Botsa Satyanarayana: స్కిల్ స్కాంలో అధికారుల పాత్ర ఉంటే చర్యలు తప్పవు.. స్పష్టం చేసిన మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: స్కిల్ స్కాంలో అధికారుల పాత్ర ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. మాకేం ప్రేమ్ చంద్రారెడ్డి మీద ప్రత్యేక ప్రేమ లేదన్నారు.. కానీ, అధికారులు అభ్యంతరం చెప్పాక.. ఫైల్ సీఎం దగ్గరకు వెళ్తుంది.. దానికి సీఎందే బాధ్యత అవుతుందన్నారు.. రిమాండ్ కొనసాగింపు సందర్భంగా తానేం తప్పు చేయలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.. అందుకే ప్రజా జీవితంలో ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవినీతి చేయకుండా పరిపాలన సాగించాలన్న ఆయన.. ఇన్నాళ్లూ తప్పులు చేసినా దొరకలేదు.. దొరికితే దొంగ.. దొరకకపోతే దొర అన్నట్టు చంద్రబాబు ఇన్నాళ్లూ వ్యవహరించారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇచ్చాక.. సీమెన్స్ కంపెనీ తన వాటా ఎందుకివ్వలేదు.? మధ్యలో డిజైన్ టెక్ ఎలా వచ్చింది..? అని ప్రశ్నించారు.
Read Also: VC. Sajjanar: గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి టీఎస్ ఆర్టీసీ గుడ్న్యూస్
Also Read
- TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
- 18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
- Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
- Lingamneni Ramesh Son: ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్పై కేసు.. నేడు పోలీసుల విచారణకు హాజరు!
చంద్రబాబు తెలిసే తప్పు చేశారు అని విమర్శించారు మంత్రి బొత్స.. సీమెన్స్ కంపెనీ మంచి కంపెనీనే.. కానీ, ఒప్పందం ప్రకారం జరగలేదన్నారు. సాఫ్ట్ వేర్ రూ. 2900 కోట్లా..? అని ఆవేదన వ్యక్తం చేశారు. సీమెన్స్ కంపెనీ నుంచి రావాల్సిన సాఫ్ట్ వేర్.. ఎక్విప్మెంట్ రాలేదే..? అని ప్రశ్నించారు. మా ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు ఎలాంటి అప్రిసియేషన్ లెటర్ ఇవ్వలేదు. అర్జా శ్రీకాంత్ గత ప్రభుత్వంలోనే స్కిల్ డెవలపెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమితులయ్యారని తెలిపారు. చాలా స్కిల్ సెంటర్లల్లో సరైన టూల్స్ లేవు.. చంద్రబాబు ఇంత అవినీతి చేసి.. ఎందుకు జైలుకెళ్లారని అందరూ బాధ పడుతున్నారు.. చంద్రబాబు పరిస్థితిని చూసి జాలి పడుతున్నారంటూ మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. మరోవైపు.. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో కామెంట్ చేసిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అన్నారు బొత్స.. ఇలాంటి తప్పులు చేస్తే వదిలేయొచ్చా అని తెలంగాణ సీఎం కేసీఆర్ను పోచారం అడగాలన్న ఆయన.. పోచారం లాంటి వ్యక్తులు రాజకీయం కోసం మాట్లాడొచ్చు.. కానీ, వ్యవస్థలను తాకట్టు పెట్టేలా వ్యవహరించకూడదని హితవుపలికారు బొత్స.
తాజావార్తలు
-
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
-
Varanasi Movie Update: ‘వారణాసి’కి రాజమౌళి డెడ్లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
-
Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్గా నివిన్ పౌలి.. ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్’ బ్లాక్ బస్టర్
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!