West Bengal: పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఇద్దరు చిన్నారులు సహా నలుగురికి తీవ్ర గాయాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మరో బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. కూచ్బెహార్లోని దిన్హటాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ బాంబు పేలుడు ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వారిని దిన్హటా జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Animal Diseases : వర్షాకాలంలో జీవాలకు వచ్చే వ్యాధులు.. నివారణ చర్యలు..
Also Read
- Nepal Floods: నేపాల్లకు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
- Maharashtra: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఊరట.. వివాదం వేళ మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది గడువు
- India Test Record: లంక గడ్డపై టీమ్ ఇండియా చరిత్ర.. 2010 నుంచి చెక్కుచెదరని రికార్డు
- Operation Sindoor: S-400లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచారులు.. ఆపరేషన్ సిందూర్పై కీలక విషయాలు
మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో దిన్హటాలోని గోసానిమరీ ప్రాంతంలోని ఛోటా నట్బరీలో 4-5సార్లు బాంబు పేలుళ్లు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. కూచ్బెహార్లోని సత్తార్ మియా అనే వ్యక్తి ఇంట్లో పేలుడు సంభవించిందని కూచ్బెహార్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ సన్నీ రాజ్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు చెబుతున్నారు. సత్తార్ ఇంటికి బాంబు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Jabardast Varsha : పువ్వుల్లో.. పువ్వులా కలిసిపోయి వర్ష కిర్రాక్ పోజులు..
ఇంతకు ముందు కూడా రాష్ట్రంలో చాలా చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఆ ఘటనలో కొందరు చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం దిన్హతరీలోని గిటల్దా ప్రాంతంలో ఘర్షణ జరిగింది. దీంతో మరణాలు కూడా సంభవించాయి. కేంద్ర సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్ కూడా దిన్హటాలో టిఎంసి మద్దతుదారులపై దాడి చేశారని ఆరోపించారు. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఇటీవల దిన్హతాను సందర్శించారు. గిటాల్దాహే బాధిత కుటుంబాలతో ఫోన్లో మాట్లాడారు. గవర్నర్ సోమవారం కోల్కతాకు తిరిగి రాగా.. మరుసటి రోజు బాంబుపేలుడు ఘటన జరిగింది.
NCP Crisis: బీజేపీతో కలవాలని ఎమ్మెల్యేలంతా శరద్ పవార్ని కోరారు.. ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు..
పంచాయితీ ఎన్నికలకు పశ్చిమ బెంగాల్ నామినేషన్ ప్రారంభమైనప్పటి.. హింస, ఘర్షణలు, బాంబు దాడుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ బాంబులు రికవరీ అవుతున్నాయి. ఇంకా ఎన్నికలకు నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అంతకుముందు మంగళవారం ఉదయం భాంఘర్లో ISF మరియు TMC మద్దతుదారుల మధ్య ఘర్షణ మరియు బాంబు దాడి జరిగింది. ఇప్పుడు దినాజ్పూర్లోని దిన్హటాలో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది.
- Tags
- blast
- Bomb
- injure
- people
- West Bengal
తాజావార్తలు
-
Government Action : వనపర్తిలో బుల్డోజర్ యాక్షన్.. రూ.52 కోట్ల బకాయిలపై ఉక్కుపాదం
-
Nepal Floods: నేపాల్లకు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
-
Maharashtra: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఊరట.. వివాదం వేళ మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది గడువు
-
India Test Record: లంక గడ్డపై టీమ్ ఇండియా చరిత్ర.. 2010 నుంచి చెక్కుచెదరని రికార్డు
-
Operation Sindoor: S-400లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచారులు.. ఆపరేషన్ సిందూర్పై కీలక విషయాలు
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!