Tejasvi Surya: రాహుల్ గాంధీతో చర్చకు బీజేవైఎం సిద్ధం.. అభినవ్ ప్రకాశ్ పేరు ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో బహిరంగ చర్చకు బీజేపీ యువమోర్చా ఉపాధ్యక్షుడు అభినవ్ ప్రకాశ్ పేరును సోమవారం నామినేట్ చేసింది. భారతీయ జనతా యువమోర్చా ప్రెసిడెంట్ తేజస్వి సూర్య రాహుల్ గాంధీకి రాసిన లేఖలో, ‘ఇది రాజకీయ కుటుంబానికి చెందిన వారసులు, సాధారణ యువకులకు మధ్య గొప్ప చర్చ అవుతుంది’ అని రాశారు. బహిరంగ చర్చకు ఆహ్వానిస్తూ.. సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులకు చెందిన ఇద్దరు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ ఎపి షాలు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై సీనియర్ జర్నలిస్టు ఎన్. రామ్ కూడా సంతకం చేశారు. బహిరంగ చర్చకు ఆహ్వానాన్ని స్వీకరిస్తూ ప్రధాని ఇందులో పాల్గొంటారని దేశం ఆశిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. అయితే, రాహుల్ గాంధీకి కాంగ్రెస్లో కూడా విశ్వసనీయత లేదని, మోడీతో చర్చించడానికి ఎలాంటి అర్హత లేదని బీజేపీ చర్చా ఆహ్వానాన్ని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఈ చర్చకు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు అభినవ్ ప్రకాష్ పేరును ఖరారు చేస్తూ.. కాంగ్రెస్ కు లేఖ రాశారు. ఈ లేఖను తేజస్వీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
READ MORE: Palnadu: పల్నాడు జిల్లాలో టెన్షన్.. టీడీపీ- వైసీపీ నేతల మధ్య మరోసారి వివాదం..!
Also Read
- Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
- Cricket Player: బోర్డును బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి కెరీర్ క్లోజ్..
- Ind Vs SL: ఊహించని రీతిలో రెచ్చిపోయిన శ్రీలంక బ్యాటర్స్.. చేతులెత్తేసిన టీమిండియా ఆటగాళ్లు..
- Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్నినో ప్రభావం’..
‘మీ ఆమోదం కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము, స్వాతంత్ర్యం తర్వాత భారతదేశాన్ని ఎక్కువ కాలం పాలించిన రాజకీయ కుటుంబానికి చెందిన వారసుడు, ప్రధాని నరేంద్ర మోడీ న్యూ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక చారిత్రాత్మక చర్చకు వేదిక సృష్టించవచ్చు.” అని తేజస్వీ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. అభినవ్ ప్రకాష్ పాసి ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా విద్యావంతుడని తన లేఖలో పేర్కొన్నారు. ఇంతలో, అభినవ్ ప్రకాష్ తనతో రాహుల్ గాంధీ చర్చకు సిద్ధంగా ఉంటారని ఆశిస్తున్నట్లు ఎక్స్లో రాశారు. అభినవ్ ప్రకాష్ తన X పోస్ట్లో, ‘నన్ను నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు తేజస్వి సూర్య. రాహుల్ గాంధీ నాతో చర్చకు అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పాలన, ఉపాధి ఇలా అన్ని విషయాలపై బహిరంగ చర్చ జరగాలి.” అని రాసుకొచ్చారు.
Dear Rahul Gandhi Ji,
BJYM has deputed Sri @Abhina_Prakash, our VP, to debate with you.
He is a young and educated leader from the Pasi (SC) community, who are around 30%, in Rae Baraeli.
It will be an enriching debate between a political scion and a common youngster who… pic.twitter.com/8FarSmqrQe
— Tejasvi Surya (ಮೋದಿಯ ಪರಿವಾರ) (@Tejasvi_Surya) May 13, 2024
- Tags
- Abhinav Prakash
- bjp
- Bjym
- congress
- modi
తాజావార్తలు
-
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
-
Cricket Player: బోర్డును బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి కెరీర్ క్లోజ్..
-
Ind Vs SL: ఊహించని రీతిలో రెచ్చిపోయిన శ్రీలంక బ్యాటర్స్.. చేతులెత్తేసిన టీమిండియా ఆటగాళ్లు..
-
Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్నినో ప్రభావం’..
-
Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్కు స్పష్టం చేసిన భారత్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!