West Bengal: పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఇద్దరు చిన్నారులు సహా నలుగురికి తీవ్ర గాయాలు..!
West Bengal: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మరో బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. కూచ్బెహార్లోని దిన్హటాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ బాంబు పేలుడు ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వారిని దిన్హటా జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Animal Diseases : వర్షాకాలంలో జీవాలకు వచ్చే వ్యాధులు.. నివారణ చర్యలు..
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో దిన్హటాలోని గోసానిమరీ ప్రాంతంలోని ఛోటా నట్బరీలో 4-5సార్లు బాంబు పేలుళ్లు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. కూచ్బెహార్లోని సత్తార్ మియా అనే వ్యక్తి ఇంట్లో పేలుడు సంభవించిందని కూచ్బెహార్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ సన్నీ రాజ్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు చెబుతున్నారు. సత్తార్ ఇంటికి బాంబు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Jabardast Varsha : పువ్వుల్లో.. పువ్వులా కలిసిపోయి వర్ష కిర్రాక్ పోజులు..
ఇంతకు ముందు కూడా రాష్ట్రంలో చాలా చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఆ ఘటనలో కొందరు చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం దిన్హతరీలోని గిటల్దా ప్రాంతంలో ఘర్షణ జరిగింది. దీంతో మరణాలు కూడా సంభవించాయి. కేంద్ర సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్ కూడా దిన్హటాలో టిఎంసి మద్దతుదారులపై దాడి చేశారని ఆరోపించారు. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఇటీవల దిన్హతాను సందర్శించారు. గిటాల్దాహే బాధిత కుటుంబాలతో ఫోన్లో మాట్లాడారు. గవర్నర్ సోమవారం కోల్కతాకు తిరిగి రాగా.. మరుసటి రోజు బాంబుపేలుడు ఘటన జరిగింది.
NCP Crisis: బీజేపీతో కలవాలని ఎమ్మెల్యేలంతా శరద్ పవార్ని కోరారు.. ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు..
పంచాయితీ ఎన్నికలకు పశ్చిమ బెంగాల్ నామినేషన్ ప్రారంభమైనప్పటి.. హింస, ఘర్షణలు, బాంబు దాడుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ బాంబులు రికవరీ అవుతున్నాయి. ఇంకా ఎన్నికలకు నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అంతకుముందు మంగళవారం ఉదయం భాంఘర్లో ISF మరియు TMC మద్దతుదారుల మధ్య ఘర్షణ మరియు బాంబు దాడి జరిగింది. ఇప్పుడు దినాజ్పూర్లోని దిన్హటాలో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది.
- Tags
- blast
- Bomb
- injure
- people
- West Bengal
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!