Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Boora Narsaiah Goud Said That Brs Has Given Tickets Again To Mlas Accused Of Corruption

Boora Narsaiah Goud: అవినీతి ఆరోపణలున్న ఎమ్మెల్యేలకే మళ్లీ టిక్కెట్ల కేటాయింపు

Published Date :August 24, 2023 , 3:09 pm
By NTV WebDesk
Boora Narsaiah Goud: అవినీతి ఆరోపణలున్న ఎమ్మెల్యేలకే మళ్లీ టిక్కెట్ల కేటాయింపు
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలపై, మోసపూరిత పాలనపై పోరాటం చేస్తున్న బీజేపీ శ్రేణులపై దాడులకు, లాఠీచార్జ్ లకు పాల్పడుతూ అణచివేయాలని చూస్తోంది అని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న పోరాటాలను అణచివేయాలని చూడటం దుర్మార్గ చర్యే అని ఆయన వ్యాఖ్యనించారు. కార్యకర్తలు తలుచుకుంటే మీకంటే ఎక్కువ హింసాయుత రాజకీయాలు చేయగలరని హెచ్చరించాడు.

Read Also: BRICS Summit: బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీతో జిన్‌పింగ్ సంభాషణలు

పోలీసులు బీఆర్ఎస్ నాయకులకు, ఎమ్మెల్యేలకు ఉద్యోగులు కాదు.. వారి బాధ్యతలను పారదర్శకంగా నిర్వహించాలని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. రాజకీయ పార్టీలకు తొత్తులుగా వ్యవహరించొద్దు.. లేదంటే మిలియన్ మార్చ్ తరహాలో ప్రగతిభవన్ ముట్టడిస్తామని మాజీ ఎంపీ ప్రకటించారు. ఆర్ఎస్ 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి సాహసోపేతమైన చర్యగా చెప్పుకుంటోంది. అయితే బీఆర్ఎస్ నేతలవి మేకపోతు గాంభీర్యమేనని ఆయన కామెంట్స్ చేశాడు.

Read Also: Life Tax On EV’s: ఎలక్టిక్ వాహనాలకు ఇకపై ఆ పన్ను కట్టాల్సిందే.. మినహాయింపుకు ఇక సెలవు

అవినీతి ఆరోపణలున్న ఎమ్మెల్యేలకే మళ్లీ టిక్కెట్లు కేటాయించడం వెనుక ఉద్దేశం ఏంటని బూర నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజకీయ వెట్టిచాకిరికి అలవాటుపడి ఉన్నారు.. వారంతా సీఎం కోసం పడిగాపులు కాయడానికి అలవాటుపడ్డారు.. బాధను కూడా ఆనందించే జబ్బు (మెసోడిజం)తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. అనకొండల్లాగా అవినీతి సొమ్ముతో ఒక్కో చిన్న రాష్ట్రాలను పెట్టుబడి పెట్టె అంత సంపాదించారు అని బూర ఆరోపించారు. వారిని తొలగిస్తే.. కొత్త అభ్యర్థిని ఓడిస్తారని కేసీఆర్ కి భయం పట్టుకుందని ఆయన చెప్పారు.

Read Also: Asia Cup 2023: మార్పులు అవసరం లేదు.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ సెలెక్టర్!

కేసీఆర్ ది ఫ్యూడల్ డీఎన్ఏ.. వేసుకునే బట్టల నుంచి వ్యవస్థలో విధానాల వరకు ఫ్యూడలిజమే.. ప్రపంచంలో నెంబర్-1 బినామీ పొలిటీషియన్ కేసీఆర్. లక్ష కోట్ల ధనమున్న ఆయనే ఓటమి భయంతోనే రెండుచోట్ల పోటీకి దిగుతున్నాడు అని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. బీసీ వ్యతిరేకి కేసీఆర్.. బీసీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించకుండా దుర్మార్గ వైఖరితో వ్యవహరిస్తున్నాడు.. కామారెడ్డిలో కూడా బీసీ నేత గంప గోవర్ధన్ కి మొండిచేయి చూపి.. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు.. ముదిరాజులకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం బాధాకరం.. గౌడ సామాజిక వర్గంలో పాత వారికే నలుగురికి టిక్కెట్లు కేటాయించుకున్నారు.. యాదవ సామాజిక వర్గంలో గతంలో ఉన్న ఐదురికే టిక్కెట్లు ఇచ్చారు.. కురుమలు, రజకులు, కుమ్మరులు, వడ్డెర, లింగాయత్, విశ్వకర్మలు, బోయ వాల్మీకి, మేదర, గంగపుత్రులు సహా బీసీల్లోని మిగతా సామాజిక వర్గాల నుంచి బీఆర్ఎస్ కు టిక్కెట్లు కేటాయించకుండా బీసీ ద్రోహి పార్టీగా వ్యవహరిస్తోంది అని ఆయన వ్యాఖ్యనించారు.

Read Also: PM Modi: 2024 నుంచి బ్రిక్స్‌లో మరో ఆరు దేశాలు

తెలంగాణలో కోటి 60 లక్షల మేర ఓటర్లు ఉన్న బీసీ సామాజిక వర్గం ఆలోచించుకోవాలి అని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పాలి.. తొలి బీసీ ప్రధానిని చేసింది బీజేపీ పార్టీనే.. 29 కేంద్ర మంత్రులను చేసింది బీజేపీనే.. బీసీలకు న్యాయం చేసేది నరేంద్ర మోడీ ప్రభుత్వమే.. రూ. 13 వేల కోట్లతో విశ్వకర్మ యోజనను ప్రారంభించింది.. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీలకు స్వర్ణయుగం వస్తుంది అని బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • Boora Narsaiah Goud
  • BRS Party
  • corruption MLAs
  • telangana

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : మళ్లీ డ్రోన్లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌..

  • Sanju Samson: సంజూ సెలబ్రేషన్ వివాదం.. భావోద్వేగంలో బిగ్ మిస్టెక్.. ఐసీసీ చర్యలు తప్పవా?

  • Shimron Hetmyer: మ్యాచ్ ఓడినా భారీ రికార్డ్ సృష్టించిన విండీస్ ప్లేయర్..!

  • Suryakumar Yadav: మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుంది.. సంజు కష్టమే గెలిపించింది!

  • Gautam Gambhir: “సంజూ ఏంటో మాకు తెలుసు”.. వాళ్లకు ఇచ్చిపడేసిన కోచ్ గౌతమ్ గంభీర్

ట్రెండింగ్‌

  • Sanju Samson Record: సంజు శాంసన్‌ రేర్ రికార్డు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్!

  • Sanju Samson: ఈ రోజు కోసమే ఎదురుచూశా.. నా జీవితంలో ఈ ఇన్నింగ్స్‌ను మర్చిపోలేను!

  • The IQ Era థీమ్‌తో MWC 2026 నేడే ప్రారంభం.. ఏ కొత్త ఫోన్ల లాంచ్‌ కానున్నాయంటే..!

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions