BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- ఇండోర్ కాంగ్రెస్ ‘ఛాత్రోంకీ గుంజ్’ కార్యక్రమంలో ప్రధాని మోడీపై స్కిట్..
- మోడీని అనుకరిస్తూ స్కిట్ చేసిన కమెడియన్ పుల్కిత్ మణి..
- కాంగ్రెస్ కమెడియన్, జోకర్ల పార్టీగా మారిందని బీజేపీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ఇండోర్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన ‘‘ఛాత్రోంకీ గుంజ్’’ కార్యక్రమం వివాదాస్పదమైంది. ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణి చేసిన స్కిట్పై బీజేపీ తీవ్రంగా స్పందించింది. పుల్కిత్ మణి ప్రధాని మోడీ హావభావాలను అనుకరిస్తూ కామెడీ చేశాడు. ఆ సమయంలో వేదికపై రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.
బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ దీనిపై తీవ్రంగా స్పందిస్తూ.. ఇలాంటి ప్రదర్శన ‘అసభ్య ప్రవర్తన, చౌకబారు, అసభ్య ట్రోల్స్’గా అభివర్ణించారు. మర్యాద, బాధ్యతగా ఆలోచించే వ్యక్తి ఇలాంటి చర్యల్ని వినోదంగా భావించరని వ్యాఖ్యానించారు. ఇలాంటి పొలిటికల్ కల్చర్ కారణంగా యువతలో రాహుల్ గాంధీకి తగిన స్పందన లభించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల్లో ఏబీవీపీ విజయం, కాంగ్రెస్ మద్దతు ఉన్న ఎన్ఎస్యూఐ ఓటమిని ప్రస్తావించారు. ఇలాంటి ప్రదర్శనలకు మద్దతు ఇవ్వడం ద్వారా రాజకీయ నాయకుడిగా తనను తాను సీరియస్గా తీసుకునే పరిస్థితిని రాహుల్ గాంధీ దిగజార్చుకుంటున్నారని అన్నారు. ఓ వృద్ధ మహిళను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కేశవన్ అభ్యంతరం తెలిపారు. దీనిని మహిళల్ని అవమానించడంగా అభివర్ణించారు.
Also Read
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘కాంగ్రెస్ ‘కామెడియన్లు, జోకర్ల పార్టీగా మారింది’’ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ అంశంపై స్పందిస్తూ.. ఈ స్కిట్ ద్వారా ప్రధాని మోడీ దివంగత తల్లిని రాహుల్ అవమానించారని మండిపడ్డారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా రాహుల్ తీరును విమర్శించారు.
తాజావార్తలు
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!