Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయనగరంలో జరిగిన వైఎస్సార్సీపీ సమావేశంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, పార్టీ మారేవారి గురించి కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పార్టీ నుంచి ఒకరు వెళితే, వంద మంది కొత్త నాయకులు వస్తారని ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన పార్టీ వీడిన నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎవరైతే ఆర్థిక లావాదేవీలు జరిపి, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి దోపిడీకి అలవాటు పడతారో, అలాంటి దోపిడీదారులే పార్టీని వీడి వెళ్లారని మండిపడ్డారు. పార్టీలో నిజాయితీగా ఉండే గౌరవప్రదమైన వ్యక్తులు ఎవరూ వెళ్లిపోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి నేతల తీరు చూస్తుంటే ప్రజలకు, నాయకులకు బీపీ పెరిగిపోతుందని ఎద్దేవా చేశారు. కూటమి నాయకుల తీరు అచ్చం ‘అలీబాబా 40 దొంగల’ కథలా ఉందని, వారంతా ఒక్కటై రాష్ట్రంలో దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
రాబోయే కాలంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తి దృష్టి పెట్టాలని బొత్స సత్యనారాయణ పార్టీ కేడర్కు పిలుపునిచ్చారు. వార్డు సభ్యుల నుంచి మొదలుకొని ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాల వరకు ప్రతి ఒక్కరూ పట్టుదలతో గెలవాలని సూచించారు. కార్యకర్తలు ఎవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దన్నారు. ప్రతి వైఎస్సార్సీపీ నాయకుడు, కార్యకర్త కష్టపడి పనిచేసి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!