West Bengal: పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఇద్దరు చిన్నారులు సహా నలుగురికి తీవ్ర గాయాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మరో బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. కూచ్బెహార్లోని దిన్హటాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ బాంబు పేలుడు ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వారిని దిన్హటా జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Animal Diseases : వర్షాకాలంలో జీవాలకు వచ్చే వ్యాధులు.. నివారణ చర్యలు..
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో దిన్హటాలోని గోసానిమరీ ప్రాంతంలోని ఛోటా నట్బరీలో 4-5సార్లు బాంబు పేలుళ్లు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. కూచ్బెహార్లోని సత్తార్ మియా అనే వ్యక్తి ఇంట్లో పేలుడు సంభవించిందని కూచ్బెహార్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ సన్నీ రాజ్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు చెబుతున్నారు. సత్తార్ ఇంటికి బాంబు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Jabardast Varsha : పువ్వుల్లో.. పువ్వులా కలిసిపోయి వర్ష కిర్రాక్ పోజులు..
ఇంతకు ముందు కూడా రాష్ట్రంలో చాలా చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఆ ఘటనలో కొందరు చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం దిన్హతరీలోని గిటల్దా ప్రాంతంలో ఘర్షణ జరిగింది. దీంతో మరణాలు కూడా సంభవించాయి. కేంద్ర సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్ కూడా దిన్హటాలో టిఎంసి మద్దతుదారులపై దాడి చేశారని ఆరోపించారు. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఇటీవల దిన్హతాను సందర్శించారు. గిటాల్దాహే బాధిత కుటుంబాలతో ఫోన్లో మాట్లాడారు. గవర్నర్ సోమవారం కోల్కతాకు తిరిగి రాగా.. మరుసటి రోజు బాంబుపేలుడు ఘటన జరిగింది.
NCP Crisis: బీజేపీతో కలవాలని ఎమ్మెల్యేలంతా శరద్ పవార్ని కోరారు.. ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు..
పంచాయితీ ఎన్నికలకు పశ్చిమ బెంగాల్ నామినేషన్ ప్రారంభమైనప్పటి.. హింస, ఘర్షణలు, బాంబు దాడుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ బాంబులు రికవరీ అవుతున్నాయి. ఇంకా ఎన్నికలకు నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అంతకుముందు మంగళవారం ఉదయం భాంఘర్లో ISF మరియు TMC మద్దతుదారుల మధ్య ఘర్షణ మరియు బాంబు దాడి జరిగింది. ఇప్పుడు దినాజ్పూర్లోని దిన్హటాలో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది.
- Tags
- blast
- Bomb
- injure
- people
- West Bengal
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?