West Bengal: పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఇద్దరు చిన్నారులు సహా నలుగురికి తీవ్ర గాయాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మరో బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. కూచ్బెహార్లోని దిన్హటాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ బాంబు పేలుడు ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వారిని దిన్హటా జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Animal Diseases : వర్షాకాలంలో జీవాలకు వచ్చే వ్యాధులు.. నివారణ చర్యలు..
Also Read
- Ramani Kalyanam : వీల్చైర్లో హీరో.. అంధురాలిగా హీరోయిన్..
- Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
- 48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో దిన్హటాలోని గోసానిమరీ ప్రాంతంలోని ఛోటా నట్బరీలో 4-5సార్లు బాంబు పేలుళ్లు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. కూచ్బెహార్లోని సత్తార్ మియా అనే వ్యక్తి ఇంట్లో పేలుడు సంభవించిందని కూచ్బెహార్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ సన్నీ రాజ్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు చెబుతున్నారు. సత్తార్ ఇంటికి బాంబు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Jabardast Varsha : పువ్వుల్లో.. పువ్వులా కలిసిపోయి వర్ష కిర్రాక్ పోజులు..
ఇంతకు ముందు కూడా రాష్ట్రంలో చాలా చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఆ ఘటనలో కొందరు చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం దిన్హతరీలోని గిటల్దా ప్రాంతంలో ఘర్షణ జరిగింది. దీంతో మరణాలు కూడా సంభవించాయి. కేంద్ర సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్ కూడా దిన్హటాలో టిఎంసి మద్దతుదారులపై దాడి చేశారని ఆరోపించారు. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఇటీవల దిన్హతాను సందర్శించారు. గిటాల్దాహే బాధిత కుటుంబాలతో ఫోన్లో మాట్లాడారు. గవర్నర్ సోమవారం కోల్కతాకు తిరిగి రాగా.. మరుసటి రోజు బాంబుపేలుడు ఘటన జరిగింది.
NCP Crisis: బీజేపీతో కలవాలని ఎమ్మెల్యేలంతా శరద్ పవార్ని కోరారు.. ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు..
పంచాయితీ ఎన్నికలకు పశ్చిమ బెంగాల్ నామినేషన్ ప్రారంభమైనప్పటి.. హింస, ఘర్షణలు, బాంబు దాడుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ బాంబులు రికవరీ అవుతున్నాయి. ఇంకా ఎన్నికలకు నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అంతకుముందు మంగళవారం ఉదయం భాంఘర్లో ISF మరియు TMC మద్దతుదారుల మధ్య ఘర్షణ మరియు బాంబు దాడి జరిగింది. ఇప్పుడు దినాజ్పూర్లోని దిన్హటాలో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది.
- Tags
- blast
- Bomb
- injure
- people
- West Bengal
తాజావార్తలు
-
Ramani Kalyanam : వీల్చైర్లో హీరో.. అంధురాలిగా హీరోయిన్..
-
Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
-
Aadi Saikumar : ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్మెంట్: ‘శంభల’ టీమ్తో మరో క్రేజీ ప్రయోగం!
ట్రెండింగ్
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..