్టు 15 నుండి ఆంధ్రప్రదేశ్ లోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పథకం మొదలు కాబోతున్నట్లు రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
Telangana Govt: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
ఇక ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలుపరిచే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం పానములను మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పెన్షన్ల పెంపు, ఉచిత ఇసుక విధానం, అలాగే తల్లికి వందనం లాంటి హామీలను మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. ఇక ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తీసుకురాబోతోంది. ఈ విషయం సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అధికారులు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఈ పథకం అమలు అవుతున్న పథకంపై నివేదికలను కోరినట్లు సమాచారం. ఆయా రాష్ట్రాలలో రోజుకు ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారో.. అలాగే ఈ పథకం పట్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందన్న విషయాలను పూర్తిస్థాయిలో అధికారులు నివేదికలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Selfie Video: నవ దంపతులు ఆత్మహత్య.. ఎస్సై కి సెల్ఫీ వీడియో..!
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..#AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani pic.twitter.com/zJNh0C61aN
— Satya Prasad Anagani (@SatyaAnagani) July 16, 2024